అశోక్ గజపతి రాజు కుటుంబం రూ వెయ్యి కోట్ల విలువైన భూమి దానం..!!

By Sai Chaitanya

పూజపాటి రాజవంశీయులు మరో భారీ విరాళం ప్రకటించారు. విజయనగరంలో పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబానికి వారి పూర్వీకుల నుంచి రాజ కుటుంబంగా గుర్తింపు ఉంది. ఇప్పటికే విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజల కోసం రూ.వేల కోట్ల ఆస్తులను వదులుకున్నారు. ఇప్పుడు సుమారు రూ.1000 కోట్లు విలువైన భూమిని విరాళం ఇచ్చేందుకు అశోక్ గజపతి రాజు కుటుంబం ముందుకు వచ్చింది. విశాఖలో ఖరీదైన భీమిలి వద్ద ఉన్న భూమిని విరాళం గా ప్రకటించారు.

గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు కుటుంబం రూ వెయ్యి కోట్ల విలువైన భూమిని దానం చేసేందు కు ముందుకు వచ్చింది. ఏవియేషన్ ఎడ్యుసిటీ కోసం విశాఖపట్నం జిల్లా భీమిలిమండలం అన్నవరం వద్ద మాన్సాస్‌ ట్రస్టుకు చెందిన 136.63 ఎకరాలను ఏవియేషన్‌ ప్రాజెక్టుకు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. పౌరవిమానయాన రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా ప్రపంచంలో పౌరవిమానయానానికి సంబంధించిన యూనివర్సిటీ బ్రాంచ్‌లను ఒకచోటకు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. భోగాపురం ఎయిర్‌పోర్టు సమీపంలోని ప్రభుత్వ భూముల్లో కానీ.. రైతుల నుంచి సేకరించిన భూముల్లో కానీ ఏవియేషన్‌ ప్రాజెక్టు నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన గా ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం చేపడుతున్న జీఎంఆర్‌ సంస్థ ఇందుకు ముందుకొచ్చింది.

జగన్ కేసుల విచారణ మళ్లీ మొదటికే, తాజా నిర్ణయంతో ఇక..!!


governor-ashok-gajapthi-raju-donates-rs-1000-value-land-for-aviation-edu-city

కాగా, ఈ ప్రాజెక్టు కోసం మాన్సాస్‌ ట్రస్ట్‌ తరఫున రూ.1000 కోట్ల విలువైన 136.63 ఎకరాల భూమిని ఇచ్చేందుకు గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ముందుకు వచ్చారు. ఈ ప్రాజెక్టుకు తమ రాజవంశీయుడైన అలక్‌ మహారాజా గజపతి పేరు పెట్టాలని కోరారు. అయితే... అప్పట్లోనే పూసపాటి రాజవంశీయులకు రెండు సొంత విమానాలు ఉండేవి. అశోక్‌ గజపతిరాజు సైతం పైలట్‌ కావాలనుకున్నారు కానీ అది సాకారం కాలేదు. పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు.

ఆయన హయాంలోనే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఏవియేషన్‌ ఎడ్యుకేషన్‌ సిటీలో వీరి కుటుంబానికి భాగస్వామ్యం దక్కింది. ఇటీవల విశాఖలో ఒప్పందం జరగగా.. ఏవియేషన్‌ ఎడ్యుసిటీకి 136.63 ఎకరాలు భూములు కేటాయించేలా దేవదాయశాఖ అనుమతులిచ్చేందుకు సమ్మతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో మాన్సాస్‌ తరఫున ఏవియేషన్‌ ఎడ్యుసిటీ ప్రాజెక్టుకు భూములు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు వెల్లడించారు.

Credit: Oneindia

Desktop Bottom Promotion