Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఎముకల బలం, అపారమైన శక్తి.. నిమిషాల్లో తయారయ్యే టేస్టీ వరిగల కిచిడీ..గిన్నె కూడా నాకేస్తారు
వరిగలు.. అత్యంత ఆరోగ్యకరమైన చిరుధాన్యాలలో ఒకటి. వరిగల కిచిడీ అనేది బియ్యం కిచిడీకి ఒక అద్భుతమైన, పోషకభరితమైన ప్రత్యామ్నాయం. ఇది తేలికగా జీర్ణమవుతుంది, రుచికరంగా ఉంటుంది. ఉదయం అల్పాహారంగా తీసుకోవడానికి చాలా మంచిది. దీనిని మీరు సులభంగా తయారు చేసుకుని దాని ప్రయోజనాలను పొందవచ్చు. వరిగల్లో ఐరన్, కాల్షియం, విటమిన్లు ఇతర ముఖ్యమైన మినరల్స్ ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, శరీరంలో శక్తి స్థాయిలను పెంచి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
వరిగలలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. వీటిని తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. ఇది టైప్ 2 మధుమేహం ఉన్నవారికి లేదా మధుమేహం రాకుండా నివారించుకోవాలనుకునే వారికి అద్భుతమైన ఆహారం. వరిగల కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
-ఆవాలు
-సొరకాయ
-వరిగలు
ఇంగువ
జీలకర్ర
అల్లం
పచ్చిమిర్చి
క్యారెట్
నెయ్యి
ఉప్పు
కరివేపాకు
కొత్తిమీర
కందిపప్పు
పెసరపప్పు
ఎర్ర కందిపప్పు
టమాటో
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో అరకప్పు వరిగలు,గుప్పుడు కందిపప్పు, గుప్పెడు పెసరపప్పు, గుప్పెడు ఎర్ర కందిపప్పు కూడా వేసుకొని నీళ్లు పోసి బాగా కడిగాక ఆ నీటిని వంపేసి మంచినీళ్లు 5 కప్పులు అందులో పోసి గంట సేపు నానబెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసి 1 నిమిషం పాటు వేయించుకున్నాక పావు స్పూన్ ఇంగువ వేసి ఒకసారి కలిపి 1 స్పూన్ అల్లం తరుగు, 2 పచ్చిమిర్చిల తరుగు, 1 క్యారెట్ చిన్న ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి వాటిల్లోని పచ్చిదనం పోయేలా ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి.
-తర్వాత చిన్న చిన్నగా కట్ చేసిన(తొక్క తీయకుండానే) లేత సొరకాయ ముక్కలను స్టవ్ మీద ఉన్న గిన్నెలో వేసి 5-6 నిమిషాలు కలుపుతూ వేయించుకున్నాక 1 టమాటో ముక్కలు కూడా వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి.
-ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసి ఒక నిమిషంపాటు కలుపుకోవాలి.
-తర్వాత ఇందులో నానబెట్టుకున్న వరిగలు,కందిపప్పు మిశ్రమాన్ని నీళ్లతో సహా వేసి పెద్ద మంట మీద 1 నిమిషం పాటు నీళ్లను మరగనివ్వాలి.
-ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి తక్కువ మంట మీద 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి.
-ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి కిచిడీని గరిటెతో మెల్లగా కలపాలి. పైన కొత్తిమీరతో అలంకరించి, వేడి వేడిగా నెయ్యి లేదా పెరుగు, ఊరగాయతో కలిపి వడ్డించాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications










