Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
తిరుమల ప్రసాదం వడ..ఇంట్లోనే ఇలా చేస్తే అదే కమ్మని టేస్ట్
తిరుమల వెళ్లే వెంకన్న దర్శనం తర్వాత అందరికీ గుర్తుకొచ్చేది లడ్డూ,వడనే. తిరుమలలో ప్రసాదంగా అందించే వడ నోట్లో పెట్టుకుంటే అమృతమా అన్నట్లు ఉంటుంది. తిరుమల ప్రసాదం వడ అంటే కేవలం ఒక పిండి వంటకం కాదు, అది భక్తితో కూడుకున్న ఒక పవిత్రమైన అనుభూతి. శ్రీవారికి నివేదించిన తర్వాత భక్తులకు అందించే ఈ వడ ఎన్నో ఏళ్ల చరిత్రను, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. తిరుమలలో గతంలో లడ్డూ కంటే ముందు వడ ప్రసాదమే భక్తులకు అందించేవారని చరిత్ర చెబుతోంది.
తిరుమల వడ తయారీ విధానం వెనుక ఉన్న సంప్రదాయం, అందులో వాడే పదార్థాల నాణ్యత, దానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఈ ప్రసాదాన్ని మరింత విశిష్టంగా చేస్తాయి. ఇంట్లో తయారు చేసుకున్నప్పటికీ ఆ పవిత్ర భావనతో స్వీకరించినప్పుడు తిరుమల వడ అందించే ఆధ్యాత్మిక, శారీరక ప్రయోజనాలను పొందవచ్చు. తిరుమల వడ అచ్చం గుడిలో ఇచ్చిన రుచి రావాలంటే ఇంట్లో చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తిరుమల వడ రుచికి దగ్గరగా ఇంట్లో తయారు చేసుకునే విధానం ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినుములు
-జీలకర్ర
-ఉప్పు
-మిరియాలు
-ఇంగువ
-ఆయిల్
తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ లో అరకేజీ పోట్టు ఉండే మినుములు వేసి నీళ్లు పోసి కనీసం 8 గంటలు నానబెట్టాలి.
-తర్వాత నీళ్లు పారబోసి నానిన మినుములు మిక్సీ జార్ లో వేసి నీళ్లు పోయకుండానే గ్రైండ్ చేసుకోండి. మిశ్రమం గట్టిగా ఉండాలి.
-తర్వాత రోట్లో లేదా మిక్సీలో అయినా 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు, కావాలనుకుంటే కొంచెం ఇంగువ వేసి మెత్తగా దంచుకోవాలి.
-ఇఫ్పుడు దంచిన పొడిని గ్రైండ్ చేసిన పిండిలో వేసి కలుపుకోండి.
-తర్వాత పిండిని ఓ ముద్దలా తీసుకొని తడి గుడ్డమీద పెట్టి మధ్య మధ్యలో చేతులు తడుపుకుంటూ వత్తుకోండి. పప్పు చక్కల కన్నా కాస్త మందంగా ఉంటే చాలు. మరీ మందంగా ఉండకూడదు,మరీ పల్చగా ఉండకూడదు.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసి వేడి చేసి అందులో వత్తుకున్న వడను వేసి సన్నని సెగమీద వేయించుకోవాలి. దీనికి 10 నిమిషాల సమయం పడుతుంది.
-తర్వాత బాండీలో నుంచి తీసి ప్లేట్ లో ఓ ట్విష్యూ పేపర్ ఉంచి దానిమీద వడను పెట్టండి. తద్వారా అదనపు నూనెను టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications