Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
రాయలసీమ స్టైల్ లో పల్లీ చట్నీ..ఆహా ఏమి రుచిరా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే
రాయలసీమ వంటకాలు చాలా ప్రత్యేకమైనవి, ఆరోగ్యకరమైనవి. ఆ వంటకాలలో ముఖ్యమైనది పల్లీల చట్నీ. ఈ చట్నీని చాలా రకాలుగా చేస్తారు. పల్లీ చట్నీ రుచిగా ఉండడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే దీనిని ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. దీనిని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్తో తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. అంతేకాకుండా, పల్లీ చట్నీని తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి పల్లీ చట్నీ మంచిది. దీనిని ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా లాంటి వాటితో తినడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. రాయలసీమలో పల్లీ చట్నీని దాదాపు ప్రతి రోజూ తింటారు. రాయలసీమ స్టైల్లో పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
రాయలసీమ స్టైల్ పల్లీ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-వేరుశెనగపప్పు
-ఆవాలు
-ఎండుమిర్చి
-జీలకర్ర
-కరివేపాకు
-ఉల్లిపాయ
-వెల్లుల్లి
-అల్లం
-టమాటో
-చింతపండు
-ఆయిల్

రాయలసీమ స్టైల్ పల్లీ చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 1 కప్పు పల్లీలు(వేరుశెనగపప్పు)వేసి తక్కువ మంట మీద వేయించుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చెయ్యాలి.
-వేడెక్కిన ఆయిల్ లో 1 పెద్ద ఉల్లియను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి 2 నిమిషాలు వేపుకోవాలి. తర్వాత ఇందులో 1 టీస్పూన్ జీలకర్ర, 5 ఎండుమిరపకాయల ముక్కలు, ఒక చిన్న అల్లం తరుగు, చిన్న టమాటో తరుగు, 8 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మీడియం మంట మీద టమాటో ముక్కలు మగ్గేదాకా వేయించుకోవాలి.
-తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీ జర్ లో వేయండి. ఇందులోనే వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను పొట్టు తీసి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, రెండు రెబ్బల చింతపండు కూడా వేసి కొంచెం నీళ్లు కలుపుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత తాళింపు కోసం ప్టవ్ మీద బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి వేడి చేసి ఇందులో అర టీస్పూన్ పచ్చి శెనగపప్పు, అర టీస్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి.
-వేయించిన తాళింపును ముందుగా రెడీ చేసుకున్న చట్నీలో వేసి కలపాలి. అంతే టేస్టీ,స్పైసీ రాయలసీమ స్టైల్ పల్లీ చట్నీ రెడీ. దీనిని బ్రేక్ ఫాస్ట్ లో కలుపుకొని తింటుంటే ఆహా ఏమి రుచిరా అని తీరాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
