Latest Updates
-
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.!
పాతకాలపు రాయల్ టేస్ట్..పసందైన షాహీ పులావ్ ఎలా చేసుకోవాలంటే..
షాహీ పులావ్ అనేది ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఒక రుచికరమైన, సుగంధభరితమైన వంటకం. పేరులోనే షాహీ (రాజసం) అనే పదం ఉండడం వల్ల ఇది ఒకప్పుడు రాజులు, నవాబులు తమ విందులలో ఆరగించిన వంటకంగా చెబుతారు. ఈ వంటకం దాని సువాసనకు, అద్భుతమైన రుచికి, పోషక విలువలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో బాస్మతి బియ్యం, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ వంటివి ఉపయోగించి తయారు చేస్తారు. ఇది సాధారణ పులావ్ లా కాకుండా మరింత సంపన్నంగా, పోషక విలువలతో ఉంటుంది.
షాహీ పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు
-బాస్మతి బియ్యం: 2 కప్పులు
-నెయ్యి: 3-4 టేబుల్ స్పూన్లు
-ఉల్లిపాయలు: 1 పెద్దది
-అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
-క్యారెట్: 1
-బఠానీలు: అరకప్పు
-బంగాళదుంప: 1
-పన్నీర్ తురుము: 100 గ్రాములు
-జీడిపప్పు: 10-12
-బాదం పప్పు: 10-12
-కిస్మిస్: 1 టేబుల్ స్పూన్
-కొత్తిమీర: కొద్దిగా
పాలు: అరకప్పు
-ఉప్పు: తగినంత
-నీళ్ళు: 3 కప్పులు
-లవంగాలు: 3-4
-యాలకులు: 3-4
-దాల్చినచెక్క: 1 అంగుళం ముక్క
-బిర్యానీ ఆకు: 1
-షాహీ జీరా: అరటీస్పూన్
-మిరియాలు: 5-6
-పసుపు: పావు టీస్పూన్
-గరం మసాలా: పావు టీస్పూన్

తయారీ విధానం
-ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, అరగంట పాటు నానబెట్టాలి.
-ఒక మందపాటి గిన్నె లేదా కుక్కర్ లో నెయ్యి వేసి వేడి చేయండి. అందులో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి.
-అదే నెయ్యిలో లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, షాహీ జీరా, మిరియాలు వేసి అవి సువాసన వచ్చే వరకు వేగించాలి.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి అవి బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
-క్యారెట్, బంగాళదుంప, బఠానీలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
-నానబెట్టిన బియ్యాన్ని నీరు లేకుండా వడకట్టి గిన్నెలో వేసి నెయ్యితో కలిపి రెండు నిమిషాలు వేగించాలి. ఇలా చేయడం వల్ల బియ్యం విడివిడిగా ఉడుకుతాయి.
-ఇప్పుడు, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి.
-నీళ్లు, పాలు కలిపి బియ్యంలో పోయాలి. దీనికి వేయించిన పన్నీర్ ముక్కలు కూడా వేసి కలపాలి.
-కుక్కర్ మూత పెట్టి మీడియం మంటపై 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఒకవేళ గిన్నెలో ఉడికించినట్లయితే మూత పెట్టి తక్కువ మంటపై నీరు పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడికించాలి.
-పులావ్ ఉడికిన తర్వాత స్టవ్ ఆపి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. చివరిగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించండి.
-షాహీ పులావ్ కేవలం రుచిగా ఉండడమే కాకుండా, శరీరానికి పోషక విలువలను కూడా అందిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications