Latest Updates
-
కేవలం 20 నిమిషాల్లో కమ్మని వంకాయ రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
మగాళ్లను చంపి ఎలా తప్పించుకోవాలి..? మెట్రోలో మహిళ చేసిన షాకింగ్ పని.. వైరల్ వీడియో.! -
బ్లాక్ క్యాట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి?..మీ పార్టనర్ కు ఈ లక్షణాలు ఉన్నాయా? -
బాత్రూమ్లో దుర్వాసన.. సువాసన వెదజల్లే ఫ్రెషనర్స్ ఇంట్లోనే 5 నిమిషాల్లో రెడీ.! -
వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి.! -
కండరాల బలానికి, రోజంతా ఎనర్జీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..10 నిమిషాల్లో ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ చేయండిలా.. -
మీ స్నేహితుల్లో ఈ 4 లక్షణాలు ఉంటే వెంటనే దూరం పెట్టండి! -
ఆకలి తీరాలి, బరువు పెరగకూడదు..అయితే డిన్నర్ కి ఇది బెస్ట్ చాయిస్..10 నిమిషాల్లోనే చేసేయండిలా! -
బానిసత్వం పోయింది బాస్: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి..మేనేజర్ ప్రశ్నకు జెన్ జీ ఉద్యోగి దిమ్మతిరిగే కౌంటర్ -
పప్పులు నానబెట్టే పనే లేదు.. అప్పటికప్పుడు అచ్చం పునుగుల్లా ఉండే మినీ రైస్ బోండా చేసుకోండిలా..
ధాభా స్టైల్ ఎగ్ ఖీమా మసాలా..అబ్బబ్బా ఏం ఉంటది నా సామిరంగా..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే
భారతీయ వంటకాలలో గుడ్లతో చేసే వంటకాలు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. గుడ్లు, సుగంధ ద్రవ్యాలు మరియు తాజా కూరగాయలతో కలిపి తయారుచేసే ఎగ్ ఖీమా మసాలా ఒక అద్భుతమైన వంటకం. దీనిని పరాటాలు, రోటీలు, నాన్లు లేదా అన్నంతో కలిపి తినవచ్చు. ఈ వంటకం కేవలం రుచికరమైనదే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. 'ఖీమా' అనే పదం సాధారణంగా ముక్కలు చేసిన మాంసాన్ని (కీమా) సూచిస్తుంది. అయితే ఎగ్ ఖీమాలో ఉడికించిన గుడ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసిలేదా వాటి తురుమును మసాలా గ్రేవీలో కలుపుతారు. ఇది సాధారణ గుడ్డు కూరల కంటే భిన్నమైన రుచిని అందిస్తుంది. ఎగ్ ఖీమా మసాలాని మీ ఇంట్లోనే ధాభా స్టైల్ లో ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
ఎగ్ ఖీమా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు
-గుడ్లు: 6-8
-ఉల్లిపాయలు: 2
-టమాటాలు: 2
-అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
-పచ్చిమిర్చి: 2-3
-నెయ్యి: 3-4 టేబుల్ స్పూన్లు
-ఆవాలు: 1/2 టీస్పూన్
-జీలకర్ర: 1/2 టీస్పూన్
-కరివేపాకు: కొన్ని రెబ్బలు
-పసుపు: 1/2 టీస్పూన్
-కారం పొడి: 1-1.5 టీస్పూన్
-ధనియాల పొడి: 1.5 టీస్పూన్
-జీలకర్ర పొడి: 1 టీస్పూన్
-గరం మసాలా: 1 టీస్పూన్
-ఉప్పు: రుచికి సరిపడా
-నీరు: 1/2 కప్పు లేదా అవసరమైనంత
-కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు

ఎగ్ ఖీమా మసాలా తయారీ విధానం
-ముందుగా గుడ్లను గట్టిగా ఉడికించి చల్లబరచి పొట్టు తీసి వాటిని తురుముకొని పక్కనపెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి.
-ఇప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయేవరకు ఒకటి రెండు నిమిషాలు వేయించుకోండి.
-తర్వాత అందులో తరిగిన టమాటాలు వేసి మెత్తబడే వరకు, నూనె పైకి తేలే వరకు ఉడికించండి. ఇప్పుడు పసుపు, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపండి. మసాలాల పచ్చి వాసన పోయేవరకు ఒకటి రెండు నిమిషాలు వేయించుకోండి.
'గోబీ ఖీర్' తో బక్రీద్ 2025 ని సెలబ్రేట్ చేయండి..నోట్లో పెట్టుకుంటే అమృతమే..ఎలా చేయాలంటే
-అందులో అర కప్పు నీరు వేసి మసాలాను బాగా కలపండి. గ్రేవీ చిక్కబడే వరకు, నూనె పైకి తేలే వరకు ఉడికించండి.
-గ్రేవీ చిక్కబడిన తర్వాత ఇందులో తురుముకున్న గుడ్లను వేసి బాగా కలపండి. మసాలా గుడ్ల తురుముకి పట్టేలా ఒకటి రెండు నిమిషాలు ఉడికించండి.
-చివరిగా గరం మసాలా వేసి బాగా కలపండి. కొత్తిమీరతో అలంకరించి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.
-ఎగ్ ఖీమా మసాలాను పరాటాలు, నాన్లు, రోటీలు, చపాతీలు లేదా సాధారణ అన్నంతో కలిపి తినవచ్చు. కొంతమంది దీనిని బ్రెడ్ టోస్ట్ పైన కూడా తింటారు. ఇది అల్పాహారానికి, మధ్యాహ్న భోజనానికి లేదా నైట్ డిన్నర్ కి బెస్ట్ ఆప్షన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications