Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
నోట్లో వేస్తే కరిగిపోయేంత మృదువైన సగ్గుబియ్యం రసమలై
రసమలై పేరు వినగానే మన నోట్లో నీళ్లూరుతాయి. అయితే సంప్రదాయ రసమలై తయారీకి కాస్త సమయం, శ్రమ పడుతుంది. అలాంటి వారికోసం, కొత్త రుచులను ప్రయత్నించాలనుకునే వారికోసం ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయమే సగ్గుబియ్యం రసమలై.
సగ్గుబియ్యంతో చేసిన ఈ రసమలై రుచిలో అచ్చం అసలు రసమలైకి ఏమాత్రం తీసిపోదు. సగ్గుబియ్యం రసమలై ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
సగ్గుబియ్యం- అర కప్పు
పంచదార - 2 టేబుల్ స్పూన్లు
పాలు - 2-3 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - పావు టీస్పూన్
నెయ్యి - 1 టీస్పూన్
చిక్కటి పాలు (ఫుల్ క్రీం మిల్క్) - 1 లీటరు
పంచదార - అర కప్పు
కుంకుమపువ్వు - చిటికెడు
యాలకుల పొడి - అర టీస్పూన్
బాదం, పిస్తా- 2-3 టేబుల్ స్పూన్లు
ఉప్పు -చిటికెడు
తయారీ విధానం
-ముందుగా సగ్గుబియ్యాన్ని రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి కనీసం 3-4 గంటల పాటు నానబెట్టాలి.
-నానిన తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టి అందులో నానబెట్టిన సగ్గుబియ్యం, 2 టేబుల్ స్పూన్ల చక్కెర, 2-3 టేబుల్ స్పూన్ల పాలు వేసి కలుపుతూ ఉండాలి.
-కొద్ది నిమిషాల్లోనే సగ్గుబియ్యం పారదర్శకంగా మారి, దగ్గరగా ముద్దలా అవుతుంది. ఈ మిశ్రమం పాన్ నుండి వేరవుతున్నప్పుడు యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
-ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, చిన్న చిన్న ఉండలుగా తీసుకుని అరచేతిలో పెట్టి రసమలై ఆకారంలో వత్తుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో లీటరు పాలు పోసి మీడియం మంట మీద వేడిచేయాలి. పాలు ఒక పొంగు వచ్చాక మంటను తగ్గించి, పాలు సగం అయ్యేంత వరకు మరిగించాలి. సుమారు 25-30 నిమిషాలు పట్టవచ్చు.
-పాలు మరిగేటప్పుడు గిన్నె అంచులకు పేరుకునే మీగడను గరిటెతో తీసి పాలల్లోనే కలుపుతూ ఉండాలి. దీనివల్ల రబ్డీ చిక్కగా, రుచిగా తయారవుతుంది.
-పాలు బాగా చిక్కబడిన తర్వాత అందులో చక్కెర, యాలకుల పొడి, కుంకుమపువ్వు నానబెట్టిన పాలు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి.
-చక్కెర పూర్తిగా కరిగే వరకు మరో 5 నిమిషాలు చిన్న మంటపై మరిగించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన బాదం, పిస్తా పలుకులలో కొన్నింటిని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
-తయారు చేసుకున్న పాల రసం (రబ్డీ) కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు సిద్ధం చేసుకున్న సగ్గుబియ్యం ఉండలను ఒక్కొక్కటిగా అందులో వేయాలి. గిన్నెపై మూత పెట్టి కనీసం 4-5 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టాలి. రాత్రంతా నానబెడితే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.
-తినే ముందు మిగిలిన బాదం, పిస్తా పలుకులతో అలంకరించాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












