Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
పిండి నానబెట్టే శ్రమ లేదు..రుచితోపాటు ఆరోగ్యం అందించే ఓట్స్ మసాలా ఇడ్లీ..15 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? అదే ఇడ్లీ, దోశ తిని విసుగొచ్చిందా? అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఒక అద్భుతమైన వంటకం ఓట్స్ మసాలా ఇడ్లీ. పప్పు నానబెట్టడం, పిండి రుబ్బడం వంటి శ్రమ లేకుండా కేవలం 15 నిమిషాల్లో ఓట్స్ మసాలా ఇడ్లీ రెడీ చేసుకోవచ్చు. ఇది కేవలం రుచికరమైనదే కాదు, బరువు తగ్గాలనుకునేవారికి, ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి ఒక వరం లాంటిది. ఓట్స్ మసాలా ఇడ్లీ తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
-ఓట్స్ - 1 కప్పు
-బొంబాయి రవ్వ వేయించింది - అర కప్పు
-పుల్లటి పెరుగు - అర కప్పు
-తురిమిన క్యారెట్ - 2 టేబుల్ స్పూన్లు
-తురిమిన అల్లం - అర అంగుళం ముక్క
-తాలింపు కోసం: నూనె, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, చిటికెడు ఇంగువ,
కరివేపాకు
-వంటసోడా - అర టీస్పూన్
-ఉప్పు - రుచికి సరిపడా
-నీరు - తగినంత

తయారీ విధానం
-ముందుగా ఓట్స్ ను మిక్సీ జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వలా ఉండేలా పొడి చేసుకోవాలి.
-ఒక గిన్నెలో ఈ ఓట్స్ పొడి, వేయించిన బొంబాయి రవ్వ,పుల్లటి పెరుగు, తురిమిన క్యారెట్, అల్లం వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా ఇడ్లీ పిండిలా జారుగా కలుపుకోవాలి.
-ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టి అందులో కొద్దిగా నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ, కరివేపాకు వేసి చిటపటలాడించాలి. ఈ ఘుమఘుమలాడే తాలింపును పిండిలో వేసి బాగా కలపాలి.
-ఈ మిశ్రమాన్ని మూతపెట్టి ఓ 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. దీనివల్ల రవ్వ, ఓట్స్ చక్కగా నాని ఇడ్లీలు మెత్తగా వస్తాయి.
-చివరగా ఇడ్లీలు పెట్టే ముందు రుచికి సరిపడా ఉప్పు, వంటసోడా వేసి పిండిని ఒకే దిశలో నున్నగా కలపాలి.
-తర్వాత ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి పిండిని వేసి 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికిస్తే చాలు. అంతే వేడివేడి, మెత్తటి, సువాసనభరితమైన ఓట్స్ మసాలా ఇడ్లీ రెడీ.
ఈ ఓట్స్ మసాలా ఇడ్లీని కొబ్బరి చట్నీ లేదా సాంబార్ తో తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications