Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్నెస్పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
సర్వే! ఒక అమ్మాయి కోసం ఎంతమంది అబ్బాయిలు పోటీ పడుతున్నారో తెలుసా...!
కరోనా మహమ్మారి సమయంలో మహిళలు కొందరిని మోసం చేశారట. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
'డేటింగ్ అంటే ఛీటింగ్' అని మన దేశంలో చాలా మంది అనుకుంటూ ఉంటారు. కొంతమందికి ఈ పదం కూడా కొత్తగా అనిపించొచ్చు. కానీ ఇది విదేశాల్లో ఉండేవారికి బాగా తెలుసు.

ఇటీవల కరోనా లాక్ డౌన్ కారణంగా మన దేశంలో ముఖ్యంగా మెట్రో నగరాల్లో కూడా ఈ డేటింగ్ కల్చర్ వచ్చేసింది. మరో విశేషమేమిటంటే గూగుల్ ప్లేస్టోర్ లో కూడా చాలా డేటింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.

చాలా యాప్స్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ కలిగి ఉండటంతో చాలా మంది వీటిని డౌన్ లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు. ఇలా ఎవరెవరు వీటిని వినియోగిస్తున్నారు.. వీరిలో అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారా? అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారా? అనే విషయాలపై ఓ డేటింగ్ యాప్ సంస్థ సర్వే నిర్వహించింది.

మన దేశంలో డేటింగ్ యాప్స్ ను వినియోగిస్తున్న వారిలో మహిళలు దాదాపు 26 శాతం మంది ఉన్నారంట. అయితే అందులో చాలా మంది ఫేక్ వివరాలనే పొందుపరిచారంట. అంతేకాదు కొందరని మోసం చేసినట్లు కూడా వెల్లడించారట. ఈ సర్వేలో ఇలాంటి సంచలన విషయాలు ఇంకా ఎన్నో వెల్లడయ్యాయట. ఆ వివరాలేంటో తెలియాలంటే మీరు ఈ ఆర్టికల్ ను పూర్తిగా చూడాల్సిందే...

ఒకరికి ముగ్గురు..
మన భారతదేశంలో మగవారి కంటే మహిళల సంఖ్య తక్కువగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజా సర్వేలో ఏమి తేలిందంటే.. డేటింగ్ యాప్ లలో ఒక్క అమ్మాయి వెంట ముగ్గురు అబ్బాయిలు పడుతున్నారట.

ఆన్ లైన్ డేటింగ్..
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా ఇటీవలి కాలంలో చాలా మంది ఆన్ లైన్ డేటింగ్ యాప్ లను విపరీతంగా వినియోగిస్తున్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆన్ లైనులో కూడా అబ్బాయిలకు ఎంతలా కరువు పరిస్థితులు ఉన్నాయో తాజా సర్వే ద్వారా తెలిసింది.

26 శాతం మంది మహిళలు..
మన భారతదేశంలో డేటింగ్ యాప్ లను వినియోగిస్తున్న వారిలో దాదాపు 26 శాతం మంది మహిళలు ఉన్నట్టు ‘వ్యూస్' అనే దేశీయ డేటింగ్ యాప్ నిర్వహించిన సర్వేలో తేలింది. అయితే ఇది అగ్రరాజ్యం అమెరికాలోని మహిళలకన్నా చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ అంతా టిండర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్స్ ను 40 శాతం మంది మహిళలు వినియోగిస్తున్నారు.

టైమ్ పాస్ కోసమే..
మన దేశం మినహా ఇతర దేశాల్లో చాలా మంది డేటింగ్ యాపులను కేవలం టైమ్ పాస్ కోసమే వినియోగిస్తారంట. అయితే కేవలం మన ఇండియాలో మాత్రం సీరియస్ గా డేటింగ్ చేయాలనే భావనతో వీటిని వినియోగిస్తున్నారని తేలింది.

కొత్తవారితో పరిచయం కోసం..
మన దేశంలో దాదాపు 32 శాతం మంది మహిళలు రిలేషన్ షిప్ సీరియస్ నెస్ కోసం ట్రై చేస్తున్నారంట. 28 శాతం మాత్రం కొత్తవారితో పరిచయం కోసం వాడుతున్నారని తేలింది.

ఫాలోయింగ్ కోసం..
మరి కొందరు మహిళలు సోషల్ మీడియాలో తమ ఫాలోయర్స్ పెరగాలని.. తమకు ఫాలోయింగ్ కోసం ఇలాంటి యాప్స్ ను వినియోగిస్తున్నట్లు తెలిపారట. మరో విశేషం ఏమిటంటే.. చాలా మంది మహిళలు 18 నుండి 21 వయసు గల అబ్బాయిలు మాత్రం అమ్మాయిలతో స్నేహం కోసం ఈ యాప్స్ ను వాడుతున్నట్లు చెప్పారట.

అంతా ఫేక్ డిటైల్స్..
అయితే డేటింగ్ యాప్ లో చాలా మంది ఫేక్ వివరాలను నమోదు చేస్తున్నారంట. ఎవ్వరూ కూడా వాస్తవ వివరాలను వెల్లడించడం లేదంట. అదేంటంటే.. అమ్మాయిల భద్రతను ద్రుష్టిలో ఉంచుకుని, ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలిసింది.



Click it and Unblock the Notifications