Latest Updates
-
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా? -
తొలి ఏకాదశి తేదీ, తిథి, పూజా విధానం, ఉపవాసం ఎలా విరమించాలి.. పూర్తి వివరాలు.!
గర్భిణీల్లో న్యూట్రీషియన్స్ లోపం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ..!!
గర్భవతులుగా ఉన్నప్పుడు సరైన ఆహారాన్ని తీసుకోని తల్లులకి పుట్టిన పిల్లలలో గుండెకి త్వరగా వృద్ధాప్యం వాస్తుందని పరిశోధనలో నిరూపించబడింది.
గర్భవతులు తాము తీసుకునే ఆహారాన్ని కాస్త తాగించినా కానీ పుట్టే పిల్లల అవయవాలు వ్యాధులకి గురయ్యే ఆస్కారం ఉందని, వారిలో వృద్ధాప్యం కూడా త్వరగా వస్తుందనీ ఈ పరిశోధన తెలుపుతోంది.

దీనివల్ల హృదయ సంబంధ అనారోగ్యం దరి చేరుతుంది, వ్యాయామం చెయ్యలేరు మరియూ హై బీపీ, మధుమేహం లాంటి ఇతర అనారోగ్యాలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది.ఈ రెండు వ్యాధులూ హార్ట్ స్ట్రోక్కి కారణం అవుతాయి.తల్లులలో పోషకాహర లోపం వల్ల పిల్లలలో వచ్చే ఈ సమస్యలు అర్ధమయితే ముందరే జాగ్రత్త పడే అవకాశం ఉందని అమెరికాలోని తెక్సాస్ రాష్ట్రంలో ఉన్న జెఫ్రీ క్లార్క్ యూనివర్సిటీ తెలియచేస్తోంది.

ఈ పరిశొధనకోసం ఆడా మరియూ మగ బబూన్ల గుండెలని పరిశీలించారు.దీనికోసం ఎంచుకున్న బబూన్ల తల్లులు మామూలు బబూన్ల కంటే 30 శాతం తక్కువ ఆహారం తీసుకున్నాయి.

తక్కువ ఆహారం తీసుకున్న తల్లులలకి పుట్టిన బబూన్లలో వయసు పెరిగే కొద్దీ గుండె పనితీరు తగ్గుతోందని గమనించారు.
బబూన్లకి ఐదేళ్ళు(మనుష్యుల 20 సంవత్సరాలకి సమానం)వచ్చేసరికి గుండె పనితీరు పూర్తిగా క్షీణించిపోయింది.

ఆరోగ్యకరమైన పిల్లలు కావాలనుకుంటే గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారం ముఖ్య భూమిక పోషిస్తుంది.గర్భం ధరించడానికి ముందూ గర్భవతులుగా ఉన్నప్పుడూ తల్లుల పోషకాహారం మీద సమాజం శ్రద్ధ పెడితే అవయవలోపం ఉన్న పిల్లలు పుట్టరని వ్యోమింగ్ యూనివర్సిటీ(అమెరికా)ప్రొఫెసర్ పీటర్ నాథనిఎల్జ్ చెప్పారు.
జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ జర్నల్లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురించారు.



Click it and Unblock the Notifications