జామపండుతో అదిరిపోయే రోటి పచ్చడి.. రుచికి రుచి,ఆరోగ్యానికి ఆరోగ్యం, ఎలా చేసుకోవాలంటే?

మీరు మీ ఇంట్లో ఎన్నో రకాల చట్నీలు చేసుకొని ఉంటారు. బయట హోటళ్లలో ఎన్నో రకాలైన చట్నీలను తిని ఉంటారు. కానీ మీరెప్పుడైనా జామ పండుతో చేసిన చట్నీని తిన్నారా? దాని రుచి ఎప్పుడైనా టేస్ట్ చూశారా? కానీ, జామ కాయతో చట్నీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవును దీని రుచి అద్భుతంగా ఉంటుంది. రాజస్థాన్‌లో దీనిని ప్రత్యేకంగా చేసుకొని తింటారు. చేసుకోవడం కూడా చాలా సులభం. అసలు దీనిని ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రాజస్థాన్ స్టైల్ జామ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు

* కాశ్మీరీ మిరపకాయలు - 5
* జీలకర్ర - 1 tsp
* ఉప్పు - కొద్దిగా
* నీరు - కొద్దిగా
* కొత్తిమీర - కొద్దిగా
* జామ - 1
* నేచురల్ షుగర్- 1/2 టేబుల్ స్పూన్

జామ చట్నీ తయారీ విధానం

రాజస్థాన్ స్టైల్‌లో ఈ జామ కాయ చట్నీ చేసుకోవడం అత్యంత సులభమైన ప్రక్రియ. దీనిని తయారు చేసుకోవడానికి ముందుగా.. ఒక మిక్సీ జార్‌లో 5 నుంచి 6 కాశ్మీరీ మిరపకాయలు వేసుకోవాలి. దానితో పాటు ఒక టీస్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం నీరు వేసుకొని, బాగా రుబ్బుకోవాలి.

ఆ తరువాత దానికి కొద్దిగా కొత్తిమీర, ఒక తరిగిన జామపండు, కొన్ని దేశిమిర్చి వేసుకొని, మరోసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. జామపండు, మిర్చి మొత్తం సరిగ్గా నలిగే విధంగా మిక్సీ పట్టుకోవాలి. అంతే రాజస్థాన్ పద్దతిలో ఎంతో రుచికరమైన జామపండు చట్నీ సిద్ధమైనట్లే. దీనిని వేడి వేడి అన్నంలో లేదా, ఇడ్లిలో కలుపుకొని తింటే అబ్బా ఆ రుచే వేరు అంతే.

[ of 5 - Users]
Story first published: Friday, January 24, 2025, 9:08 [IST]
Desktop Bottom Promotion