Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
చపాతీలోకి అదిరిపోయే కాంబినేషన్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పనీర్ బుర్జీ మసాలా..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలం
చాలామంది రాత్రిపూట అన్నంకి బదులుగా చపాతీ లేదా రోటీలు లేదా పుల్కాలు తింటుంటారు. కొందరు అప్పుడప్పుడు రాత్రి పూట డిన్నర్ లోకి చపాతీలు తింటుంటారు. వేడి వేడి చపాతీల్లోకి జతగా ఏదైనా రుచికరమైన కూర ఉంటే ఆ మజాయే వేరు. చపాతీలోకి కేవలం పది నిమిషాల్లో అయిపోయే పనీర్ బుర్జీ మసాలా ట్రై చేయండి.
ఈ వంటకం రుచి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మీరు సాధారణంగా తినేవాటి కంటే ఖచ్చితంగా రెండు చపాతీలు ఎక్కువే లాగిస్తారు. బ్యాచిలర్లు, ఉద్యోగాలు చేసేవాళ్లు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు అతిథులు వచ్చినా, కంగారు పడకుండా క్షణాల్లో రుచికరమైన వంటకాన్ని వారి ముందు ఉంచవచ్చు. ఘుమఘుమలాడే పనీర్ బుర్జీ మసాలా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
సోంపు - అర టీస్పూన్
శనగపిండి - 1 టేబుల్ స్పూన్
పెద్ద ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 2
పెద్ద టమాటాలు - 3
ఉప్పు - మీ రుచికి సరిపడా
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
పసుపు -పావు టీస్పూన్
నీరు - సుమారు 2 కప్పులు
పనీర్ - 250 గ్రాములు
కొత్తిమీర - కొద్దిగా
వెన్న లేదా నెయ్యి - 1 టీస్పూన్
తయారుచేయు విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో నూనె పోసి, అది కాస్త వేడెక్కాక సోంపు వేయండి. సోంపు చిటపటలాడుతూ మంచి సువాసన వచ్చేవరకు వేయించండి. ఇప్పుడు శనగపిండిని వేసి పచ్చివాసన పోయి, కమ్మటి వాసన వచ్చేవరకు దోరగా తక్కువ మంట మీద వేయించండి.
-ఆ తర్వాత పాన్ లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి, వాటి పచ్చిదనం పోయేంతవరకు వేయించండి. ఆ తర్వాత, సన్నగా తరిగిన టమాటాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడికించండి.
-టమాటాలు బాగా మగ్గిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి వేయాలి. మొత్తాన్ని బాగా కలిసి, నూనె పైకి తేలేంత వరకు సన్నని మంటపై వేయించండి. ఈ దశలో ఒక కప్పు నీళ్లు పోసి, గ్రేవీని బాగా ఉడకనివ్వండి.
-గ్రేవీ మరుగుతున్నప్పుడు చేతితో మెత్తగా నలుపుకున్న పనీర్ ను వేసి బాగా కలపండి.
-ఇప్పుడు మరో కప్పు నీళ్లు పోసి, ఉప్పు సరిచూసుకోండి. అవసరమైతే కొద్దిగా వేసి మూతపెట్టి 4-5 నిమిషాలు ఉడికించండి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక టీస్పూన్ వెన్న లేదా నెయ్యి వేసి కలిపితే ఘుమఘుమలాడే, నోరూరించే పనీర్ బుర్జీ మసాలా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











