Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
పెళ్లిళ్ల స్పెషల్ పనసకాయ బిర్యానీ..నాన వెజ్ ని మించిన టేస్ట్..ఇంట్లోనో ఎలా చేసుకోవాలంటే..
ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో చికెన్ బిర్యానీ,మటన్ బిర్యానీ,వెజ్ బిర్యానీకి బదులు పసనకాయ బిర్యానీ ఎక్కువగా పెడుతున్నారు. ముఖ్యంగా ఏపీ, తమిళనాడులో పెళ్లి పంక్షన్ అయినా లేదా మరేదైనా పంక్షన్ అయినా పనసకాయ బిర్యానీని పెడుతున్నారు. పనసకాయ బిర్యానీ నాన్ వెజ్ కి ధీటుగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మాత్రం మళ్లీ ఎప్పుడా అని ఎదురుచూడాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది మరి రుచి. పనసకాయ బిర్యానీని ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
పనసకాయ బిర్యానీ తయారీకి కావలసిన పదార్థాలు
-పనసకాయ ముక్కలు
-అల్లం
-వెల్లుల్లి
-మిరియాలు
-ధనియాలు
-సోంపు
-బిర్యానీ ఆకు
-అనాస పువ్వు
-జాపత్రి
-జీలకర్ర
-యాలకలు
-లవంగాలు
-దాల్చిన చెక్క
-పత్తర్ పూల్
-ఆయిల్
-బాస్మతి బియ్యం
-టమాటో
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-స్టార్ అనాస
-పుదీనా
-కొత్తిమీర
-పెరుగు
-పాలు
-నిమ్మరసం
-బాస్మతి బియ్యం
-నెయ్యి

పనసకాయ బిర్యానీ తయారీ విధానం
-ముందుగా పచ్చి పనసకాయ ముక్కలను మజ్జిగలో రాత్రంతా నాననెట్టాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ లేదా మూకుడు పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 బిర్యానీ ఆకు, 2 అనాస పువ్వులు, 1 జాపత్రి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 7 యాలకలు, 8 లవంగాలు,1 ఇంచు దాల్చిన చెక్క వేసి సన్నని సెగమీద వేయించాలి.
-మసాలాలు సగంపైన వేగిన తర్వాత అందులో పత్తర్ పూల్(రాతి పువ్వు)కొద్దిగా వేసి వేయించాలి.
-తర్వాత వీటన్నింటిని మిక్సీ గిన్నెలో వేసి అందులో కొంచెం అల్లం, 7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేయాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీపెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి అందులో నానబెట్టిన పనస ముక్కలను వేయండి. అవి మెత్తబడి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా వేయించి తీసి పక్కనపెట్టుకోండి. దీనికి 5 నిమిషాల టైం పడుతుంది.
-తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నెలో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది వేడయ్యాక అందులో 1 టీస్పూన్ జీలకర్ర, 4 లవంగ మెగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 దంచిన యాలకలు,2 స్టార్ అనాస వేసి వేయించి అందులో పొడవుగా,సన్నగా చీరిన 200 గ్రాముల ఉల్లిపాయలు, 4 పొడవుగా చీరిన పచ్చిమిర్చి,కొద్దిగా ఉప్పు వేసి మూతపెట్టి వేయించుకోండి
-ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత అందులో రాత్రంతా నానబెట్టిన అరకప్పు డబుల్ బీన్స్ వేసి మగ్గనివ్వాలి.
-తర్వాత అందులో 1 టమాటో తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు, ఒకటిన్నర టీస్పూన్ కారం, అర టీస్పూన్ పసుపు, 50ml నీరు పోసి మెత్తం కలపండి.
-తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి ఉంచిన మసాలాల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసి నీరు పైకి తేలేంతవరకు ఉడికించాలి.
రెస్టారెంట్స్ కి మించిన టేస్ట్..జ్యూసీ తందూరి చికెన్ ను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూడండి
-నీరు పైకి తేలిన తర్వాత అందులో నానబెట్టిన పనసకాయ ముక్కలు వేసి బాగా కలపి అందులోనే అరకప్పు చిలికిన పెరుగు, అరకప్పు పాలు,1 నిమ్మకాయ రసం పోసి నెమ్మదిగా కలిపి మూతపెట్టి నూనె పైకి తేలేదాకా ఉడికించండి.
-తర్వాత అందులో గంటసేపు నానబెట్టిన రెండున్నర కప్పుల(1 కప్పు 150 గ్రాముల లెక్కన) బాస్మతి బియ్యం, 5 కప్పుల హాట్ వాటర్ పోసి మూతపెట్టి పెద్ద మంటమీద 5 నిమిషాలు ఉడికించాలి.
-పూర్తిగా ఉడకడానికి రెండునిమిషాల ముందు పావుకప్పు నెయ్యి అందులో వెయ్యాలి. అంతే పనసకాయ బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications