బిడ్డ పుడితే మహిళలో కోర్కె తగ్గుతుందా?

By B N Sharma

Couple1
మహిళకు ఒకసారి శిశువు పుట్టిందంటే జీవితంలోనే అనేక మార్పులు వస్తాయి. శారీరకంగా కాక, సామాజికంగా, మానసికంగా కూడా ఈ మార్పులు వుంటాయి. ఈ మార్పులు ప్రతి మహిళకు విభిన్నంగా వుంటాయి. మహిళకుగల తల్లి అనుభవం ఆమెకుగల గత అనుభవాలతో ముడిపడి వుంటుంది.

మహిళలు బిడ్డ పుట్టటంతో తమ పాత్ర ముగిసిపోతోందని అలసట కలుగుతోందని కూడా బాధపడుతూంటారు. మరికొంతమంది మహిళలు ఒంటరి తనాన్ని భావిస్తారు. వారు ఎంతో నష్టపోయినట్లుగా కూడా భావిస్తారు. తాత్కాలికంగా కామవాంఛ వెనుకబడుతుంది. అయితే, తాము జన్మనిచ్చిన బేబీని పెంచడంలో మరోమారు ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. బేబీని పెంచటంలో ఆనందిస్తారు.

బిడ్డ పుట్టిన తర్వాత మహిళలో వచ్చే శారీరక మార్పులు అధికంగానే వుంటాయి. గర్భాశయం కుచించటం మొదలుపెడుతుంది. ఒక కిలోగ్రాము వరకు వుండే గర్భాశయం ఆరు వారాలయ్యే సరికి 100 గ్రాముల బరువుకు తగ్గుతుంది. కండరాలలో వుండే పీచు అంతా మాయమవుతుంది. రక్తస్రావం ఆగటానికి గానను గర్భాశయం మరింత కుచించుకుపోతూ వుంటుంది. ఈ సమయంలో ఆమె విపరీతమైన నొప్పికి గురవుతుంది. గతంలో ఒక బిడ్డ ప్రసవించిన వారికి ఈ నొప్పులు మరింత అధికంగా వుంటాయి.

Story first published: Monday, December 12, 2011, 17:09 [IST]
Desktop Bottom Promotion