Latest Updates
-
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
లంకలో ఉండగా.. రావణాసురుడు సీతను ముట్టుకోకపోవడానికి కారణం ఇదే..!
రామాయణం గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. రామాయణంలోని పూర్తి విషయాలు తెలియకపోయినా రాముడు వనవాసానికి వెళ్లడం, అక్కడే రావణాసురుడు సీతాదేవిని అపహరించడం, ఆంజనేయ స్వామి సాయంతో శ్రీరామ చంద్రుడు సీతాదేవిని తిరిగి తన వద్దకు తెచ్చుకోవడం అందరికీ తెలిసిందే.
అయితే సీతాదేవిని రెండేళ్ల పాటు లంకలో బంధీగా ఉంచిన రావణాసురుడు సీతాదేవిపై మాత్రం చేయి వేయలేదు. ఆమె అంగీకరిస్తేనే ఆమెను ముట్టుకుంటానని చెప్పాడు. అయితే అందుకు గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సీతాదేవికి త్రిజట చెప్పిన కథ:
రావణాసురుడు సీతాదేవిని లంకలో బంధించినప్పుడు ఆమెను చూసుకోవడానికి ఇద్దరు రాక్షసులను నియమించాడు. అయితే అందులో ఒకరి పేరు త్రిజట. ఆశోకవనంలో త్రిజటతో పాటు మరో రాక్షస ప్రాణి కూడా ఉండేది. రాక్షస జీవి సీతను నిరంతరం భయపెడతూ.. రావణుడిని పెళ్లి చేసుకోవాలని వేధించేది. కానీ త్రిజట మాత్రం చాలా మంచిది. సీతా దేవి పట్ల చాలా దయతో ఉండేది. సీతాదేవికి ఆమె సాయం చేస్తూ.. ప్రేమగా మాట్లాడేది. రాముడికి సంబంధించిన కొన్ని వార్తలను మోసుకొస్తూ.. సీతా దేవికి అండగా నిలబడేది.
ఈక్రమంలోనే అప్పుడప్పుడూ సీతాదేవి రావణాసురుడు వచ్చి తనను ఏమైనా చేస్తాడని భయపడుతుంటే.. రావణాసురుడు నిన్ను ఎప్పటికీ తాకలేడని, నీకు ఇష్టం లేకుండా అతను నిన్ను ముట్టుకునే సాహసం కూడా చేయలేడని చెప్పింది. అది విన్న సీతను అపనమ్మకంగా చూస్తుంటే.. రావణాసురుడు సీతకు ఇష్టం లేకుండా ఎందుకు ముట్టుకునే ప్రయత్నం చేయడో సవివరంగా వివరించింది. కుబేరుడి కొడుకు నల కుబేరుని భార్య అయిన వనదేవత రంభను రావణాసురుడు కామంతో తాకి వినాశనానికి గురైన కథను చెబుతుంది.
రావణ బ్రహ్మ రంభను తాకినప్పుడు..
ఓసారి రావణ బ్రహ్మ రంభను తాకడానికి వెళ్తాడు. ఆమెకు ఇష్టం లేకుండా రావణాసురుడు ఆమెపై చేయి వేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. ఓ శాపం విధిస్తుంది. ఏ స్త్రీకి అయినా సరే ఇష్టం లేకుండా రావణాసురుడు ఆమెను తాకే ప్రయత్నం చేస్తే ఆమె బూడిద అవుతుందని రంభ శపిస్తుంది. రావణాసురుడు ఇదే భయంతో సీతాదేవిని ఏమీ చేయడు. ఆమె అంగీకరించే వరకు వేచి చూడాలనుకున్నాడు. కానీ తమ భర్త మీద ఉన్న ప్రేమ, నమ్మకంతో సీతా దేవి ఏనాడు రావణాసురుడిని కన్నెత్తి కూడా చూడలేదు. మాట్లాడాల్సిన వచ్చిన సందర్భంలో గడ్డిపోచను చూసే మాట్లాడుతుంది తప్పా.. రావణాసురుడిని నేరుగా చూసి మాట్లాడదు.



Click it and Unblock the Notifications











