ఎముకలను ఉక్కులా మార్చే రాగి నువ్వుల లడ్డూ..15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే..

Posted By:

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో, పోషకాల లేమి వల్ల చిన్న వయసులోనే ఎముకల నొప్పులు, నీరసం వేధిస్తున్నాయి. బయట దొరికే జంక్ ఫుడ్స్ వల్ల పిల్లల్లో కూడా సరైన ఎదుగుదల ఉండటం లేదు. ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేసి, శరీరానికి తక్షణ శక్తిని, ఉక్కు లాంటి బలాన్ని ఇచ్చే అద్భుతమైన సాంప్రదాయక స్నాక్ రాగి నువ్వుల లడ్డూ. రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని పంచే ఈ లడ్డూలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీనిని కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే ఎంతో సులభంగా తయారుచేసుకోవచ్చు. పిల్లలకు రోజుకొక లడ్డూ ఇస్తే, వాళ్ల ఆరోగ్యానికి ఇక తిరుగుండదు.

Grandma s Superfood Ragi Sesame Laddu Recipe for Instant Energy Iron Like Strength Recipe in Telugu

రాగి నువ్వుల లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు

నువ్వులు - 1 కప్పు
రాగి పిండి - 1 కప్పు
బెల్లం తురుము- 2 కప్పులు
బాదం పప్పులు - పావు కప్పు
జీడిపప్పు - పావు కప్పు
యాలకులు - 4
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు

రాగి నువ్వుల లడ్డు తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి మందంగా ఉండే కడాయి పెట్టుకోవాలి. అందులో ఒక కప్పు నువ్వులు వేసి, సన్నని మంటపై దోరగా, చిటపటలాడే వేయించి ఒర ప్లేట్ లోకి తీసుకోండి.

-ఇప్పుడు అదే కడాయిలో గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, బాదం, జీడిపప్పులను వేసి తేమ పోయే వరకు వేయించి స్టవ్ ఆపేయండి.

-ఇప్పుడు నువ్వులతో సహా వేయించినవన్నీ మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల బెల్లం తురుము, 4 యాలకలు వేసి మరోసారి గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి ఇందులోనే రాగి పిండిని వేసి వేయించుకోవాలి. పిండి పచ్చివాసన పోయి, కమ్మని సువాసన వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేయాలి.

-వేయించిన రాగి పిండిలో ముందుగా గ్రైండ్ చేసుకున్న నువ్వల మిశ్రమం మొత్తం వేసి కలుపుకోవాలి. చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన సైజులో గుండ్రంగా లడ్డూల్లా గట్టిగా చుట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన రాగి నువ్వుల లడ్డూలు రెడీ.

-రాగులు, నువ్వులలో పాలకు మించిన క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వానికి బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. ఇక తీపి కోసం వాడిన బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి రక్తహీనత దరిచేరదు. నీరసంగా ఉన్నప్పుడు ఒక్క లడ్డూ తింటే చాలు, నాచురల్ షుగర్స్ వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. పెద్దలు రోజుకో లడ్డూ తింటే ఎముకల అరుగుదల, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇవి వారం నుంచి పది రోజుల పాటు నిల్వ ఉంటాయి.

[ of 5 - Users]
Story first published: Sunday, May 17, 2026, 6:30 [IST]
Desktop Bottom Promotion