ఆలూ పనీర్‌ సమోసా

Aloo Paneer Samosa
కావలసిన పదార్ధాలు:
పనీర్‌: 1cup
బంగాళదుంపలు: 2
మైదాపిండి: 1cup
గరం మసాల: 1tbsp
కారం: 1/2tsp
జీడిపప్పులు: 5
కిస్‌మిస్‌ పళ్లు: 5
బాదాం: 5
నెయ్యి: 1tsp
కొత్తిమీర పేస్ట్‌: 1tsp
మిరియాలు: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానం:
1. బంగాళదుంపలు బాగా ఉడికించి పొట్టు తీసి చిదిమి పెట్టుకొని అందులో, పనీర్‌, సన్నగా తరిగిన బాదాంలు, జీడిపప్పులు, కిస్‌ మిస్‌ లు, మిరిమాల పొడి, కారం, కొత్తిమీర పేస్ట్‌, ఉప్పు చేర్చి బాగా కలపాలి.
2. ఇప్పుడు మైదాపిండిలో కాస్త నెయ్యి వేసి, కాస్త గట్టిగా చపాతీల పిండిలా కలిపి, పావుగంట అలా గే ఉంచాలి. తరువాత ఈ పిండిని సమాన భాగాలుగా చేసుకుని, మీడియం సైజు పూరీలు గా ఒత్తాలి.
3. వాటిని రెండు భాగాలుగా కట్‌ చేసి, ప్రతి ఒక్కదాన్నీ ముక్కోణంలా మడవాలి. కింది నుంచి అంచులు గట్టిగా అంటించినట్లుగా ఒత్తాలి. దీంట్లో పనీర్‌ మిశ్రమాన్ని పెట్టి, అంచులు మూసేయాలి, పాన్ లో నూనె పోసి బాగా వేడయ్యాక అందులో సిద్దం చేసి పెట్టుకొన్న పొటాటో పనీర్ సమోసాలను అందులో వేసి వేయించాలి అంతే ఆలూ పన్నీర్ సమోసాలు రెడీ.

Story first published: Thursday, June 24, 2010, 15:36 [IST]
Desktop Bottom Promotion