స్పైసీ రాగి రొట్టె తో బ్రెక్ ఫాస్ట్ మజా..

Ragi Rotti
మంచి పోషక విలువలుండే ఆహార ధాన్యాల్లో రాగులు కూడా ఒకటి.రాగులు బియ్యానికి ప్రత్యామ్న్యాయ చిరు ధాన్యం. పిండి పదార్ధ ప్రధాన ఆహారం. ఆరోగ్యానికి మరింత శ్రేష్టం. వీటిని సంకటి, అన్నము, జావ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. రాగి పిండితో రొట్టెలను తయారు చేస్తారు. ప్రస్తుత కాలంలో మధుమేహ(చెక్కర) వ్యాధి గ్రస్తులు వీటిని ఎక్కువగా తింటారు కనుక వీటిని కొన్ని చోట్ల ఇడ్లీలు, దోశలు కూడా చేస్తున్నారు. రాగి పిండితో బూరెలు లాంటి పిండి వంటలు చేస్తారు. మజ్జిగతో కలిపిన రాగి అంబలి వేసవి తాపం తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

స్థూలకాయం, బరువును తగ్గించుకోవాలనుకునే వారికి రాగులు బాగా తోడ్పడుతుంది. ఇన్ని విధాలుగా ఆరోగ్యానికి తోడ్పడే రాగులతో రకరకాల తినుబండారాలను తయారు చేసుకోవచ్చు. ఇవి చేయడం కూడా సులభం. పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు.

కావలసిన పదార్థాలు:
రాగి పిండి: 2cups
ఉల్లిపాయలు: 1cups(చిన్నగా కట్ చేసినవి)
కొత్తిమీర: 1/2cups(చిన్నగా కట్ చేసినవి)
కరివేపాకు: రెండు రెమ్మలు
పచ్చిమిర్చి: 4-5
జీలకర్ర: 1tsp
పచ్చికొబ్బరి తురుము: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
అల్లం తరుము: 1tsp
నీళ్ళు: పిండికలుపుకోవాడానికి కావలసినంత

తయారు చేయు విధానము:
1. ఒక బౌల్ తీసుకొని అందులో రాగి పిండి వేసుకోవాలి.
2. తర్వాత అందులో ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమిర, కరివేపాకు తరుగువేయాలి.
3. అందులోనే పచ్చికొబ్బరి తురుము, అల్లం తురుము వేసి కొద్దిగా వేడినీటితో మిశ్రమం అంతా సమంగా కలిసేటట్లు కలుపుకోవాలి. (పిండి జారుగా కాకుండా ముద్దగా కలపాలి).
4. ఇప్పుడు రాగి రొట్టెకు పిండి తయారైంది. తర్వాత పెనం పై కొద్దిగా నూనె రాగి పిండిని కొద్దిగా తీసుకొని పెనం పై తట్టాలి.
5. రొట్టెపై కొద్దిగా నూనె వేసి మూత పెట్టి ఎర్రగా కాల్చాలి. తర్వాత రెండవ వైపు తిప్పి ఎర్రగా కాల్చి ప్లేట్ లో తీసుకోవాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే రాగి రొట్టె రెడీ. ఈ రొట్టె ఉల్లిపాయ పచ్చడి / ఎర్రకారంతో తింటే చాలా బాగుంటుంది.

Story first published: Monday, September 26, 2011, 15:42 [IST]
Desktop Bottom Promotion