Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
వర్షాకాలానికి పర్ఫెక్ట్ స్పాక్..బయట క్రిస్పీగా,లోపల మెత్తగా..సగ్గుబియ్యం కట్ లెట్ ఎలా చేసుకోవాలంటే
మన వంటగదుల్లో ఉండే ముఖ్యమైన పదార్థాల్లో సగ్గుబియ్యం కూడా ఒకటి. దీనిని సాధారణంగా పాయసం చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సగ్గుబియ్యంతో కిచిడీ సహా అనేక వెరైటీ వంటకాలు కూడా తయారుచేస్తుంటారు. అయితే సగ్గుబియ్యం టిక్కీ ఎప్పుడైనా తిన్నారా? మహారాష్ట్రలో ఇది చాలా ఫేమస్. దీనిని తెలుగులో సగ్గుబియ్యం వడ లేదా సబ్బుబియ్యం కట్ లెట్ అని కూడా పిలుస్తారు. ఈ టిక్కీని సాధారణంగా ఉపవాసాల కోసం తయారు చేస్తారు. సగ్గుబియ్యం, బంగాళాదుంపలు,కొన్ని కారంగా ఉండే మసాలా దినుసుల రుచి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, మీరు దీన్ని మీకు కావలసినప్పుడు తయారు చేసుకోవచ్చు. మీకు కావాలంటే, మీరు దీన్ని పార్టీ స్నాక్ గా లేదా సాయంత్రం టీతో కూడా చేసుకోవచ్చు.
బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ టిక్కీ రెసిపీని తయారు చేయడం చాలా సులభం. ఈ టిక్కీని సాధారణంగా తవా మీద వేయించి తీసుకుంటారు, కానీ మీకు కావాలంటే మీరు దానిని కడాయిలో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో మీరు కరకరలాడే, రుచికరమైన ఏదైనా తినాలని కోరుకుంటే తప్పకుండా సగ్గుబియ్యం టిక్కీని ప్రయత్నించండి. ఈ రుచికరమైన టిక్కీని ఇంట్లో సులభంగా తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

సగ్గుబియ్యం- 1/2 కప్పు
ఉడికించిన బంగాళాదుంపలు - 3
అల్లం తురుము- 3 టీస్పూన్లు
పచ్చిమిర్చి - 2 టీస్పూన్లు
తెల్ల నువ్వులు - 2 టీస్పూన్లు
ఉప్పు - రుచి ప్రకారం
మొక్కజొన్న పిండి - 1 టీస్పూన్
వేయించిన వేరుశనగ పప్పు - 6 టేబుల్ స్పూన్లు
నూనె-వేయించడానికి సరిపడా
సగ్గుబియ్యం టిక్కీ తయారీ విధానం
-సగ్గుబియ్యంను జల్లెడలో తీసుకుని నీటితో బాగా కడగాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో సగ్గుబియ్యంను అర కప్పు నీటిలో దాదాపు 6-8 గంటలు నాననివ్వండి.
-తర్వాత నానిన సగ్గుబియ్యం తీసుకొని వాటిని గుజ్జు చేయండి. తర్వాత ఉడికించిన బంగాళాదుంపలను ఒక గిన్నెలో మెత్తగా చేయాలి. ఇందులోనే నానబెట్టి మెత్తగా గుజ్జు చేసిన సగ్గుబియ్యం కూడా వేసి మొత్తం కలిసేలా కలపండి. ఇందులోనే అల్లం తురుము, పచ్చిమిర్చి వేయండి.
-అందులోనే తెల్ల నువ్వులు, ఉప్పువేసి బాగా కలిపి, వాటిని పిండిలాంటి స్థిరత్వం వచ్చేలా చేయాలి. తర్వాత ఇందులో ఇప్పుడు వేరుశెనగ పప్పు, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సమాన భాగాలుగా విభజించి, రెండు అరచేతుల మధ్య సున్నితంగా నొక్కడం ద్వారా వాటిని చదును చేయండి.
-ఒక పాన్ లో నూనె వేడి చేయండి. వేడెక్కిన ఆయిల్ లో ఈ టిక్కీలను వేసి వేయించాలి. వాటిని గరిటతో మార్చుతూ వేయించుకుంటూ ఉండండి.
-రెండు వైపులా లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించి, గ్యాస్ ఆపివేసి, టిక్కీలను ప్లేట్ మీద ఉంచండి. అంతే సగ్గుబియ్యం టిక్కీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications