Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Andhra Ruchulu:ఆంధ్ర రుచులు: గోదావరి స్పెషల్ పులస పులుసు
పులస పులుసుకు ఒక విశేషం ఉంది చాలా కరీదైన చేపయైనా బ్రహ్మండమైన రుచి ఉంటుందని అంటారు. దీనికి సంబందించి ఒక సామెత కూడా ఉంది. పుస్తలు తాకట్టు పెటైనా పులస పులుసు తినాలి అనే వారట. అంత విశేషం ఉంది పులస చేపకి.
గోదావరి జిల్లాలు అనగానే కొబ్బరి చెట్లు, వెన్నెల్లో గోదారి.. పూతరేకులు, కాకినాడ కాజా ఇలా ఎన్నో గుర్తుకొస్తాయి. వీటన్నిటి తో పాటు వర్షాకాలం వచ్చిందంటే చటుక్కున గుర్తొచ్చేది ఇంకొకటి ఉంది. అదే పులస.. వర్షా కాలం గోదాట్లోకి వచ్చే కొత్త నీటికి ఎదురీదే పులస చేపంటే పెద్ద క్రేజ. ఎంతగా అంటే .. పెళ్ళాం పుస్తెలు తాకట్టి అయినా పులస కొనుక్కు తినాలన్నంతగా.. మరింకెందుకు ఆలస్యం వెంటనే ఈ చేపల పులుసును ఎలా తయారుచేయాలో చూసేద్దాం.

కావలసిన పదార్ధలు:
పులస చేప - 1
వేన్న - 1 tsp
చింతపండు- కావలసినంత
ధనియాలు- 2 tsp
మెంతులు - 1/4 tsp
ఉల్లిపాయలు- 2
పచ్చిమిరప - 6
ఆవాకాయనూనె - 2 tsp
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 2 tsp
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తిమిర- కొద్దిగా
తయారు చేయు పద్దతి:
1. మొదటగా పులస చేపని శుభ్రం చేసి కావాలసిన సైజులో కట్ చేసి
పెట్టుకోవాలి.
2. మెంతులు, దనియాలు, జిలకర్ర, ఆవాలు మిక్షర్ లో మెత్తగా గ్రైడ్ చేసి
పెట్టుకోవాలి.
3. ఉల్లిపాయను, పచ్చిమిరపను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన
పెట్టుకోవాలి.
4. తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి కాగిన తర్వాత
ఉల్లిపాయలు, పచ్చిమిరప, కొత్తిమిర వేసి దోరగా వేపాలి. వేగినాక గ్రైడ్
చేసి పెట్టుకొన్న మసాలా ముద్దను అందులో వేసి వేపాలి.
5. 5 నిమిషాలైనాక పులస చేప ముక్కలను, ఆవకాయనూనెను, ఉప్ప, కారం వేసి
వేపాలి చివరగా చింతపులుసు పోసి కలిపి ఉడకనివ్వాలి.
6. స్టౌ మీద నుండి దింపుకొనే ముందుగా కొద్దిగా వేన్న, కరివేపాకు
వేస్తే రంగుతో పాటు, రుచి కూడా బాగా వుంటుంది. ఇలా తయారైన పులస పులుసు
వేడి వేడిగా అథిదులకు వండించండి. రెండు మూడు రోజుల తర్వాత తిన్నా
టేస్ట్ అద్భుతంగా ఉంటుంది
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications