Latest Updates
-
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026
కేవలం 10 నిమిషాల్లో అప్పటికప్పుడు రాగి ఇడ్లీ రెడీ..ఈ పద్ధతిలో చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
పొద్దున్నే ఏది పడితే అది తింటే ఆరోగ్యానికి ఇబ్బంది తప్పదు. హెల్దీగా ఉండే బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవాలి. అలాంటివాటిల్లో రాగి ఇడ్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. రాగి ఇడ్లీ అనేది రాగిపిండితో తయారుచేసే ఆరోగ్యకరమైన,రుచికరమైన భారతీయ వంటకం. ఇది సాధారణ ఇడ్లీల కంటే ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటది. రాగుల్లో కాల్షియం,ఐరన్, ఫైబర్ ఫుష్కలంగా ఉంటాయి. అలాంటి రాగి పిండితో చేసే ఇడ్లీలు తింటే ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు.
అయితే రాగి ఇడ్లీలు బయట హోటల్స్ లో ఎక్కువ రేటు పెట్టి అమ్ముతున్నారు. రెండు రాగి ఇడ్లీలు తినాలంటే రూ.50-60 వరకు ఖర్చు పెట్టాల్సిందే. అయితే మీరు వాటిని సులభంగా 10నిమిషాల్లో తయారుచేసుకోవచ్చు. రాగి ఇడ్లీ తయారుచేయడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
రాగి ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు
-పచ్చి శెనగపప్పు
-ఆవాలు
-జీలకర్ర
-క్యారెట్ తరుగు
-పచ్చిమిర్చి తరుగు
-పుల్లని పెరుగు
-మినపప్పు
-రాగి పిండి
-కరివేపాకు
-కొత్తిమీర
-బొంబాయి రవ్వ
-ఆయిల్
రాగి ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ లేదా గిన్నె పెట్టి అందులో అరటేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చెయ్యాలి.
-వేడెక్కిన నూనెలో 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు,అర టీస్పూన్ ఆవాలు, అరటీస్పూన్ జీలకర్ర వేసి తాళింపుని దోరగా వేయించుకోవాలి.
-తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి తరుగు, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగు,పావు కప్పు క్యారెట్ తరుగు వేసి సన్నని సెగమీద దోరగా వేయించాలి.
-తర్వాత అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసి 5-10 నిమిషాల పాటు సన్నని సెగ మీద వేయించండి.
-తర్వాత అందులో 1 కప్పు రాగి పిండి వేసి 2-3 నిమిషాలు వేయించాక అందులో 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆపేసి గిన్నెను దించి చల్లారనివ్వాలి.
-కాస్త చల్లబడిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు,2కప్పుల పెరుగు(వీలైతే కొద్దిగా పులిసినది),అవసరమైనమేరకు నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా కలిపి మూతపెట్టి 10 నిమిషాలు పక్కనపెట్టుకోండి.
-తర్వాత మూత తీసి మళ్లీ బాగా కలిపి అందులో అర టీస్పూన్ వంటసోడా,కొద్దిగా నీళ్లు కావాలనుకుంటే పోసి ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో అలాగే కలుపుకోవాలి.
-తర్వాత ఈ పిండిని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవడమే. అంతే రాగి ఇడ్లీ రెడీ. ఇడ్లీ పాత్రలో ఆయిల్ రాసేదానికి బదులుగా పలుచటి గుడ్డ పరిచి దానిమీద ఇడ్లీ పిండిని పెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి ఇడ్లీలు. దూదిలా మెత్తగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications










