Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
చక్కెర,బెల్లం లేకుండానే సూపర్ హెల్దీ రాగి ఓట్స్ లడ్డు..ఇంట్లోనే తయారుచేసుకోండిలా..
రాగి ప్రపంచంలోనే కాల్షియం అత్యధికంగా ఉండే చిరుధాన్యాలలో ఒకటి. ఇది భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఆహారంలో భాగంగా ఉంది. ఇందులో కాల్షియంత పాటు ఐరన్, ఫైబర్ కూడా అధికంగా ఉంటాయి. ఇక ఓట్స్ గురించి చెప్పాలంటే ఇది బీటా గ్లూకాన్స్ (Beta-Glucans) అనే శక్తివంతమైన కరిగే ఫైబర్ (Soluble Fiber) కు ప్రసిద్ధి చెందింది, ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రెండూ కలిసి తయారయ్యే లడ్డు, ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన స్నాక్ ఎంపిక. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు మరియు రక్తహీనత, మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
రాగి ఓట్స్ లడ్డు తయారీకి కావాల్సిన
పదార్థాలు
-రాగి పిండి-ఒకటిన్నర కప్పు
-ఓట్స్ పిండి-1 కప్పు
-పాలు- పావు కప్పు
-నెయ్యి-3 టేబుల్ స్పూన్లు
-యాలకల పొడి- 1 టీస్పూన్
-తెల్ల నువ్వులు- పావు కప్పు
-జీడిపప్పు- 12
-కొబ్బరి తురుము- పావు కప్పు
-ఖర్జూరం- 20
-తేనె- అరకప్పు
రాగి ఓట్స్ లడ్డు తయారీ విధానం
-ఓట్స్ ను లైట్ గా వేయించి మిక్సీలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
-ఖర్జూరాల నుండి విత్తనాలను తీసివేయండి. మిక్సీ లో 15 ఖర్జూరాలు,పాలు వేసి పేస్ట్ లా చేసుకోండి. మిగిలిన ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో తెల్ల నువ్వులను వేసి పొడిగా వేయించుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత అదే పాన్ లో జీడిపప్పు వేసి పొడిగా వేయించుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, ఓట్స్ పిండిని తక్కువ మంట మీద కొన్ని నిమిషాలు వేయించాలి.
-ఇప్పుడు మరో పాన్ తీసుకుని మిగిలిన నెయ్యిని వేడి చేసి, రాగి పిండిని వేసి అది పచ్చిదనం పోయే వరకు తక్కువ మంట మీద వేయించాలి.
-ఇప్పుడు ఓట్స్ పిండిని రాగి పిండిలో కలిపి, తక్కువ మంట మీద రెండూ కలిసేలా బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు అందులో ముందుగా రెడీ చేసుకున్న ఖర్జూరపు పేస్ట్ వేసి బాగా కలపండి. తర్వాత సగం తేనె వేసి కలపాలి.
-ఇప్పుడు యాలకుల పొడి వేసి బాగా కలపండి. కొన్ని నిమిషాలు తక్కువ మంట మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి.
-మిశ్రమాన్ని స్టవ్ మీద నుండి తీసి కొంతసేపు చల్లారనిచ్చాక అందులో కట్ చేసి ఉంచిన ఖర్జూరపు ముక్కలను, మిగిలిన తేనె వేసి బాగా కలపండి.
-ఇప్పుడు కొంచెం పిండిని చేతిలోకి తీసుకుని, అందులో జీడిపప్పు వేసి లడ్డు రూపంలో తయారు చేసుకోండి.
-తర్వాత ఓ ప్లేట్ లో వేయించిన నువ్వులను, కొబ్బరి తురుము వేసి కలిపి..చుట్టుకున్న లడ్డును ఈ మిశ్రమంలో వేసి అటూ ఇటూ తిప్పితే సరిపోతుంది. అంతే టేస్టీ రాగి ఓట్స్ లడ్డు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











