Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్తో చపాతీ కంటే సాఫ్ట్గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
జస్ట్ 10 నిమిషాల్లోనే హెల్తీ,టేస్టీ బ్రేక్ ఫాస్ట్..టమాటో పచ్చడితో తింటే స్వర్గమే..ఎలా చేసుకోవాలంటే..
పొద్దున్నే మనం తినే బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా దోశ, ఇడ్లీ.పూరీ, బోండా లేదా వడ వంటివి ఉంటాయి. అయితే ఎప్పుడూ ఇవే తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే ఈసారి కొత్తగా గోంధుమపిండితో హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ట్రై చేయండి. గోధుమ పిండితో చేసుకునే దోశలు చాలా ఆరోగ్యకరమైనవి. వీటిని కేవలం 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. క్రిస్పీగా, రుచికరంగా ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్లీ మళ్లీ కావాలి అనిపించేలా ఉంటాయి. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్ గా చేసుకునే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఇది. ఈజీగా 10 నిమిషాల్లో హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-నెయ్యి
-ఆవాలు
-జీలకర్ర
-అల్లం
-టమాటో
-ఉల్లిపాయ
-ఉప్పు
-మిరపకాయ
-కరివేపాకు
-కొత్తిమీర
-గోధుమ పిండి

తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చెయ్యాలి.
-నెయ్యి కరిగిన తర్వాత అందులో అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ పచ్చి శెనగపప్పు, 1 టీస్పూన్ మినపప్పు వేసి వీటన్నింటిని లైట్ గా వేయించుకోవాలి.
-పోపు దినుసులు లైట్ గా వేయించాక అందులో 1 టీస్పూన్ సన్నగా తరగిన అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని లైట్ గా వేగేంతవరకు వేయించుకోండి.
-తర్వాత అందులో సన్నగా కట్ చేసిన రెండు రెమ్మల కరివేపాకు వేసి వేపుకున్నాక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి.
-ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేదాకా వేయించుకున్నాక అందులో 1 టమాటో ముక్కలు వేసి కొద్దిగా మెత్తబడేదాకా వేయించి కొత్తిమీర తరుగు చల్లుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. పాన్ ను పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఓ బౌల్ లో ఒకటిన్నర కప్పు గోధుమపిండి, రుచికి సరిపడా ఉప్పు, ముందుగా వేయించిన మిశ్రమం మొత్తాన్ని వేసి, 2 కప్పుల నీళ్లు పోసి కలుపుకోవాలి. దోశ పిండి కంటే కొద్దిగా చిక్కగా ఉండేట్లు కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి వేడి చేశాక దోశలను వేసుకొని మీడియం మంట మఅద కాల్చుకోండి. వీటిని టమాటో చట్నీతో తింటే అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications