Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
వర్షాకాలానికి పర్ఫెక్ట్ స్పాక్..బయట క్రిస్పీగా,లోపల మెత్తగా..సగ్గుబియ్యం కట్ లెట్ ఎలా చేసుకోవాలంటే
మన వంటగదుల్లో ఉండే ముఖ్యమైన పదార్థాల్లో సగ్గుబియ్యం కూడా ఒకటి. దీనిని సాధారణంగా పాయసం చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సగ్గుబియ్యంతో కిచిడీ సహా అనేక వెరైటీ వంటకాలు కూడా తయారుచేస్తుంటారు. అయితే సగ్గుబియ్యం టిక్కీ ఎప్పుడైనా తిన్నారా? మహారాష్ట్రలో ఇది చాలా ఫేమస్. దీనిని తెలుగులో సగ్గుబియ్యం వడ లేదా సబ్బుబియ్యం కట్ లెట్ అని కూడా పిలుస్తారు. ఈ టిక్కీని సాధారణంగా ఉపవాసాల కోసం తయారు చేస్తారు. సగ్గుబియ్యం, బంగాళాదుంపలు,కొన్ని కారంగా ఉండే మసాలా దినుసుల రుచి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, మీరు దీన్ని మీకు కావలసినప్పుడు తయారు చేసుకోవచ్చు. మీకు కావాలంటే, మీరు దీన్ని పార్టీ స్నాక్ గా లేదా సాయంత్రం టీతో కూడా చేసుకోవచ్చు.
బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ టిక్కీ రెసిపీని తయారు చేయడం చాలా సులభం. ఈ టిక్కీని సాధారణంగా తవా మీద వేయించి తీసుకుంటారు, కానీ మీకు కావాలంటే మీరు దానిని కడాయిలో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో మీరు కరకరలాడే, రుచికరమైన ఏదైనా తినాలని కోరుకుంటే తప్పకుండా సగ్గుబియ్యం టిక్కీని ప్రయత్నించండి. ఈ రుచికరమైన టిక్కీని ఇంట్లో సులభంగా తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

సగ్గుబియ్యం- 1/2 కప్పు
ఉడికించిన బంగాళాదుంపలు - 3
అల్లం తురుము- 3 టీస్పూన్లు
పచ్చిమిర్చి - 2 టీస్పూన్లు
తెల్ల నువ్వులు - 2 టీస్పూన్లు
ఉప్పు - రుచి ప్రకారం
మొక్కజొన్న పిండి - 1 టీస్పూన్
వేయించిన వేరుశనగ పప్పు - 6 టేబుల్ స్పూన్లు
నూనె-వేయించడానికి సరిపడా
సగ్గుబియ్యం టిక్కీ తయారీ విధానం
-సగ్గుబియ్యంను జల్లెడలో తీసుకుని నీటితో బాగా కడగాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో సగ్గుబియ్యంను అర కప్పు నీటిలో దాదాపు 6-8 గంటలు నాననివ్వండి.
-తర్వాత నానిన సగ్గుబియ్యం తీసుకొని వాటిని గుజ్జు చేయండి. తర్వాత ఉడికించిన బంగాళాదుంపలను ఒక గిన్నెలో మెత్తగా చేయాలి. ఇందులోనే నానబెట్టి మెత్తగా గుజ్జు చేసిన సగ్గుబియ్యం కూడా వేసి మొత్తం కలిసేలా కలపండి. ఇందులోనే అల్లం తురుము, పచ్చిమిర్చి వేయండి.
-అందులోనే తెల్ల నువ్వులు, ఉప్పువేసి బాగా కలిపి, వాటిని పిండిలాంటి స్థిరత్వం వచ్చేలా చేయాలి. తర్వాత ఇందులో ఇప్పుడు వేరుశెనగ పప్పు, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సమాన భాగాలుగా విభజించి, రెండు అరచేతుల మధ్య సున్నితంగా నొక్కడం ద్వారా వాటిని చదును చేయండి.
-ఒక పాన్ లో నూనె వేడి చేయండి. వేడెక్కిన ఆయిల్ లో ఈ టిక్కీలను వేసి వేయించాలి. వాటిని గరిటతో మార్చుతూ వేయించుకుంటూ ఉండండి.
-రెండు వైపులా లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించి, గ్యాస్ ఆపివేసి, టిక్కీలను ప్లేట్ మీద ఉంచండి. అంతే సగ్గుబియ్యం టిక్కీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications