Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఘుమఘుమలతో కట్టిపడేసే హిమాచలీ చికెన్..స్వర్గం చూపిస్తుంది!
చలికాలం వచ్చేసింది. ఈ సమయంలో మనసు వేడివేడిగా, ఘాటుగా ఏదైనా తినాలని కోరుకోవడం సహజం. ఈ సమయంలో రోజూ తినే చికెన్ కూరకు భిన్నంగా, హిమాలయ పర్వత ప్రాంతాల నుండి వచ్చిన ఒక అద్భుతమైన వంటకాన్ని ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? అదే హిమాచలీ చికెన్ కర్రీ. దీనిని పహాడీ చికెన్ అని కూడా పిలుస్తారు. ఈ కూర ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో టమాటాలు గానీ, జీడిపప్పు పేస్ట్ గానీ ఉపయోగించరు. కేవలం పెరుగు, పాలు, కొన్ని సుగంధ ద్రవ్యాలతో దీనిని తయారుచేస్తారు.
ఆవ నూనెలో వేయించిన మసాలాల సువాసన, పెరుగులోని పులుపు, పాలలోని కమ్మదనం కలిసి ఈ కూరకు ఒక ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. ఈ చలికాలపు సాయంత్రాలలో వెన్నతో కాల్చిన నాన్ తో గానీ, వేడివేడి అన్నంతో గానీ ఈ హిమాచలీ చికెన్ కర్రీని తింటుంటే స్వర్గం కనిపిస్తుంది. హిమాచలీ చికెన్ కర్రీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
చికెన్ - 400 గ్రాములు
ఉల్లిపాయ - 1
పసుపు - 1 టీస్పూన్
లవంగాలు - 2-3
సోంపు గింజలు - పావు టీస్పూన్
కారం - అర టీస్పూన్
ధనియాలు - పావు టీస్పూన్
పెరుగు గిలకొట్టినది -పావు కప్పు
పాలు -పావు కప్పు
యాలకులు - 2
దాల్చిన చెక్క - అర అంగుళం ముక్క
పచ్చి మిరపకాయలు - 3-4
వెల్లుల్లి రెబ్బలు - 2-3
అల్లం - అర అంగుళం ముక్క
ఆవ నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు -సరిపడా
కొత్తిమీర - కొంచెం
తయారీ విధానం
-ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడగాలి. ఇందులో పసుపు, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 20-30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు చికెన్ కు బాగా పడతాయి.
-తర్వాత ఒక కడాయిలో ఆవ నూనె వేడి చేసి అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సోంపు, ధనియాలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. సువాసన వస్తున్నప్పుడు తరిగిన ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, పచ్చి మిరపకాయలు వేసి ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి.
-వేయించిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని, అవసరమైతే కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
-ఇప్పుడు అదే కడాయిలో మరికొంచెం ఆవ నూనె వేడి చేసి రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ను వేయాలి. నూనె పైకి తేలే వరకు 2-3 నిమిషాల పాటు తక్కువ మంటపై వేయించాలి.
-ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి అందులో గిలకొట్టిన పెరుగు, పాలను నెమ్మదిగా పోస్తూ ఉండలు కట్టకుండా వేగంగా కలపాలి. ఒక నిమిషం తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి మసాలాతో బాగా కలపాలి.
-కడాయిపై మూత పెట్టి 20 నిమిషాల పాటు లేదా చికెన్ పూర్తిగా ఉడికే వరకు తక్కువ మంటపై ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. చివరగా తాజా కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి. ఘుమఘుమలాడే హిమాచలీ స్టైల్ చికెన్ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









