Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
గర్భిణీల్లో న్యూట్రీషియన్స్ లోపం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ..!!
గర్భవతులుగా ఉన్నప్పుడు సరైన ఆహారాన్ని తీసుకోని తల్లులకి పుట్టిన పిల్లలలో గుండెకి త్వరగా వృద్ధాప్యం వాస్తుందని పరిశోధనలో నిరూపించబడింది.
గర్భవతులు తాము తీసుకునే ఆహారాన్ని కాస్త తాగించినా కానీ పుట్టే పిల్లల అవయవాలు వ్యాధులకి గురయ్యే ఆస్కారం ఉందని, వారిలో వృద్ధాప్యం కూడా త్వరగా వస్తుందనీ ఈ పరిశోధన తెలుపుతోంది.

దీనివల్ల హృదయ సంబంధ అనారోగ్యం దరి చేరుతుంది, వ్యాయామం చెయ్యలేరు మరియూ హై బీపీ, మధుమేహం లాంటి ఇతర అనారోగ్యాలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది.ఈ రెండు వ్యాధులూ హార్ట్ స్ట్రోక్కి కారణం అవుతాయి.తల్లులలో పోషకాహర లోపం వల్ల పిల్లలలో వచ్చే ఈ సమస్యలు అర్ధమయితే ముందరే జాగ్రత్త పడే అవకాశం ఉందని అమెరికాలోని తెక్సాస్ రాష్ట్రంలో ఉన్న జెఫ్రీ క్లార్క్ యూనివర్సిటీ తెలియచేస్తోంది.

ఈ పరిశొధనకోసం ఆడా మరియూ మగ బబూన్ల గుండెలని పరిశీలించారు.దీనికోసం ఎంచుకున్న బబూన్ల తల్లులు మామూలు బబూన్ల కంటే 30 శాతం తక్కువ ఆహారం తీసుకున్నాయి.

తక్కువ ఆహారం తీసుకున్న తల్లులలకి పుట్టిన బబూన్లలో వయసు పెరిగే కొద్దీ గుండె పనితీరు తగ్గుతోందని గమనించారు.
బబూన్లకి ఐదేళ్ళు(మనుష్యుల 20 సంవత్సరాలకి సమానం)వచ్చేసరికి గుండె పనితీరు పూర్తిగా క్షీణించిపోయింది.

ఆరోగ్యకరమైన పిల్లలు కావాలనుకుంటే గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారం ముఖ్య భూమిక పోషిస్తుంది.గర్భం ధరించడానికి ముందూ గర్భవతులుగా ఉన్నప్పుడూ తల్లుల పోషకాహారం మీద సమాజం శ్రద్ధ పెడితే అవయవలోపం ఉన్న పిల్లలు పుట్టరని వ్యోమింగ్ యూనివర్సిటీ(అమెరికా)ప్రొఫెసర్ పీటర్ నాథనిఎల్జ్ చెప్పారు.
జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ జర్నల్లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురించారు.



Click it and Unblock the Notifications











