Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
పెసరట్టులో ఈ పెసరట్టు వేరయా.. ఒక్కసారి తింటే జన్మ ధన్యమే, ఎలా చేసుకోవాలంటే?
ఉదయాన్నే ప్రతి ఒక్కరూ బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్లో భాగంగా చాలా మంది ఇడ్లీలు, దోశలు, పూరీలు, బొండాలు వంటివి తింటూ ఉంటారు. చాలా కొద్దిమంది పెసరట్టు చేసుకొని తింటారు. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే మీరెప్పుడైనా మిల్లెట్ పెసరట్టు చేసుకొని తిన్నారా? ఇది సాధారణ పెసరట్టుతో పోలిస్తే అద్భుతమైన రుచితో ఉండడంతో పాటు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అయితే ఈ స్టోరీలో మిల్లెట్ పెసరట్టు ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మిల్లెట్ పెసరట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు
పెసలు: 1 కప్పు
మిల్లెట్స్: 1/2 కప్పు (జొన్నలు, రాగులు, సజ్జలు లేదా ఏదైనా మిల్లెట్
మిశ్రమం)
పచ్చిమిర్చి: 2-3
అల్లం: 1 చిన్న ముక్క
జీలకర్ర: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: పెసరట్టు వేయించడానికి
మిల్లెట్ పెసరట్టు తయారీ విధానం:
- పెసలు, మిల్లెట్స్ను కనీసం 4-6 గంటలు నానబెట్టాలి.
- నానబెట్టిన పెసలు, మిల్లెట్స్ను నీళ్లు వడకట్టి, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- పిండి మరీ చిక్కగా లేదా పలుచగా లేకుండా తగినంత నీళ్లు పోసి కలపాలి.
- ఇప్పుడు పెనం వేడి చేసి, కొద్దిగా నూనె వేసి, ఒక గరిటెడు పిండిని వేసి పలుచగా దోశలాగా వేయాలి.
- పెసరట్టు ఒకవైపు కాలిన తర్వాత, కొద్దిగా నూనె వేసి రెండోవైపు కూడా కాల్చాలి.
- రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చి, చట్నీ లేదా సాంబార్తో సర్వ్ చేయాలి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












