Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
పుదీనా చట్నీలో ఈ ఒక్కటి కలపండి.. చట్నీ మరింత రుచికరంగా ఉంటుంది
Mint Peanut Chutney:మీరు ఉదయాన్నే ఇంట్లో ఇడ్లీ లేదా దోసె తయారు చేయబోతున్నారా? దీని కోసం కమ్మని రుచికరమైన చట్నీని తయారు చేయాలని ఆలోచిస్తున్నారా? మీ ఇంట్లో పుదీనా ఉందా? అయితే ఆ పుదీనాతో చట్నీ చేయండి.
మామూలుగా కాకుండా కాస్త వెరైటీగా చేయండి. అందుకు వేరుశెనగలు ఉపయోగించండి. దీంతో చట్నీ రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. ప్రధానంగా ఈ చట్నీని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు.
పుదీనా శనగ చట్నీ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? పుదీనా వేరుశెనగ చట్నీ యొక్క సాధారణ వంటకం క్రింద ఉంది. చదివి రుచి చూసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
కావాల్సినవి:
* వేయించిన వేరుశెనగ - 1/4 కప్పు
* పుదీనా - 1 కప్పు(ఆకులు కట్ చేసుకుని, శుభ్రంగా కడిగి
పెట్టుకోవాలి)
* కొత్తిమీర - 1/4 కప్పు(ఆకులు కట్ చేసుకుని, శుభ్రంగా కడిగి
పెట్టుకోవాలి)
* చిన్న ఉల్లిపాయ - 1 (తరిగినది)
* పచ్చిమిర్చి - 3
* జీలకర్ర - 1/4 tsp
* చింతపండు - 1 చిన్న ముక్క
* వెల్లుల్లి - 2 రెబ్బలు
* నూనె - 2 టేబుల్ స్పూన్లు
* ఉప్పు - రుచి ప్రకారం
తయారుచేయు విధానం:
* ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో వేరుశెనగ గింజలు(పల్లీలు)
వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి చల్లారనివ్వాలి.
* తర్వాత అదే బాణలిని స్టౌ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక అందులో
జీలకర్ర, ఉల్లి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి 2-3 నిమిషాలు
బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
* తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర, చింతపండు వేసి 1 నిమిషం వేయించి
చల్లారనివ్వాలి.
* తర్వాత మిక్సీ జార్ లో ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెనగ
గింజలు, వేగిన పుదీనా మిశ్రమం వేసి రుచికి తగ్గట్టుగా ఉప్పు, నీళ్లు
పోసి బాగా గ్రైండ్ చేసుకుంటే రుచికరమైన పుదీనాపల్లీల చట్నీ రెడీ.
* కావాలంటే చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత ఆవాలు, ఉల్లి, కరివేపాకు పోపు
వేసి చట్నీలో కలుపుకోవచ్చు.
Image Courtesy: indianveggiedelight
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












