Latest Updates
-
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా..
జస్ట్ 10 నిమిషాల్లోనే హెల్తీ,టేస్టీ బ్రేక్ ఫాస్ట్..టమాటో పచ్చడితో తింటే స్వర్గమే..ఎలా చేసుకోవాలంటే..
పొద్దున్నే మనం తినే బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా దోశ, ఇడ్లీ.పూరీ, బోండా లేదా వడ వంటివి ఉంటాయి. అయితే ఎప్పుడూ ఇవే తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే ఈసారి కొత్తగా గోంధుమపిండితో హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ట్రై చేయండి. గోధుమ పిండితో చేసుకునే దోశలు చాలా ఆరోగ్యకరమైనవి. వీటిని కేవలం 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. క్రిస్పీగా, రుచికరంగా ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్లీ మళ్లీ కావాలి అనిపించేలా ఉంటాయి. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్ గా చేసుకునే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఇది. ఈజీగా 10 నిమిషాల్లో హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-నెయ్యి
-ఆవాలు
-జీలకర్ర
-అల్లం
-టమాటో
-ఉల్లిపాయ
-ఉప్పు
-మిరపకాయ
-కరివేపాకు
-కొత్తిమీర
-గోధుమ పిండి

తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చెయ్యాలి.
-నెయ్యి కరిగిన తర్వాత అందులో అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ పచ్చి శెనగపప్పు, 1 టీస్పూన్ మినపప్పు వేసి వీటన్నింటిని లైట్ గా వేయించుకోవాలి.
-పోపు దినుసులు లైట్ గా వేయించాక అందులో 1 టీస్పూన్ సన్నగా తరగిన అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని లైట్ గా వేగేంతవరకు వేయించుకోండి.
-తర్వాత అందులో సన్నగా కట్ చేసిన రెండు రెమ్మల కరివేపాకు వేసి వేపుకున్నాక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి.
-ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేదాకా వేయించుకున్నాక అందులో 1 టమాటో ముక్కలు వేసి కొద్దిగా మెత్తబడేదాకా వేయించి కొత్తిమీర తరుగు చల్లుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. పాన్ ను పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఓ బౌల్ లో ఒకటిన్నర కప్పు గోధుమపిండి, రుచికి సరిపడా ఉప్పు, ముందుగా వేయించిన మిశ్రమం మొత్తాన్ని వేసి, 2 కప్పుల నీళ్లు పోసి కలుపుకోవాలి. దోశ పిండి కంటే కొద్దిగా చిక్కగా ఉండేట్లు కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి వేడి చేశాక దోశలను వేసుకొని మీడియం మంట మఅద కాల్చుకోండి. వీటిని టమాటో చట్నీతో తింటే అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications