Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
Ragi Chimmili: ఎముకలను ఉక్కులా దృఢంగా చేసే రాగి చిమిలి..ఎలా చేసుకోవాలంటే
రాగితో తయారుచేసే ఏ వంటకాలు అయినా సరే టేస్ట్ అదిరిపోతుంది, ఆరోగ్యానికి మేలు కూడా జరుగుతుంది. రాగి చిమిలి గురించి మీరెప్పుడనా విన్నారా? ఇది పాతకాలం నాటి రెసిపి. పెద్దలకు అయినా, పిల్లలకు అయినా ఎముకలు దృఢంగా అవ్వడానికి, రక్తం పట్టడానికి, బలహీనంగా ఉన్నోళ్లకి నీరసం పోయి బలంగా ఉండటానికి రాగి చిమిలి చాలా బాగా పనిచేస్తుంది. దీనిని తయారుచేసుకోవడం కూడా చాలా ఈజీ. మీ ఇంట్లోనే ఈ టేస్టీ రాగి చిమిలి తయారు చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
రాగి చిమిలి తయారీకి కావాల్సిన పదార్థాలు
-రాగి పిండి
-పల్లీలు
-నెయ్యి
-నువ్వులు
-బెల్లం
రాగి చిమిలి తయారీ విధానం
-ముందుగా ఒక ప్లేట్ లో ఒక గ్లాసు రాగి పిండి వెయ్యాలి. అందులో చిటికెడు ఉప్పు, కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ ముద్దలా కలిపి దానిమీద ఓ గిన్నె బోర్లించి పావు గంట సేపు నాననివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ముప్పావు గ్లాసు పల్లీలు వేసి వేయించి పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
-తర్వాత బాండీలోనే పావు గ్లాసు నువ్వులు కూడా వేయించి పక్కన పెట్టుకోని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి దాని మీద నానిన రాగి పిండిని ఒక్కో ముద్దగా తీసుకొని అరటి ఆకు మీద పెట్టుకొని చపాతీలా వత్తుకొని పెనం మీద వేసి నెయ్యితో రెండువైపులా కాల్చుకొని పక్కనపెట్టుకొని చల్లారనివ్వాలి.
పాతకాలం నాటి బలవర్ధకమైన సజ్జ లడ్డూ..ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
-తర్వాత వేయించిన పల్లీలను పొట్టు తీసేసి మిక్సీ గిన్నెలో వేసి బరకగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి. తర్వాత నువ్వులను కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
-తర్వాత చల్లారిన రాగి అట్లను ముక్కలుగా చేసి మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో ముప్పావు గ్లాసు బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసిన మిశ్రమాలన్నీ కలిపి ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపి ఉండలుగా చేసుకోవాలి. అంతే రాగి చిమిలి రెడీ. దీనిని రోజుకొక్కటి తింటే చాలు ఆరోగ్యంగా ఉంటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







