Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఈ ఒక్క పొడి ఉంటే ఎప్పుడంటే అప్పుడు నిమిషాల్లో పెసరట్టు..ఎలా తయారుచేసుకోవాలంటే
పెసరట్టు అనేది ఆంధ్ర వంటకాల్లో చాలా ముఖ్యమైన అల్పాహారం. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ లో మొదటి ప్లేస్ లో పెసరట్టు ఉంటుంది. ఇది చాలా రుచికరంగా కూడా ఉంటుంది. అయితే దీన్ని తయారుచేయడానికి చాలా సమయం పడుతుంది. ముందుగా పెసలు నానబెట్టి, వాటిని రుబ్బి, రాత్రంతా పులియబెట్టాలి. కానీ పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ ఉంటే, ఈ పని చాలా సులభం అవుతుంది. ఈ పొడిని తయారుచేసుకుని డబ్బాలో నిల్వ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కేవలం పది నిమిషాల్లో వేడివేడిగా పెసరట్టు చేసుకోవచ్చు. పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెసరపప్పు
-బియ్యం
-కరివేపాకు
-అల్లం
-జీలకర్ర
-పచ్చిమిర్చి
-ఇంగువ
-ఉప్పు
పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ తయారీ విధానం
-ఈ ఒక్క పొడి ఉంటే ఎప్పుడంటే అప్పుడు నిమిషాల్లో పెసరట్టు..ఎలా తయారుచేసుకోవాలంటే
-ముందుగా ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో పొట్టుతో ఉన్న పెపరపప్పు 2 కప్పులు, పావు కప్పు బియ్యం వేసి నీళ్లు పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగాలి.
-తర్వాత వాటిని పొడి గుడ్డపై వేసి బాగా పరిచి ఫ్యాన్ కింద పెట్టి తడి అనేది లేకుండా ఆరనివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో బాగా ఆరిన మినపప్పు,బియ్యంను వేసి తక్కవ మంటమీద 3-4 నిమిషాలు వేయించుకోవాలి. లైట్ గా వేగిన తర్వాత వాటన్నింటిని ఓ బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద అదే పాన్ లో 1 ఇంచు అల్లం(కట్ చేసి ముక్కలు),3 పచ్చిమిరపకాయల ముక్కలు, 1 రెబ్బ కరివేపాకు కూడా వేపి తక్కువ మంట మీద ఆయిల్ లేకుండానే వేయించాలి. అల్లం,పచ్చిమిర్చి లోని చెమ్మ పోయేదాకా వేగనివ్వాలి.
-తర్వాత అందులో 1 టీస్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి.
-ఇప్పుడు వేయించిన వీటన్నింటిని ముందుగా వేయించి పక్కనపెట్టుకున్న పెసరపప్పు మిశ్రమంలో వేసి కలుపుకొని బాగా చల్లారనివ్వండి.
-బాగా చల్లారిన తర్వాత 1 టీస్పూన్ ఉప్పు, కొద్దిగా ఇంగువ కూడా వేసి కలిపి మిశ్రమం మొత్తాన్ని మిక్సీ జార్ లోకి వేసుకొని పౌడర్ లా గ్రైండ్ చేసుకోండి.
-మిక్సీ వేసిన వెంటనే పౌడర్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి దీనిని కొద్దిసేపు పక్కన ఉంచి బాగా చల్లారాకా అప్పుడు గాలి చొరబడని డబ్బాలో వేసుకుంటే 2 నెలల వరకు నిల్వ ఉంటుంది.
-పెసరట్టు వేసుకోవాలనుకున్నప్పుడు ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో అర కప్పు పెసరట్టు పౌడర్, అరకప్పు నీళ్లు పోసి బాగా కలిపాక కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూతపెట్టి 10 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత పెసరట్టు వేసుకొని ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












