Latest Updates
-
మే 4: ఈ రాశుల వారికి ఊహించని ధన యోగం.. కెరీర్లో తిరుగులేని సక్సెస్! -
వేడి అన్నంలో చల్లటి బెండకాయ పెరుగు పచ్చడి..ప్రతి ముద్దా ఆహా అనిపించాల్సిందే! -
జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశం.. ఈ రాశుల వారికి నేడు ధన యోగం పక్కా! -
మే నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు? గందరగోళం వద్దు.. పండితులు చెబుతున్న సరైన తేదీ, సమయాలివే! -
మేషరాశిలో బుధ అస్తమయం: ఈ రాశులవారు జాగ్రత్త.. లేదంటే భారీ నష్టాలు తప్పవు! -
వృశ్చికం, సింహం, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 04 మే 2026 -
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే
మిగిలిపోయిన అన్నంతో దోశలు..నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలో చూడండి
తెలుగు ఇళ్లల్లో లేదా హోటల్స్ లో అయినా పొద్దున్నే ఉండే బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ లో దోశ ప్రధానమైనది. దోశ చాలామంది ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్. అయితే మీరెప్పుడైనా అన్నం దోశ తిన్నారా? తినకపోతే ఓ సారి తప్పక తిని చూడాల్సిందే. సాధారణంగా రాత్రి మిగిలిపోయిన అన్నంని పొద్దున్నే తాళింపు పెట్టి పులిహోర,టమాటో రైస్ వంటివి మన ఇళ్లల్లో చేస్తుంటారు. అయితే మిగిలిపోయిన అన్నంతో దోశలు కూడా చేసుకోవచ్చు. అది కూడా నిమిషాల్లోనే దీనిని రెడీ చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతో అప్పటికప్పుడు దోశ తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
మిగిలిన అన్నంతో దోశ తయారీకి కావలసిన పదార్థాలు
-మిగిలిన అన్నం
-పుల్లని పెరుగు
-వంట సోడా
-గోధుమ లేదా మైదా పిండి
-బియ్యం పిండి
-ఉప్పు
-నీళ్లు
-ఆయిల్
-దోశ పెనం
మిగిలిపోయిన అన్నంతో దోశ తయారీ విధానం
-ముందుగా మిక్సీ గిన్నెలో మిగిలిపోయిన అన్నం 2 కప్పులు, 1 కప్పు పుల్లని పెరుగు, 1 కప్పు గోధుమ పిండి లేదా మైదా పిండి,1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు పైనే నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత పిండిలో రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ వంటసోడా, 1 గరిట నీళ్లు పోసి పలుచుగా దోశ పిండిలానే కలుపుకోవాలి.
-బాగా కలిపిన పిండిని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు పిండి పొంగుతుంది.
-ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి దానిమీద 4 బొట్లు ఆయిల్ వేసి ఉల్లిపాయ లేదా వంకాయతో బాగా రుద్దండి.
మీరు జన్మలో తినని చికెన్ కర్రీ రసం.. ఒక్కసారి తింటే రుచి అస్సలే మర్చిపోరు! ఎలా చేసుకోవాలంటే?
-పెనం వేడెక్కిన తర్వాత మంటను మీడియంలో పెట్టి ఒక గరిట పిండి తీసుకొని మరీ పల్చగా కాకుండా మందంగా దోశ పోయండి. పలుచగా పోస్తే ఈ పిండి దోశ సరిగ్గా రాదు కాబట్టి మందంగా పోయాలి.
-దోశను మందంగా స్ప్రెడ్ చేసుకున్నాక దాని అంచుల వెంట,మధ్యలో ఆయిల్ లేదా నెయ్యి చుక్కలు వేసి కాల్చండి. ఇది మామూలు దోశలా వెంటనే కాలదు..కొంచెం సమయం పడుతుంది.
మీడియం మంట మీద నిదానంగా దోశను కాల్చుకున్నాక మరోవైపుకి తిప్పి 1 నిమిషం ఉంచి తీసేయడమే. అంతే అన్నం దోశ రెడీ. దీనిని మీకు నచ్చిన చట్నీతో ఆస్వాదించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











