Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
నోట్లో వేస్తే కరిగిపోయేంత మృదువైన సగ్గుబియ్యం రసమలై
రసమలై పేరు వినగానే మన నోట్లో నీళ్లూరుతాయి. అయితే సంప్రదాయ రసమలై తయారీకి కాస్త సమయం, శ్రమ పడుతుంది. అలాంటి వారికోసం, కొత్త రుచులను ప్రయత్నించాలనుకునే వారికోసం ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయమే సగ్గుబియ్యం రసమలై.
సగ్గుబియ్యంతో చేసిన ఈ రసమలై రుచిలో అచ్చం అసలు రసమలైకి ఏమాత్రం తీసిపోదు. సగ్గుబియ్యం రసమలై ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
సగ్గుబియ్యం- అర కప్పు
పంచదార - 2 టేబుల్ స్పూన్లు
పాలు - 2-3 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - పావు టీస్పూన్
నెయ్యి - 1 టీస్పూన్
చిక్కటి పాలు (ఫుల్ క్రీం మిల్క్) - 1 లీటరు
పంచదార - అర కప్పు
కుంకుమపువ్వు - చిటికెడు
యాలకుల పొడి - అర టీస్పూన్
బాదం, పిస్తా- 2-3 టేబుల్ స్పూన్లు
ఉప్పు -చిటికెడు
తయారీ విధానం
-ముందుగా సగ్గుబియ్యాన్ని రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి కనీసం 3-4 గంటల పాటు నానబెట్టాలి.
-నానిన తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టి అందులో నానబెట్టిన సగ్గుబియ్యం, 2 టేబుల్ స్పూన్ల చక్కెర, 2-3 టేబుల్ స్పూన్ల పాలు వేసి కలుపుతూ ఉండాలి.
-కొద్ది నిమిషాల్లోనే సగ్గుబియ్యం పారదర్శకంగా మారి, దగ్గరగా ముద్దలా అవుతుంది. ఈ మిశ్రమం పాన్ నుండి వేరవుతున్నప్పుడు యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
-ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, చిన్న చిన్న ఉండలుగా తీసుకుని అరచేతిలో పెట్టి రసమలై ఆకారంలో వత్తుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో లీటరు పాలు పోసి మీడియం మంట మీద వేడిచేయాలి. పాలు ఒక పొంగు వచ్చాక మంటను తగ్గించి, పాలు సగం అయ్యేంత వరకు మరిగించాలి. సుమారు 25-30 నిమిషాలు పట్టవచ్చు.
-పాలు మరిగేటప్పుడు గిన్నె అంచులకు పేరుకునే మీగడను గరిటెతో తీసి పాలల్లోనే కలుపుతూ ఉండాలి. దీనివల్ల రబ్డీ చిక్కగా, రుచిగా తయారవుతుంది.
-పాలు బాగా చిక్కబడిన తర్వాత అందులో చక్కెర, యాలకుల పొడి, కుంకుమపువ్వు నానబెట్టిన పాలు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి.
-చక్కెర పూర్తిగా కరిగే వరకు మరో 5 నిమిషాలు చిన్న మంటపై మరిగించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన బాదం, పిస్తా పలుకులలో కొన్నింటిని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
-తయారు చేసుకున్న పాల రసం (రబ్డీ) కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు సిద్ధం చేసుకున్న సగ్గుబియ్యం ఉండలను ఒక్కొక్కటిగా అందులో వేయాలి. గిన్నెపై మూత పెట్టి కనీసం 4-5 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టాలి. రాత్రంతా నానబెడితే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.
-తినే ముందు మిగిలిన బాదం, పిస్తా పలుకులతో అలంకరించాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications