నోట్లో వేస్తే కరిగిపోయేంత మృదువైన సగ్గుబియ్యం రసమలై

Posted By:

రసమలై పేరు వినగానే మన నోట్లో నీళ్లూరుతాయి. అయితే సంప్రదాయ రసమలై తయారీకి కాస్త సమయం, శ్రమ పడుతుంది. అలాంటి వారికోసం, కొత్త రుచులను ప్రయత్నించాలనుకునే వారికోసం ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయమే సగ్గుబియ్యం రసమలై.

సగ్గుబియ్యంతో చేసిన ఈ రసమలై రుచిలో అచ్చం అసలు రసమలైకి ఏమాత్రం తీసిపోదు. సగ్గుబియ్యం రసమలై ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Instant Sago Rasmalai Recipe in Telugu

కావాల్సిన పదార్థాలు
సగ్గుబియ్యం- అర కప్పు
పంచదార - 2 టేబుల్ స్పూన్లు
పాలు - 2-3 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - పావు టీస్పూన్
నెయ్యి - 1 టీస్పూన్
చిక్కటి పాలు (ఫుల్ క్రీం మిల్క్) - 1 లీటరు
పంచదార - అర కప్పు
కుంకుమపువ్వు - చిటికెడు
యాలకుల పొడి - అర టీస్పూన్
బాదం, పిస్తా- 2-3 టేబుల్ స్పూన్లు
ఉప్పు -చిటికెడు

తయారీ విధానం

-ముందుగా సగ్గుబియ్యాన్ని రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి కనీసం 3-4 గంటల పాటు నానబెట్టాలి.

-నానిన తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టి అందులో నానబెట్టిన సగ్గుబియ్యం, 2 టేబుల్ స్పూన్ల చక్కెర, 2-3 టేబుల్ స్పూన్ల పాలు వేసి కలుపుతూ ఉండాలి.

-కొద్ది నిమిషాల్లోనే సగ్గుబియ్యం పారదర్శకంగా మారి, దగ్గరగా ముద్దలా అవుతుంది. ఈ మిశ్రమం పాన్ నుండి వేరవుతున్నప్పుడు యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

-ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌ లోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, చిన్న చిన్న ఉండలుగా తీసుకుని అరచేతిలో పెట్టి రసమలై ఆకారంలో వత్తుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో లీటరు పాలు పోసి మీడియం మంట మీద వేడిచేయాలి. పాలు ఒక పొంగు వచ్చాక మంటను తగ్గించి, పాలు సగం అయ్యేంత వరకు మరిగించాలి. సుమారు 25-30 నిమిషాలు పట్టవచ్చు.

-పాలు మరిగేటప్పుడు గిన్నె అంచులకు పేరుకునే మీగడను గరిటెతో తీసి పాలల్లోనే కలుపుతూ ఉండాలి. దీనివల్ల రబ్డీ చిక్కగా, రుచిగా తయారవుతుంది.

-పాలు బాగా చిక్కబడిన తర్వాత అందులో చక్కెర, యాలకుల పొడి, కుంకుమపువ్వు నానబెట్టిన పాలు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి.

-చక్కెర పూర్తిగా కరిగే వరకు మరో 5 నిమిషాలు చిన్న మంటపై మరిగించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన బాదం, పిస్తా పలుకులలో కొన్నింటిని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

-తయారు చేసుకున్న పాల రసం (రబ్డీ) కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు సిద్ధం చేసుకున్న సగ్గుబియ్యం ఉండలను ఒక్కొక్కటిగా అందులో వేయాలి. గిన్నెపై మూత పెట్టి కనీసం 4-5 గంటల పాటు ఫ్రిజ్‌ లో పెట్టాలి. రాత్రంతా నానబెడితే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.

-తినే ముందు మిగిలిన బాదం, పిస్తా పలుకులతో అలంకరించాలి.

[ of 5 - Users]
Story first published: Saturday, November 15, 2025, 17:37 [IST]
Desktop Bottom Promotion