Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
రిపబ్లిక్ డే స్పెషల్..జాతీయ జెండా రంగులతో జిహ్వకు విందు చేసే తిరంగా పులావ్.. ఈజీగా ఇలా చేసేయండి
దేశవ్యాప్తంగా ఇవాళ రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ప్రతీ ఏటా జనవరి 26న దేశవ్యాప్తంగా జాతీయ జెండా రెపరెపలాడుతుంటే మన గుండెలు ఉప్పొంగుతాయి. 2026 గణతంత్ర దినోత్సవ వేడుకలను మరింత ప్రత్యేకంగా జరుపుకోవడానికి కేవలం కవాతులు, జెండా వందనాలే కాదు.. మన ఇంటి వంటగదిలోనూ దేశభక్తిని నింపేయొచ్చు.
ఈ రోజున కుటుంబ సభ్యులందరికీ కనులవిందు చేస్తూ, నాలుకకు రుచిని అందించే ఉత్తమ వంటకం త్రివర్ణ పులావ్. సాధారణంగా రంగుల కోసం కృత్రిమ ఫుడ్ కలర్స్ వాడుతుంటారు. కానీ మన జెండాలోని పవిత్రతను, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాలకూర, టమోటాలను ఉపయోగించి సహజసిద్ధంగా ఈ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం(సగం ఉడికనవి): 1 కప్పు
నెయ్యి: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర: పావు టేబుల్ స్పూన్
అల్లం పేస్ట్: 1 టేబుల్ స్పూన్
టమాటా గుజ్జు: పావు కప్పు
ఎర్ర కారం, పేస్ట్: అర టేబుల్ స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
బాస్మతి బియ్యం (పూర్తిగా ఉడికినవి): 1 కప్పు
నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: పావు టేబుల్ స్పూన్
అల్లం పేస్ట్: 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
పాలకూర గుజ్జు: అర కప్పు
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకోండి. అందులో నెయ్యి వేసి వేడెక్కాక జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు అల్లం పేస్ట్, ఎర్ర కారం పేస్ట్, టమాటా ప్యూరీ(మిక్సీలో టమాటోలు వేసి గుజ్జుగా చేసుకోవాలి) వేసి పచ్చి వాసన పోయేలా వేయించాలి.
-టమాటో గుజ్జు పచ్చివాసన పోయిన తర్వాత ఆ మిశ్రమంలో సగం ఉడికించిన బాస్మతి బియ్యం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు చల్లి, మూత పెట్టి బియ్యం పూర్తిగా ఉడికి, మంచి కాషాయ రంగు వచ్చే వరకు సన్నని మంటపై ఉడికించాలి.
-మరో పాన్ తీసుకుని నెయ్యి వేడి చేసి జీలకర్ర వేయాలి. తర్వాత అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పాలకూర గుజ్జు వేసి బాగా వేయించాలి. పాలకూరలోని పచ్చిదనం పోయాక, సగం ఉడికించిన బియ్యం, ఉప్పు వేసి కలపాలి. కొద్దిగా నీరు పోసి మూత పెట్టి అన్నం ఆకుపచ్చ రంగులోకి మారి పొడిపొడిగా అయ్యేంత వరకు ఉడికించాలి.
-సాధారణంగా వండుకున్న వేడి వేడి బాస్మతి అన్నాన్ని సిద్ధంగా ఉంచుకోండి. ఇందులో ఎలాంటి మసాలాలు కలపనవసరం లేదు, స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉండాలి.
-ఒక లోతైన గిన్నెను తీసుకోండి. ముందుగా అడుగు భాగంలో టమాటోలు వేసి చేసుకున్న అన్నాన్ని వేసి స్పూన్ తో సమానంగా ఒత్తాలి. దాని పైన తెల్లని అన్నాన్ని వేసి రెండో పొరలా పరచాలి. చివరగా పాలకూరలో చేసిన అన్నాన్ని వేసి సమానంగా చేయాలి.
-ఇప్పుడు ఆ గిన్నెను జాగ్రత్తగా ప్లేట్ మీదకు బోర్లించి మెల్లగా తీసేయండి. అంతే మన జాతీయ జెండా రంగులతో అద్భుతమైన త్రివర్ణ పులావ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












