పోషకాహారం పిల్లల తెలివి పెంచుతుంది

By B N Sharma

Good Nutrition
పిల్లలకు మనం ఇచ్చే పోషకాహారం వారి విద్యను మెరుగుపరుస్తుందని నిపుణులు చెపుతున్నారు. పోషకాహారం సరిఅయిన విలువలు లేనిదైతే స్కూలులో వారి విద్య వెనుకబడి వుంటుందని, ఆశించిన రీతిలో పిల్లలు తమ చదువును కొనసాగించలేరని సిన్సినాటి ఛిల్డ్రన్ సంస్ధ లోని న్యూట్రిషన్ ధిరపీ క్లనికల్ మేనేజర్ మేరీ పాట్ ఆల్ ఫ్రో అనేక రీసెర్చి స్టడీలు చేసి వెల్లడించారు.

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ కారణం చేతా ఉదయం బ్రేక్ ఫాస్టు, మధ్యాహ్నం లంచ్ లు మిస్ చేయరాదని దీని వలన వారు రోజంతా స్కూలు విద్యలో వెనుకబడే అవకాశాలున్నాయని తెలిపారు. బ్రేక్ ఫాస్టులో వివిధ రకాల ఆహారం, ప్రత్యేకించి అధిక ఫైబర్ కలది, పండ్లు, పాల ఉత్పత్తులు వుండాలన్నారు.

లంచ్ లో సగ భాగం పండ్లు, వెజిటబుల్స్, సగభాగం పప్పులు, ధాన్యాలతో కూడిన ఆహారం ఉండాలన్నారు. అయితే కొవ్వు పదార్ధాలు, స్వీట్లు వీలైనంతవరకు ఇవ్వరాదు. ప్రతి రోజు బ్రెడ్ లేదా శాండ్ విచెస్ లాంటి రొటీన్ ఆహారం కాకుండా వివిధ రకాల ఆహారాలు ఇచ్చి వారికి బోర్ కొట్టకుండా తినేటందుకు ఆసక్తి కలిగేలా చూడాలి. వారికి ఏది తినటానికి ఇచ్చినప్పటికి ప్రత్యేకించి పండ్ల విషయంలో తేలికగా వారు తినదగినవిగా ఇవ్వాలి. ఉదాహరణకు ద్రాక్ష పండ్లు, కట్ చేసిన ఆపిల్ ముక్కలు, స్ట్రా బెర్రీలు, వాటర్ మెలన్ ముక్కలు మొదలైనవి అందించాలి. ఇక పిల్లలు తాగే డ్రింకులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. డ్రింక్స్ లో తక్కువ కొవ్వు, లేదా షుగర్ లేనివిగా వుండాలి. కేఫైన్ లేదా ఇతర ఔషధ గుణాలున్న వాటిని పిల్లలు తాగటానికి ఇష్టపడరు.

Story first published: Wednesday, August 10, 2011, 10:18 [IST]
Desktop Bottom Promotion