Latest Updates
-
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే!
చపాతీలోకి అదిరిపోయే కాంబినేషన్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పనీర్ బుర్జీ మసాలా..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలం
చాలామంది రాత్రిపూట అన్నంకి బదులుగా చపాతీ లేదా రోటీలు లేదా పుల్కాలు తింటుంటారు. కొందరు అప్పుడప్పుడు రాత్రి పూట డిన్నర్ లోకి చపాతీలు తింటుంటారు. వేడి వేడి చపాతీల్లోకి జతగా ఏదైనా రుచికరమైన కూర ఉంటే ఆ మజాయే వేరు. చపాతీలోకి కేవలం పది నిమిషాల్లో అయిపోయే పనీర్ బుర్జీ మసాలా ట్రై చేయండి.
ఈ వంటకం రుచి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మీరు సాధారణంగా తినేవాటి కంటే ఖచ్చితంగా రెండు చపాతీలు ఎక్కువే లాగిస్తారు. బ్యాచిలర్లు, ఉద్యోగాలు చేసేవాళ్లు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు అతిథులు వచ్చినా, కంగారు పడకుండా క్షణాల్లో రుచికరమైన వంటకాన్ని వారి ముందు ఉంచవచ్చు. ఘుమఘుమలాడే పనీర్ బుర్జీ మసాలా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
సోంపు - అర టీస్పూన్
శనగపిండి - 1 టేబుల్ స్పూన్
పెద్ద ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 2
పెద్ద టమాటాలు - 3
ఉప్పు - మీ రుచికి సరిపడా
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
పసుపు -పావు టీస్పూన్
నీరు - సుమారు 2 కప్పులు
పనీర్ - 250 గ్రాములు
కొత్తిమీర - కొద్దిగా
వెన్న లేదా నెయ్యి - 1 టీస్పూన్
తయారుచేయు విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో నూనె పోసి, అది కాస్త వేడెక్కాక సోంపు వేయండి. సోంపు చిటపటలాడుతూ మంచి సువాసన వచ్చేవరకు వేయించండి. ఇప్పుడు శనగపిండిని వేసి పచ్చివాసన పోయి, కమ్మటి వాసన వచ్చేవరకు దోరగా తక్కువ మంట మీద వేయించండి.
-ఆ తర్వాత పాన్ లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి, వాటి పచ్చిదనం పోయేంతవరకు వేయించండి. ఆ తర్వాత, సన్నగా తరిగిన టమాటాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడికించండి.
-టమాటాలు బాగా మగ్గిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి వేయాలి. మొత్తాన్ని బాగా కలిసి, నూనె పైకి తేలేంత వరకు సన్నని మంటపై వేయించండి. ఈ దశలో ఒక కప్పు నీళ్లు పోసి, గ్రేవీని బాగా ఉడకనివ్వండి.
-గ్రేవీ మరుగుతున్నప్పుడు చేతితో మెత్తగా నలుపుకున్న పనీర్ ను వేసి బాగా కలపండి.
-ఇప్పుడు మరో కప్పు నీళ్లు పోసి, ఉప్పు సరిచూసుకోండి. అవసరమైతే కొద్దిగా వేసి మూతపెట్టి 4-5 నిమిషాలు ఉడికించండి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక టీస్పూన్ వెన్న లేదా నెయ్యి వేసి కలిపితే ఘుమఘుమలాడే, నోరూరించే పనీర్ బుర్జీ మసాలా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications