Latest Updates
-
బట్టతల నాన్న,తాత వల్ల వస్తుందా? అమ్మ వల్లా? అసలు విషయం తెలిస్తే అవునా,నిజమా అనాల్సిందే! -
స్వైపింగ్ చేసి విసిగిపోయారా? బంబుల్ డేటింగ్లో రాబోతున్న ఈ మార్పులు మీ లైఫ్ మార్చేయవచ్చు! -
ఆన్ లైన్ ఆర్డర్స్ వద్దు.. కరకరలాడే జ్యూసీ కొరియన్ ఫ్రైడ్ చికెన్ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి -
మీరు ఎంత కాలం బతుకుతారో..30 సెకన్ల ఈ కుర్చీ టెస్ట్ తో తెలుసుకోవచ్చు! -
నోరూరించే మామిడికాయ తాలింపు అన్నం..అదిరిపోతుంది బాసూ కేక కేక అంతే.. -
భర్త కోసం ఉద్యోగం వదలాలా? సుప్రీంకోర్టు తీర్పుతో వర్కింగ్ ఉమెన్స్కు ఊహించని ఊరట! -
టిఫిన్ బండి స్టైల్ అల్లం చట్నీ..ఏంట్రా ఇంత బాగుంది అని మెచ్చుకోవాల్సిందే! -
గ్రహాల కదలికలతో ఈ 4 రాశుల వారికి నేడు ఊహించని ధనయోగం..కెరీర్లో తిరుగులేని విజయాలు! -
ఫైబర్, ప్రోటీన్ పుష్కలం..కొవ్వు కరిగించి, కొండలను ఢీకొట్టే బలాన్నిచ్చే జొన్న కిచిడి..ఎలా చేసుకోవాలంటే.. -
మహాలక్ష్మి రాజయోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే!
సింధూర ప్రియుడు హనుమంతుని తోకకు వెన్న రాసే ఆచారం వెనుక దాగున్న రహస్యం..
పుణ్యక్షేత్రాలకి వెళ్లినప్పుడు .. దైవదర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చిన భక్తులు కనిపిస్తుంటారు. ఒకరి ఆచారవ్యవహారాలను ఒకరు ఆసక్తికరంగా గమనిస్తూ ఉండటం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక ఆయా పుణ్యక్
పుణ్యక్షేత్రాలకి వెళ్లినప్పుడు .. దైవదర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చిన భక్తులు కనిపిస్తుంటారు. ఒకరి ఆచారవ్యవహారాలను ఒకరు ఆసక్తికరంగా గమనిస్తూ ఉండటం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక ఆయా పుణ్యక్షేత్రాల్లో కూడా అక్కడి విశ్వాసాలు ఆచార వ్యవహారాలుగా కనిపిస్తుంటాయి. వాటిని చూసినప్పుడు కాస్త ఆశ్చర్యంగా అనిపించినా, భక్తులుగా వాటిని ఆచరించి సంతృప్తిని పొందడం జరుగుతూ ఉంటుంది.

ఇలాంటి ఆచారమే ఒకటి మనకి తమిళనాడు రాష్ట్రానికి చెందిన 'సుచీంద్రం' లో కనిపిస్తుంది. త్రిమూర్తులు ఒకే లింగరూపంలో ఆవిర్భవించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. లింగం పైభాగాన విష్ణు మూర్తి .. మధ్యభాగంలో శివుడు ... క్రిందిభాగంలో బ్రహ్మదేవుడు ఉన్నారని స్థలపురాణం చెబుతోంది.

అహల్య విషయంలో గౌతమమహర్షి శాపానికి గురైన దేవేంద్రుడు, ఇక్కడి త్రిమూర్తులను ఆశ్రయించి శాపవిమోచనాన్ని పొందాడని అంటారు.
ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో 18 అడుగుల హనుమంతుడి విగ్రహం కొలువై ఉంటుంది. ఇంతటి భారీ రూపాన్ని కొంచెం దూరం నుంచే పూర్తిగా చూడగలుగుతాం.

సాధారణంగా హనుమంతుడి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్లు ఆయనకి సిందూర అభిషేకం చేయిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా ఈ క్షేత్రంలో స్వామివారి తోకకు స్వయంగా 'వెన్నపూస' రాస్తుంటారు.

ఈ ఆచారం రామాయణ కాలంతో ముడిపడివుం దని ఇక్కడి వాళ్లు చెబుతుంటారు. సీతాన్వేషణ చేస్తూ లంకా నగరంలో అడుగుపెట్టిన హనుమంతుడు, కావాలనే రావణ సైన్యానికి పట్టుబడతాడు.
రావణుడి ఆదేశం మేరకు ఆయన సైనికులు హనుమంతుడి తోకకు నిప్పుపెడతారు. ఆ సంఘటనని తనకి అనుకూలంగా మార్చుకున్న హనుమంతుడు తన తోకకి గల మంటను అక్కడి భవనాలకు అంటించి వాళ్లని భయభ్రాంతులకు గురిచేస్తాడు.

ఆ సంఘటనలో హనుమంతుడి తోక చాలావరకూ కాలిపోతుంది. ఆ బాధ నుంచి ఆయనకి ఉపశమనం కలగాలనే ఉద్దేశంతోనే ఇక్కడి స్వామి తోకకి 'వెన్నపూస' రాస్తున్నట్టుగా చెబుతారు. తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారం వెనుక గల అర్థం ఇదేనని అంటారు.

ఈ విధంగా హనుమంతుడి తోకకి వెన్నపూస రాస్తూ ఆయనకి ఉపశమనం కలిగించడం వలన, ఆ స్వామి ఆయురారోగ్యాలను ... అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని బలంగా విశ్వసిస్తుంటారు.



Click it and Unblock the Notifications