Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
లంకలో ఉండగా.. రావణాసురుడు సీతను ముట్టుకోకపోవడానికి కారణం ఇదే..!
రామాయణం గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. రామాయణంలోని పూర్తి విషయాలు తెలియకపోయినా రాముడు వనవాసానికి వెళ్లడం, అక్కడే రావణాసురుడు సీతాదేవిని అపహరించడం, ఆంజనేయ స్వామి సాయంతో శ్రీరామ చంద్రుడు సీతాదేవిని తిరిగి తన వద్దకు తెచ్చుకోవడం అందరికీ తెలిసిందే.
అయితే సీతాదేవిని రెండేళ్ల పాటు లంకలో బంధీగా ఉంచిన రావణాసురుడు సీతాదేవిపై మాత్రం చేయి వేయలేదు. ఆమె అంగీకరిస్తేనే ఆమెను ముట్టుకుంటానని చెప్పాడు. అయితే అందుకు గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సీతాదేవికి త్రిజట చెప్పిన కథ:
రావణాసురుడు సీతాదేవిని లంకలో బంధించినప్పుడు ఆమెను చూసుకోవడానికి ఇద్దరు రాక్షసులను నియమించాడు. అయితే అందులో ఒకరి పేరు త్రిజట. ఆశోకవనంలో త్రిజటతో పాటు మరో రాక్షస ప్రాణి కూడా ఉండేది. రాక్షస జీవి సీతను నిరంతరం భయపెడతూ.. రావణుడిని పెళ్లి చేసుకోవాలని వేధించేది. కానీ త్రిజట మాత్రం చాలా మంచిది. సీతా దేవి పట్ల చాలా దయతో ఉండేది. సీతాదేవికి ఆమె సాయం చేస్తూ.. ప్రేమగా మాట్లాడేది. రాముడికి సంబంధించిన కొన్ని వార్తలను మోసుకొస్తూ.. సీతా దేవికి అండగా నిలబడేది.
ఈక్రమంలోనే అప్పుడప్పుడూ సీతాదేవి రావణాసురుడు వచ్చి తనను ఏమైనా చేస్తాడని భయపడుతుంటే.. రావణాసురుడు నిన్ను ఎప్పటికీ తాకలేడని, నీకు ఇష్టం లేకుండా అతను నిన్ను ముట్టుకునే సాహసం కూడా చేయలేడని చెప్పింది. అది విన్న సీతను అపనమ్మకంగా చూస్తుంటే.. రావణాసురుడు సీతకు ఇష్టం లేకుండా ఎందుకు ముట్టుకునే ప్రయత్నం చేయడో సవివరంగా వివరించింది. కుబేరుడి కొడుకు నల కుబేరుని భార్య అయిన వనదేవత రంభను రావణాసురుడు కామంతో తాకి వినాశనానికి గురైన కథను చెబుతుంది.
రావణ బ్రహ్మ రంభను తాకినప్పుడు..
ఓసారి రావణ బ్రహ్మ రంభను తాకడానికి వెళ్తాడు. ఆమెకు ఇష్టం లేకుండా రావణాసురుడు ఆమెపై చేయి వేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. ఓ శాపం విధిస్తుంది. ఏ స్త్రీకి అయినా సరే ఇష్టం లేకుండా రావణాసురుడు ఆమెను తాకే ప్రయత్నం చేస్తే ఆమె బూడిద అవుతుందని రంభ శపిస్తుంది. రావణాసురుడు ఇదే భయంతో సీతాదేవిని ఏమీ చేయడు. ఆమె అంగీకరించే వరకు వేచి చూడాలనుకున్నాడు. కానీ తమ భర్త మీద ఉన్న ప్రేమ, నమ్మకంతో సీతా దేవి ఏనాడు రావణాసురుడిని కన్నెత్తి కూడా చూడలేదు. మాట్లాడాల్సిన వచ్చిన సందర్భంలో గడ్డిపోచను చూసే మాట్లాడుతుంది తప్పా.. రావణాసురుడిని నేరుగా చూసి మాట్లాడదు.



Click it and Unblock the Notifications











