Latest Updates
-
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.!
పాతకాలం నాటి పచ్చడి..ఒక్కసారి రుచి చూస్తే జన్మలో మర్చిపోలేరు..ఎలా చేసుకోవాలంటే
రోజూ అవే కర్రీలు, అవే పచ్చళ్లు తిని తిని బోర్ కొట్టేస్తుంటది కొందరికి. ఏం తిన్నా నాలుకకు సహించదు ఆ సమయంలో. నాలుకకి కొత్తగా ఏదైనా రుచి చూస్తే గానీ మళ్లీ ప్రాణం లేసి రాదా? అయితే ఓ సారి ఎండుమిరపకాయలు,ఉల్లిపాయలతో చేసే పచ్చడి రుచి చూడాల్సిందే. ఎలాంటి కూరగాయలు అవసరం లేకుండా ఇంట్లోనే క్షణాల్లో రెడీ చేసుకునే ఈ పచ్చడిని ఒక్కసారి రుచిచూస్తే జన్మలో మర్చిపోరు. వేడి అన్నంలో ఈ పచ్చడిని కలుపుకొని తింటే నెక్ట్ లెవల్లో ఉంటుంది.
ఎండుమిరపకాయలు,ఉల్లిపాయ పచ్చడిని తయారుచేయడం కూడా చాలా చాలా ఈజీ. బ్యాచిలర్స్ కూడా క్షణాల్లోనే దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఈ పచ్చడి తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
-ఎండుమిర్చి
-ఉల్లిపాయ
-ఆయిల్
-కరివేపాకు
-చింతపండు
-ఉప్పు
ఇంట్లో ఏం కూరగాయలు లేకుంటే లంచ్ లోకి ఇలా చేసేయండి..అమృతం అంటూ కంచం నాకేస్తారు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేశాక ఇందులో 10-12 ఎండుమిర్చి వేసి మీడియం మంట మీద కలపుకుంటూ 2 నిమిషాలు వేయించి తీసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు బాండీలోని నూనెలోనే 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, నిమ్మసైజు అంత చింతపండు, 10 కరివేపాకులు వేసి మీడియం మంట మీద 2 నిమిషాలు వేయించాలి. కరివేపాకు ఆకులు తక్కువనే వేయాలి.
-ఉల్లిపాయలు దోరగా వేగాక వాటిని తీసి పక్కనపెట్టుకోవాలి. ఫ్రై చేసిన ఎండుమిర్చి, ఉల్లిపాయలను పూర్తిగా చల్లారనివ్వాలి
-తర్వాత వేయించిన ఎండుమిర్చి,ఉల్లిపాయ చింతపండు కరివేపాకు ఆకులని మిక్సీ గిన్నెలో వేసి ఇందులోనే రుచికి సరిపడా కళ్లు ఉప్పు వేసి కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి.
-పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడా కనబడుతూ ఉండాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయనక్కర్లేదు. అంతే ఎండుమిర్చి ఉల్లిపాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో దీన్ని నెయ్యితో కలుపుకొని తింటూంటూ ఆ మజానే వేరు. దీన్ని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలని ఎగబడటం గ్యారెంటీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications