Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
వీకెండ్ కి అద్దిరిపోయే రొయ్యల బిర్యానీ..ఈ చిట్కాలతో రెస్టారెంట్ లో రుచి ఇంట్లోనే..
వీకెండ్ వచ్చిందంటే చాలు ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన వంటకం కావాలని కోరుకుంటారు. అలాంటి సమయంలో మీ కుటుంబ సభ్యుల హృదయాలను గెలుచుకోవడానికి ఒక అద్భుతమైన వంటకం ఉంది. అదే ఘుమఘుమలాడే రొయ్యల దమ్ బిర్యానీ. కొన్ని చిన్నచిన్న చిట్కాలతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రొయ్యల బిర్యానీని సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
రొయ్యలు: 250 -300 గ్రాములు
బాస్మతి బియ్యం: 1 కప్పు (200 గ్రాములు)
ఉల్లిపాయలు: 1 పెద్దది
టమోటా: 1
పచ్చిమిర్చి: 2-3
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
గట్టి పెరుగు: 2 టేబుల్ స్పూన్లు
బిర్యానీ మసాలా: 1 టేబుల్ స్పూన్
పసుపు: పావు టీస్పూన్
కారం: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె/నెయ్యి: 3 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం: 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర, పుదీనా: సన్నగా తరిగినవి
తయారీ విధానం
-ముందుగా శుభ్రం చేసిన రొయ్యలలో కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇది రొయ్యలు మెత్తగా, రుచిగా ఉండటానికి సహాయపడుతుంది.
-బాస్మతి బియ్యాన్ని కడిగి 30 నిమిషాలు నానబెట్టాలి.
-తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసి కేవలం 70శాతం వరకు మాత్రమే ఉడికించాలి. బియ్యం మెత్తబడకూడదు. ఆ తర్వాత నీటిని వడకట్టి బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి.
-అడుగు మందంగా ఉన్న పాత్రలో నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు గోధుమ రంగులోకి మారే వరకు బాగా వేయించాలి.
-ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఆపై టమోటా ముక్కలు, పెరుగు, బిర్యానీ మసాలా, కారం, పసుపు, ఉప్పు వేసి నూనె పైకి తేలే వరకు 5 నిమిషాలు ఉడికించాలి.
-ఇప్పుడు అందులో మ్యారినేట్ చేసిన రొయ్యలను వేసి మసాలాతో బాగా కలిపి 3-4 నిమిషాలు ఉడికించాలి. రొయ్యలు ఎక్కువగా ఉడికితే గట్టిపడతాయి. ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి రొయ్యల గ్రేవీపై సగం ఉడికించిన అన్నాన్ని ఒక పొరలా పరవాలి. దానిపై కొత్తిమీర, పుదీనా చల్లి, మిగిలిన అన్నాన్ని కూడా వేయాలి.
-పాత్రపై మూతను గట్టిగా పెట్టి ఆవిరి బయటకు పోకుండా చూడాలి. సన్నని మంట మీద 10 నుండి 12 నిమిషాల పాటు దమ్ చేయాలి.
-దమ్ అయ్యాక పొయ్యి ఆపి 10 నిమిషాలు అలా వదిలేయండి. ఆ తర్వాత నెమ్మదిగా ఒక పక్క నుండి కలుపుతూ, వేడివేడిగా ఒక ప్లేట్ లోకి తీసుకోండి. దీనిపై కొత్తిమీర, పుదీనా, నిమ్మరసంతో అలంకరించి, చల్లటి పెరుగు రైతా లేదా సలాడ్ తో తింటే సూపరో సూపర్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






