Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
పొద్దున్నే ఈ పూరీ తింటే రోగాలన్నీ పరార్..షుగర్ పేషెంట్లు కూడా హాయిగా తినొచ్చు..ఎలా చేయాలంటే
సాధారణంగా మన తెలుగువాళ్లు పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి తీసుకునే ప్రధాన ఆహారాల్లో పూరీ ఒకటి. కొంతమంది అయితే పూరీకి సైడ్ డిష్ గా తయారుచేసే కర్రీ కోసం అయినా పూరీ తింటుంటారు. అయితే మీరెప్పుడైనా రాగి పూరీ తిన్నారా? దీనిని రాగి పిండితో తయారుచేస్తారు. ఇది చాలా రుచికరమైన వంటకమే కాకుండా ఆరోగ్యకరమైనది కూడా. రాగి పూరీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
రాగి పూరీ తయారీకి కావలసిన పదార్థాలు
రాగి పిండి - 2 కప్పులు
గోధుమ పిండి - 1/2 కప్పు
ఉప్పు - రుచికి తగినంత
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
నీరు - పిండి కలపడానికి సరిపడా

రాగి పూరీ తయారీ విధానం
ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ లో రాగి పిండి వేయండి. ఇందులో కావాలి అనుకుంటే గోధుమ పిండి కూడా వేయండి.
అందులో రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపండి.
కొద్ది కొద్దిగా నీరు పోస్తూ మెత్తని పిండి ముద్దలా కలుపుకోండి. పిండి మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు. చపాతీ పిండిలా ఉండాలి.
పిండిని తడి గుడ్డతో కప్పి 15-20 నిమిషాలు నాననివ్వండి.
నానిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి.
ఒక్కో ఉండను తీసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ చిన్న పూరీల్లాగా ఒత్తుకోండి. మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగా ఒత్తుకుంటే పూరీలు బాగా పొంగుతాయి.
-స్టవ్ మీద డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేడి చేయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియంలో పెట్టి ఒక్కొక్క పూరీని వేడి నూనెలో వేయండి.
-పూరీ నూనెలో వేసిన వెంటనే పైకి తేలుతుంది. గరిటెతో మెల్లగా నొక్కడం వల్ల అది బాగా పొంగుతుంది.
-రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.
-వేయించిన పూరీలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదనపు నూనెను పీల్చుకోవడానికి టిష్యూ పేపర్ ఉపయోగించవచ్చు.
-వేడి వేడి రాగి పూరీలను కూరలు, చట్నీలు లేదా సాంబార్ తో తింటే నోట్లో బ్లాస్టే.
వంకాయతో ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? మన పూర్వీకులు ఇలానే చేసేవాళ్లు..రుచి కేక అంతే,ఎలా చేయాలంటే
రాగి పూరి ప్రయోజనాలివే
రాగి పూరి తినడం వల్ల మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది
రాగిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో
చక్కెర స్థాయిలు త్వరగా పెరగకుండా ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి ఇది
చాలా మంచి ఆహారం. రాగిలోని ఫైబర్ జీర్ణక్రియను నెమ్మది చేస్తుంది..
ఫలితంగా చక్కెర విడుదల నెమ్మదిగా జరుగుతుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
రాగిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తిన్న తర్వాత ఎక్కువసేపు కడుపు
నిండినట్లు ఉంటుంది. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది,బరువు
తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే రాగిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
రాగిలో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే
ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్
(HDL) స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది, తద్వారా గుండె సంబంధిత
సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
రాగిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా
సహాయపడుతుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications