పెసరట్టులో ఈ పెసరట్టు వేరయా.. ఒక్కసారి తింటే జన్మ ధన్యమే, ఎలా చేసుకోవాలంటే?

ఉదయాన్నే ప్రతి ఒక్కరూ బ్రేక్‌ఫాస్ట్ తింటూ ఉంటారు. బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా చాలా మంది ఇడ్లీలు, దోశలు, పూరీలు, బొండాలు వంటివి తింటూ ఉంటారు. చాలా కొద్దిమంది పెసరట్టు చేసుకొని తింటారు. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే మీరెప్పుడైనా మిల్లెట్ పెసరట్టు చేసుకొని తిన్నారా? ఇది సాధారణ పెసరట్టుతో పోలిస్తే అద్భుతమైన రుచితో ఉండడంతో పాటు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అయితే ఈ స్టోరీలో మిల్లెట్ పెసరట్టు ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మిల్లెట్ పెసరట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు

పెసలు: 1 కప్పు
మిల్లెట్స్: 1/2 కప్పు (జొన్నలు, రాగులు, సజ్జలు లేదా ఏదైనా మిల్లెట్ మిశ్రమం)
పచ్చిమిర్చి: 2-3
అల్లం: 1 చిన్న ముక్క
జీలకర్ర: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: పెసరట్టు వేయించడానికి

మిల్లెట్ పెసరట్టు తయారీ విధానం:

  1. పెసలు, మిల్లెట్స్‌ను కనీసం 4-6 గంటలు నానబెట్టాలి.
  2. నానబెట్టిన పెసలు, మిల్లెట్స్‌ను నీళ్లు వడకట్టి, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  3. పిండి మరీ చిక్కగా లేదా పలుచగా లేకుండా తగినంత నీళ్లు పోసి కలపాలి.
  4. ఇప్పుడు పెనం వేడి చేసి, కొద్దిగా నూనె వేసి, ఒక గరిటెడు పిండిని వేసి పలుచగా దోశలాగా వేయాలి.
  5. పెసరట్టు ఒకవైపు కాలిన తర్వాత, కొద్దిగా నూనె వేసి రెండోవైపు కూడా కాల్చాలి.
  6. రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చి, చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్ చేయాలి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది.
[ of 5 - Users]
Story first published: Saturday, March 1, 2025, 8:45 [IST]
Desktop Bottom Promotion