Latest Updates
-
లంచ్ బాక్స్ కైనా, లైట్ డిన్నర్ కైనా ది బెస్ట్ ఆప్షన్.. నిమిషాల్లో రెడీ అయ్యే అవకాడో చికెన్ సలాడ్ -
బీపీని తరిమికొట్టే 5 సూపర్ ఫుడ్స్.. ఇక మందులతో పనిలేదు! -
సాయంత్రానికి నోరూరించే జొన్న పకోడీ..మామిడికాయ పచ్చడితో తింటే ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
వేడిని తగ్గించే కీర దోసకాయతో.. నోరూరించే కొరియన్ కిమ్చి..ఈజీగా చేసేయండిలా.. -
ఫిట్స్ వస్తే చేతిలో తాళాలు పెడుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి! -
నోరూరించే వంకాయ పచ్చి కారం..వేడి అన్నంతో తింటే అద్భుతో అద్భుత అద్భుతసహ్య.. -
ఎముకలను ఉక్కులా మార్చే రాగి నువ్వుల లడ్డూ..15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే.. -
వృషభం, మిథునం, సింహ రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉంది? - 17 నుండి 23 మే 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆదివారం మీ అదృష్టం ఎలా ఉంది? - ఆదివారం, 17 మే 2026 -
Chilkur Balaji Temple: వీసా మాఫియా గుడి.. చిలుకూరు బాలాజీ ఆలయంపై ట్రంప్ పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ధాభా స్టైల్ ఎగ్ ఖీమా మసాలా..అబ్బబ్బా ఏం ఉంటది నా సామిరంగా..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే
భారతీయ వంటకాలలో గుడ్లతో చేసే వంటకాలు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. గుడ్లు, సుగంధ ద్రవ్యాలు మరియు తాజా కూరగాయలతో కలిపి తయారుచేసే ఎగ్ ఖీమా మసాలా ఒక అద్భుతమైన వంటకం. దీనిని పరాటాలు, రోటీలు, నాన్లు లేదా అన్నంతో కలిపి తినవచ్చు. ఈ వంటకం కేవలం రుచికరమైనదే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. 'ఖీమా' అనే పదం సాధారణంగా ముక్కలు చేసిన మాంసాన్ని (కీమా) సూచిస్తుంది. అయితే ఎగ్ ఖీమాలో ఉడికించిన గుడ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసిలేదా వాటి తురుమును మసాలా గ్రేవీలో కలుపుతారు. ఇది సాధారణ గుడ్డు కూరల కంటే భిన్నమైన రుచిని అందిస్తుంది. ఎగ్ ఖీమా మసాలాని మీ ఇంట్లోనే ధాభా స్టైల్ లో ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
ఎగ్ ఖీమా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు
-గుడ్లు: 6-8
-ఉల్లిపాయలు: 2
-టమాటాలు: 2
-అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
-పచ్చిమిర్చి: 2-3
-నెయ్యి: 3-4 టేబుల్ స్పూన్లు
-ఆవాలు: 1/2 టీస్పూన్
-జీలకర్ర: 1/2 టీస్పూన్
-కరివేపాకు: కొన్ని రెబ్బలు
-పసుపు: 1/2 టీస్పూన్
-కారం పొడి: 1-1.5 టీస్పూన్
-ధనియాల పొడి: 1.5 టీస్పూన్
-జీలకర్ర పొడి: 1 టీస్పూన్
-గరం మసాలా: 1 టీస్పూన్
-ఉప్పు: రుచికి సరిపడా
-నీరు: 1/2 కప్పు లేదా అవసరమైనంత
-కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు
ఎగ్ ఖీమా మసాలా తయారీ విధానం
-ముందుగా గుడ్లను గట్టిగా ఉడికించి చల్లబరచి పొట్టు తీసి వాటిని తురుముకొని పక్కనపెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి.
-ఇప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయేవరకు ఒకటి రెండు నిమిషాలు వేయించుకోండి.
-తర్వాత అందులో తరిగిన టమాటాలు వేసి మెత్తబడే వరకు, నూనె పైకి తేలే వరకు ఉడికించండి. ఇప్పుడు పసుపు, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపండి. మసాలాల పచ్చి వాసన పోయేవరకు ఒకటి రెండు నిమిషాలు వేయించుకోండి.
'గోబీ ఖీర్' తో బక్రీద్ 2025 ని సెలబ్రేట్ చేయండి..నోట్లో పెట్టుకుంటే అమృతమే..ఎలా చేయాలంటే
-అందులో అర కప్పు నీరు వేసి మసాలాను బాగా కలపండి. గ్రేవీ చిక్కబడే వరకు, నూనె పైకి తేలే వరకు ఉడికించండి.
-గ్రేవీ చిక్కబడిన తర్వాత ఇందులో తురుముకున్న గుడ్లను వేసి బాగా కలపండి. మసాలా గుడ్ల తురుముకి పట్టేలా ఒకటి రెండు నిమిషాలు ఉడికించండి.
-చివరిగా గరం మసాలా వేసి బాగా కలపండి. కొత్తిమీరతో అలంకరించి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.
-ఎగ్ ఖీమా మసాలాను పరాటాలు, నాన్లు, రోటీలు, చపాతీలు లేదా సాధారణ అన్నంతో కలిపి తినవచ్చు. కొంతమంది దీనిని బ్రెడ్ టోస్ట్ పైన కూడా తింటారు. ఇది అల్పాహారానికి, మధ్యాహ్న భోజనానికి లేదా నైట్ డిన్నర్ కి బెస్ట్ ఆప్షన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications





