Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
కూరగాయలే అవసరం లేని రాయలసీమ స్పెషల్ ఎండుమిర్చి పప్పు..నాకి నాకి తింటారు, ఎలా చేసుకోవాలో చూడండి
రాయలసీమ అంటే చాలామందికి అక్కడివాళ్లు చేసే మర్యాదలు, ఫ్యాక్షన్ వంటివి మనసులో మెదలుతూ ఉంటాయి. ఇప్పుడైతే అక్కడ ఫ్యాక్షన్ కనుమరుగైందని చెప్పొచ్చు. రాయలసీమ అంటే వంటలకు కూడా చాలా చాలా ఫేమస్. రాయలసీమలో పుట్టినవాళ్లకి మిగతా ప్రాంతం వాళ్లకన్నా కొంచెం ఎక్కువగానే పౌరుషం ఉంటుందని సహజంగా అంటుంటారు. అయితే చాలామంది సీమ ప్రజలు దీనికి తాము తినే ఫుడ్ కారణమని కూడా చెబుతుంటారు. రాయలసీమలో చాలామంది తరుచుగా తినే ఎండుమిర్చి పప్పు మీరెప్పుడైనా తిన్నారా? తినకపోతే ఖచ్చితంగా ట్రై చేసి తీరాల్సిందే.
అన్నం లేదా జొన్న రొట్టెలలో రాయలసీమ స్టైల్ లో తయారుచేసే ఎండుమిర్చి పప్పుని కలుపుకుని తింటుంటే స్వర్గమే. రాయలసీమ స్పెషల్ ఎండుమిర్చి పప్పు ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

ఎండుమిర్చి పప్పు తయారీకి కావలసిన పదార్థాలు
-ఆయిల్
-కందిపప్పు
-చింతపండు
-ఉల్లిపాయ
-ఎండుమిర్చి
-ఆవాలు
-ధనియాలు
-వెల్లుల్లి
-శెనగపప్పు
-మినపప్పు
-జీలకర్ర
-పసుపు
-చింతపండు
-కరివేపాకు
-కొత్తిమీర
గార్లిక్ రైస్ ఎప్పుడైనా తిన్నారా? క్షణాల్లో రెడీ, ముద్ద ముద్దలో మజా వస్తుంది,ఎలా చేయాలంటే
ఎండుమిర్చి పప్పు తయారీ విధానం
-ముందుగా కుక్కర్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి అందులో అరకప్పు కండిపప్పు వేసి మంచి సువాసన వచ్చేదాకా వేయించండి.
-తర్వాత అందులో 1 ఉల్లిపాయ తరుగు, అర టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు, 10-12 కారంగా ఉండే ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించండి.
-కొద్దిగా ఉల్లిపాయలు,ఎండుమిర్చి వేగినత తర్వాత అందులో రెండున్నర కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి మీడియం మంటమీద 5 విజిల్స్ వచ్చేదాకా ఆగండి.
-తర్వాత మూతతీసి దానిని పప్పు గుత్తితో మెత్తగా మాష్ చేయాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనె వేడి చేసి అందులో పావు చెంచా మెంతులు వేసి ఎర్రగా వేయించాలి.
-మెంతులు వేగి తర్వాత అందులో అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ నలిపిన ధనియాలు, 5 కచ్చిపచ్చిగా దంచిన వెల్లుల్లి, 1 టీస్పూన్ శెనగపప్పు, 1 టీస్పూన్ మినపప్పు, అర టీస్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు వేసి తాళింపు ఎర్రగా వేపుకోవాలి.
-తర్వాత మెత్తగా మాష్ చేసిన పప్పుని తాళింపు బాండీలో వేసుకొని,ఇందులోని రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
-తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లి దించుకోవడమే. అంతే ఎండుమిర్చి పప్పు రెడీ. పప్పు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వేడి నీళ్లు కలుపుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications