Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
చపాతీలోకి అదిరిపోయే కాంబినేషన్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పనీర్ బుర్జీ మసాలా..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలం
చాలామంది రాత్రిపూట అన్నంకి బదులుగా చపాతీ లేదా రోటీలు లేదా పుల్కాలు తింటుంటారు. కొందరు అప్పుడప్పుడు రాత్రి పూట డిన్నర్ లోకి చపాతీలు తింటుంటారు. వేడి వేడి చపాతీల్లోకి జతగా ఏదైనా రుచికరమైన కూర ఉంటే ఆ మజాయే వేరు. చపాతీలోకి కేవలం పది నిమిషాల్లో అయిపోయే పనీర్ బుర్జీ మసాలా ట్రై చేయండి.
ఈ వంటకం రుచి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మీరు సాధారణంగా తినేవాటి కంటే ఖచ్చితంగా రెండు చపాతీలు ఎక్కువే లాగిస్తారు. బ్యాచిలర్లు, ఉద్యోగాలు చేసేవాళ్లు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు అతిథులు వచ్చినా, కంగారు పడకుండా క్షణాల్లో రుచికరమైన వంటకాన్ని వారి ముందు ఉంచవచ్చు. ఘుమఘుమలాడే పనీర్ బుర్జీ మసాలా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
సోంపు - అర టీస్పూన్
శనగపిండి - 1 టేబుల్ స్పూన్
పెద్ద ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 2
పెద్ద టమాటాలు - 3
ఉప్పు - మీ రుచికి సరిపడా
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
పసుపు -పావు టీస్పూన్
నీరు - సుమారు 2 కప్పులు
పనీర్ - 250 గ్రాములు
కొత్తిమీర - కొద్దిగా
వెన్న లేదా నెయ్యి - 1 టీస్పూన్
తయారుచేయు విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో నూనె పోసి, అది కాస్త వేడెక్కాక సోంపు వేయండి. సోంపు చిటపటలాడుతూ మంచి సువాసన వచ్చేవరకు వేయించండి. ఇప్పుడు శనగపిండిని వేసి పచ్చివాసన పోయి, కమ్మటి వాసన వచ్చేవరకు దోరగా తక్కువ మంట మీద వేయించండి.
-ఆ తర్వాత పాన్ లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి, వాటి పచ్చిదనం పోయేంతవరకు వేయించండి. ఆ తర్వాత, సన్నగా తరిగిన టమాటాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడికించండి.
-టమాటాలు బాగా మగ్గిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి వేయాలి. మొత్తాన్ని బాగా కలిసి, నూనె పైకి తేలేంత వరకు సన్నని మంటపై వేయించండి. ఈ దశలో ఒక కప్పు నీళ్లు పోసి, గ్రేవీని బాగా ఉడకనివ్వండి.
-గ్రేవీ మరుగుతున్నప్పుడు చేతితో మెత్తగా నలుపుకున్న పనీర్ ను వేసి బాగా కలపండి.
-ఇప్పుడు మరో కప్పు నీళ్లు పోసి, ఉప్పు సరిచూసుకోండి. అవసరమైతే కొద్దిగా వేసి మూతపెట్టి 4-5 నిమిషాలు ఉడికించండి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక టీస్పూన్ వెన్న లేదా నెయ్యి వేసి కలిపితే ఘుమఘుమలాడే, నోరూరించే పనీర్ బుర్జీ మసాలా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications