Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
పాతకాలం నాటి పచ్చడి..ఒక్కసారి రుచి చూస్తే జన్మలో మర్చిపోలేరు..ఎలా చేసుకోవాలంటే
రోజూ అవే కర్రీలు, అవే పచ్చళ్లు తిని తిని బోర్ కొట్టేస్తుంటది కొందరికి. ఏం తిన్నా నాలుకకు సహించదు ఆ సమయంలో. నాలుకకి కొత్తగా ఏదైనా రుచి చూస్తే గానీ మళ్లీ ప్రాణం లేసి రాదా? అయితే ఓ సారి ఎండుమిరపకాయలు,ఉల్లిపాయలతో చేసే పచ్చడి రుచి చూడాల్సిందే. ఎలాంటి కూరగాయలు అవసరం లేకుండా ఇంట్లోనే క్షణాల్లో రెడీ చేసుకునే ఈ పచ్చడిని ఒక్కసారి రుచిచూస్తే జన్మలో మర్చిపోరు. వేడి అన్నంలో ఈ పచ్చడిని కలుపుకొని తింటే నెక్ట్ లెవల్లో ఉంటుంది.
ఎండుమిరపకాయలు,ఉల్లిపాయ పచ్చడిని తయారుచేయడం కూడా చాలా చాలా ఈజీ. బ్యాచిలర్స్ కూడా క్షణాల్లోనే దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఈ పచ్చడి తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
-ఎండుమిర్చి
-ఉల్లిపాయ
-ఆయిల్
-కరివేపాకు
-చింతపండు
-ఉప్పు
ఇంట్లో ఏం కూరగాయలు లేకుంటే లంచ్ లోకి ఇలా చేసేయండి..అమృతం అంటూ కంచం నాకేస్తారు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేశాక ఇందులో 10-12 ఎండుమిర్చి వేసి మీడియం మంట మీద కలపుకుంటూ 2 నిమిషాలు వేయించి తీసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు బాండీలోని నూనెలోనే 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, నిమ్మసైజు అంత చింతపండు, 10 కరివేపాకులు వేసి మీడియం మంట మీద 2 నిమిషాలు వేయించాలి. కరివేపాకు ఆకులు తక్కువనే వేయాలి.
-ఉల్లిపాయలు దోరగా వేగాక వాటిని తీసి పక్కనపెట్టుకోవాలి. ఫ్రై చేసిన ఎండుమిర్చి, ఉల్లిపాయలను పూర్తిగా చల్లారనివ్వాలి
-తర్వాత వేయించిన ఎండుమిర్చి,ఉల్లిపాయ చింతపండు కరివేపాకు ఆకులని మిక్సీ గిన్నెలో వేసి ఇందులోనే రుచికి సరిపడా కళ్లు ఉప్పు వేసి కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి.
-పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడా కనబడుతూ ఉండాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయనక్కర్లేదు. అంతే ఎండుమిర్చి ఉల్లిపాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో దీన్ని నెయ్యితో కలుపుకొని తింటూంటూ ఆ మజానే వేరు. దీన్ని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలని ఎగబడటం గ్యారెంటీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications