Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
నవరాత్రి 5వ రోజు స్పెషల్..దద్దోజనం ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రం గ్యారెంటీ!
నవరాత్రి ఉత్సవాలలో ప్రతి రోజు అమ్మవారిని ఒక్కో రూపంలో అలంకరించి, ఒక్కో ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. 5వ రోజు అమ్మవారిని శక్తి స్వరూపిణి అయిన స్కందమాత రూపంలో ఆరాధిస్తారు. స్కందమాత అంటే కుమారస్వామి (స్కందుడు లేదా కార్తికేయుడు)కి తల్లి. ఈ రూపంలో అమ్మవారు సింహంపై ఆసీనురాలై, నాలుగు చేతులతో, ఒడిలో కుమారస్వామితో దర్శనమిస్తుంది. నవరాత్రి 5వ రోజున అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా సమర్పించడం ఒక ప్రత్యేక ఆచారం. స్కందమాత శాంత స్వరూపిణి కాబట్టి ఈ రోజున దద్దోజనం నైవేద్యంగా పెట్టడం ద్వారా అమ్మవారి ఆశీస్సులు, ముఖ్యంగా మానసిక ప్రశాంతత లభిస్తాయని నమ్మకం.
దద్దోజనం అనేది దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా దేవాలయాలలో ప్రసాదంగా ఇచ్చే ఒక పవిత్రమైన, రుచికరమైన వంటకం. దద్దోజనం..అన్నం, పెరుగు (ప్రోటీన్, కాల్షియం, ప్రోబయోటిక్స్) కలయికతో కూడిన సమతుల్య ఆహారం. నవరాత్రి ఉపవాసాల సమయంలో లేదా తర్వాత ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. నవరాత్రి 5వ రోజు స్పెషల్ నైవేద్యం దద్దోజనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

దద్దోజనం తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-పెరుగు
-పాలు
-పచ్చి శెనగపప్పు
-ఇంగువ
-మినపప్పు
-ఆవాలు
-జీలకర్ర
-అల్లం
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-నూనె
-ఉప్పు
దద్దోజనం తయారీ విధానం
-ముందుగా కుక్కర్ లో 1 కప్పు బియ్యం వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసాక అందులో రెండున్నర కప్పుల నీళ్లు పోసి 5 నిమిషాల పాటు నాననివ్వాలి.
-తర్వాత కుక్కర్ ని స్టవ్ మీద పెట్టి మూతపెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
-ఉడికిన అన్నాన్ని వేడిమీద ఉన్నప్పుడే పప్పుగుత్తితో మెత్తగా మెదుపుకోవాలి.
-తర్వాత అందులో వేడి పాలు పోసి కలిపి కాస్త చల్లారనివ్వాలి.
-తర్వాత అందులో 2 కప్పుల కమ్మటి పెరుగు,రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి.
-తర్వాత తాలింపు రెడీ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద ఓ పాన్ పెట్టి అందులో ఆయిల్ 1 గరిట నూనె వేసి అందులో 1 స్పూన్ పచ్చి శెనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ మిరియాలు, అర స్పూన్ జీలకర్ర వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసిన 1 స్పూన్ అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయల ముక్కలు, కరివేపాకు వేసి వేయించాక స్టవ్ ఆపేసాక అందులో చిటికెడు ఇంగువ వేసి కలుపుకోవాలి.
-వేయించిన తాలింపుని రెడీ చేసి పక్కన పెట్టుకున్న పెరుగన్నంలో వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో కమ్మగా ఉండే దద్దోజనం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications