Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
పరీక్షల కాలంలో తల్లి తండ్రులు పిల్లలలో ఒత్తిడిని ఎలా తగ్గించవచ్చు
మార్చ్, ఏప్రిల్ నెలల్లో పిల్లలతో కళకళ్లాడే వీధులనీ బోసిపోయి ఉంటాయి.పిల్లల నవ్వుల సవ్వడులు, వారి సైకిల్ చక్రాల చప్పుళ్ళు, వారి అరుపులు, కేకలూ ఇవేవీ వినిపించవు ప్లే గ్రౌండ్స్లో.అవును, ఈ రెండు నెలలూ పిల్లలూ వారి తల్లి తండ్రులూ ఇద్దరికీ పరీక్షల కాలమే.పరీక్షలు మొదలయ్యే ఈ నెలలో పరీక్షలని ఎదుర్కోబొయే, పిల్లలూ వారి తల్లి తండ్రులలో ఆందోళనా ,ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉంటాయి నువ్వు బాగా చదవాలి, మార్కులు బాగా తెచ్చుకోవాలి అని పిల్లలని ఈ సమయంలో ఒత్తిడిలోకి నెట్టకూడదని నిపుణుల సూచన.
అవసరమైనంత చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవడం ద్వారా మీరు జీవితంలో అనుకున్న దానిలో స్థిరపడగలరు.పరీక్షల కాలంలో పిల్లలని మరిన్ని ఎక్కువ గంటలు చదవమని చెప్తే వారు శారీరకంగా మరియూ మానసికంగా కూడా అలసటకి గురయ్యే అవకాశం ఉంది.ఈ పరీక్షా సమయంలో తల్లి తండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి ఏమి చేస్తే వారు ఒత్తిడిని జయించి మంచి మార్కులు తెచ్చుకుంటారో మేము ఈ ఆర్టికిల్ ద్వారా తెలియచేస్తున్నాము.పిల్లలు ఇన్ని మార్కులు తెచ్చుకోవాలి అని అనుకునే ముందు అసలు మీ పిల్లలని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి.మీ పిల్లలు పరీక్షలకి సన్నద్ధమవుతోంటే కనుక మీరు వారి ఒత్తిడి ని తీసెయ్యడంలో ఎలా సహాయ పడగలరో క్రింద ఇచ్చాము చూడండి.

ప్రశాంత వాతావరణం:
పరీక్షలు కదా అని మీ ఇంట్లో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపింపచేసేటట్లు చెయ్యకండి.పరీక్షలప్పుడు ఆహ్లాదకర వాతావరణంలో చదువుకుంటే వారు మరింత శ్రద్ధగా చదవగలరు.

మధ్య మధ్యలో విరామం:
మధ్యలో విరామం లేకుండా అలా చదువుతూనే ఉంటే పిల్లలు అలసిపోతారు. అందువల్ల వారికి మధ్య మధ్యలో కాస్త విరామం ఇచ్చి వారి గది నుండి బయటకొచ్చి కాసేపు సేద తీరేటట్లు చూడండి.చదువుకునేటప్పుడు ఏయే సమయాల్లో విశ్రాంతి తీసుకోవాలో ముందరే నిర్ణయించి వారు ఆ సమయంలో పార్కులో కాసేపు నడక లేదా ఇతర వ్యాపకాల ద్వారా సేద తీరేటట్లు చూడండి.

బలవర్ధక ఆహారం:
జంక్ ఫుడ్ ని ఈ సమయంలో నిషేధించి వాటి స్థానంలో శక్తినిచ్చి పోషకాలు అధికంగా ఉండే ఆహారానికే ప్రాధాన్యతనివ్వండి.వారు చదువు మీదే దృష్టి నిలిపి, ఙాపకశక్తిని పెంచే ఆహారం ఇవ్వాలి.

ఆశావహ దృక్పధం:
పెరేంట్స్ కి ఈ దృక్పధం ఉంటే పిల్లలకి అది సునాయాసంగా వస్తుంది.మీరు కనుక మీ పిలల్లతో కూర్చుని వారిని పరీక్షలకి సన్నద్ధం చేస్తున్నట్లయితే కనుక ఆశావహ దృక్పధంతో పాజిటివ్ గా మాట్లాడి వారిలో శక్తిని నింపండి.

మంచి ర్యాంకుల కోసం ఒత్తిది పెట్టద్దు:
ఫలానా ర్యాంకు తెచ్చుకోవాలి అని పిల్లల నుండీ ఆశించే ముందు అసలు వారి శక్తి సామర్ధ్యాలని ముందు తెలుసుకోండి.వారి సామర్ధ్యానికి మించి మీకు కావాల్సినన్ని మార్కులు తెచ్చుకోవాలనడం భావ్యం కాదు.ఇలా ఒత్తిడి పెడితే వారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసిన వారవుతారు.

వారితో స్నేహితుల్లా మెలగండి:
పరీక్షల సమయంలో పిల్లలకి తల్లి తండ్రుల కంటే స్నేహితుల అవసరం బాగా ఉంటుంది.మీరు కనుక వారి వైపు నుండి ఆలోచిస్తే వారి శక్తి సామర్ధ్యాలు, వారు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో తెలుస్తుంది.

పిల్లలతో కలిసి వ్యాయామం చెయ్యడం:
పిల్లలు పరీక్షల ఒత్తిడిని జయించటానికి వారితో కలిసి రన్నింగ్, సైక్లింగ్, జాగింగ్ లాంటివి చెయ్యచ్చు.



Click it and Unblock the Notifications