Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఉప్పు చేప పప్పు చారు..రుచిలో దీనికి సాటి మరొకటి లేదు,ఎలా చేసుకోవాలంటే
చాలా సందర్భాలలో ఉప్పు చేప పప్పుచారు అనే పదం విని ఉంటాం. సినిమా పాటల్లో అయినా లేదా రెస్టారెంట్ కి వెళ్లినప్పుడు మెనూలో చూడటం ద్వారా ఇలా అనేక సందర్భాలలో ఈ పదం వింటుంటాం. వాస్తవానికి కోడికూర చిల్లుగారె మాదిరిగానే ఇది కూడా ఓ అద్భుతమైన కాంబినేషన్. ఉప్పు చేప పప్పు చారు అనేది ఒక సాంప్రదాయకమైన, రుచికరమైన వంటకం. ఇది ఏపీ,తెలంగాణ రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది రుచికరమైనదే కాకుండా పోషకమైన ఆహారం కూడా. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇది ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా కలిగి ఉంటుంది. శక్తిని అందిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఉప్పు చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. పప్పులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది, ఇది కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. చింతపండులో విటమిన్ సి ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తహీనతను నివారిస్తుంది. కండరాలు, ఎముకలను బలపరుస్తుంది.ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత రాకుండా కాపాడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఆరోగ్యానికి పలు రకాలుగా మేలు చేసే ఉప్పు చేప పప్పు చారుని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

ఉప్పు చేప పప్పు చారు తయారీకి కావలసిన పదార్థాలు
ఉప్పు చేప: 100 గ్రాములు
కందిపప్పు: 1 కప్పు
టమోటాలు: 2
ఉల్లిపాయలు: 1
పచ్చిమిర్చి: 4
చింతపండు: నిమ్మకాయ సైజు
కొత్తిమీర: 1 కట్ట
కరివేపాకు: 2 రెబ్బలు
ఆవాలు: 1 టీ స్పూన్
జీలకర్ర: 1/2 టీ స్పూన్
మెంతులు: 1/4 టీ స్పూన్
పసుపు: 1/2 టీ స్పూన్
కారం: 1 టీ స్పూన్
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
హైదరాబాదీ స్పెషల్ హలీం..దీని రుచికి సాటి మరేదీ ఉండదు,ఇంట్లోనే ఇలా చేసుకోండి
ఉప్పు చేప పప్పు చారు తయారీ విధానం
-ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి, ప్రెషర్ కుక్కర్ లో మెత్తగా ఉడికించాలి.
-తర్వాత ఉప్పు చేపను చిన్న ముక్కలుగా కోసి నీటిలో వేసి 10-15 నిమిషాలు నానబెట్టాలి.
-ఇప్పుడు చింతపండును నీటిలో నానబెట్టి గుజ్జు తీయాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి వేడి చేశాక అందులో ఆవాలు,జీలకర్ర,మెంతులు,కరివేపాకు వేసి వేగిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసి వేయించాలి.
-తర్వాత అందులో టమోటాలు, పసుపు, కారం వేసి మెత్తగా అయ్యేవరకు వేయించిన తర్వాత ఇందులో ఉడికించిన కందిపప్పు, చింతపండు గుజ్జు, తగినంత నీరు పోసి బాగా కలపాలి.
-తర్వాత అందులో ఉప్పు చేప ముక్కలు వేసి 15 నిమిషాలు ఉడికించాలి.
-తర్వాత కొత్తిమీర వేసి, 2-3 నిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే ఉప్పు చేప పప్పు చారు రెడీ. అన్నంలో వేడి వేడి ఉప్పు చేప పప్పు చారును తింటుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications