Latest Updates
-
స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇంట్లోనే..ఎలాంటి సాస్ లు లేకుండానే అదిరిపోయే వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రైడ్ రైస్.. -
పెసరపప్పు వెజిటేబుల్ ఇడ్లీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కేవలం 15 నిమిషాల్లో రెడీ! -
ఎప్పుడూ అలసిపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ విటమిన్ తగ్గినట్లే..డాక్టర్ చెప్పిన సంచలన నిజం! -
కరకరలాడే కాకరకాయ కాజు ఫ్రై..ఒక్కసారి వండితే రుచి మర్చిపోలేరు..అన్నం, పప్పు, రసంలోకి కేక! -
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే..
Chaitra Navratri 2020 : శుభ సమయం, శుభ ముహుర్తం, పూజా విధులివే...
ఈ సంవత్సరం ఛైత్ర నవరాత్రి సందర్భంగా పవిత్రమైన శుభ సమయం, శుభ ముహుర్తం, దుర్గాదేవి ఆరాధన పద్ధతుల గురించి తెలుసుకోండి...
మన దేశంలో నవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరం హిందువులందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో దుర్గా దేవిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తారు. అలాంటి నవరాత్రి ఉత్సవాలు ప్రస్తుతం మార్చి నెల 25వ తేదీ నుండి ప్రారంభమవుతోంది. ఈ నవరాత్రులు హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం రెండు లేదా నాలుగు సార్లు వస్తాయి.

ఛైత్ర నవరాత్రి అని కూడా పిలుచుకునే వసంత నవరాత్రి ఛైత్ర మాసంలో (మార్చి-ఏప్రిల్) జరుపుకుంటారు. ఈ నవరాత్రులకు ఎలాంటి తిథి అనేది ఉండదు. ఇది ఎక్కువగా ఛైత్ర, అశ్విణి, మాఘ మాసంలో వస్తుంది. అయితే తెలుగు నెలలో తొలి నెల అయిన ఛైత్ర, అశ్విని మాసాలలో వచ్చే నవరాత్రులే బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిని మహానవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం ఛైత్ర నవరాత్రి సందర్భంగా పవిత్రమైన శుభ సమయం, శుభ ముహుర్తం, దుర్గాదేవి ఆరాధన పద్ధతుల గురించి తెలుసుకోండి...

ఛైత్ర నవరాత్రి ప్రాముఖ్యత
నవరాత్రి ప్రారంభంలో దుర్గాదేవి విగ్రహాన్ని స్థాపిస్తారు. ఇలా చేయడం కుటుంబంలో సానుకూల ఫలితం ఉంటుందని, అందరి జీవితంలో ఆనందం లభిస్తుందని చాలా మంది హిందువులు నమ్ముతారు. ఇలా స్థాపించిన అమ్మవారి విగ్రహానికి తొమ్మిది రోజుల పాటు ఏకశిల దీపాలను వెలిగిస్తారు. ఈ కాలంలో అవి శాంతికాకుండా చూసుకుంటారు. ఈ సమయంలో చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు.

అమ్మవారి ఆరాధన..
ఛైత్ర నవరాత్రి ప్రారంభరోజు చాలా మంది హిందువులు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. ఆ తర్వాత ఇంటిని, దేవుని గదిని శుభ్రపరచుకోవాలి. అనంతరం మంచి బట్టలు ధరించాలి. ఒక కుండలో మట్టిని వేసి అందులో జొన్న విత్తనాలను వేయాలి. అందులో దుర్గాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.

పూలమాలతో...
అమ్మవారికి ఒక పూలమాల వేయాలి. స్వస్తిక గుర్తును తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి. దీని కోసం నీరు, అక్షింతలు, గింజలు, నాణెం వంటి వాటిని ఓ ఎరుపు రుంగు గుడ్డలో వేసి కట్టాలి. తర్వాత కొబ్బరికాయపై కుంకుమతో తిలకం దిద్దాలి.

తొలి రోజు..
2020 సంవత్సరంలో ఛైత్ర నవరాత్రి మార్చి 25వ తేదీ అయిన బుధవారం నాడు ఉదయం 6 గంటల నుండి రాత్రి 7:17 గంటల వరకు శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఆరోజున అమ్మవారిని ఆలయంలో శైలపుత్రిగా అలంకరించి ఆరాధిస్తారు.

రెండో రోజు
వసంత నవరాత్రుల్లో రెండో రోజైన మార్చి 26వ తేదీ, గురువారం నాడు అమ్మవారిని బ్రహ్మచారిణిగా ఆరాధిస్తారు.

మూడో రోజు
వసంత నవరాత్రుల్లో మూడో రోజైన మార్చి 27వ తేదీ, శుక్రవారం నాడు అమ్మవారి చంద్రఘంట రూపంలో అలంకరించి పూజిస్తారు.

నాలుగో రోజు
వసంత నవరాత్రుల్లో నాలుగో రోజైన మార్చి 28వ తేదీ అయిన శనివారం నాడు అమ్మవారిని కుష్మండ రూపంలో అలంకరించి అమ్మవారిని పూజిస్తారు.

ఐదో రోజు
వసంత నవరాత్రుల్లో ఐదో రోజైన మార్చి 29వ తేదీ అయిన ఆదివారం నాడు అమ్మవారిని స్కందమాత రూపంలో అలంకరించి పూజిస్తారు.

ఆరో రోజు
వసంత నవరాత్రుల్లో ఆరో రోజైన మార్చి 30వ తేదీ, సోమవారం నాడు అమ్మవారిని కాత్యాయని రూపంలో పూజిస్తారు.

ఏడో రోజు
వసంత నవరాత్రుల్లో ఏడో రోజైన మార్చి 31వ తేదీ, మంగళవారం నాడు అమ్మవారిని కలరాత్రి మాతగా పూజిస్తారు.

ఎనిమిదో రోజు
వసంత నవరాత్రుల్లో ఎనిమిదో రోజైన ఏప్రిల్ 1వ తేదీ, బుధవారం నాడు అమ్మవారిని మహాగౌరిగా అలంకరించి పూజిస్తారు.

తొమ్మిది రోజు..
వసంత నవరాత్రుల్లో చివరి రోజు అయిన తొమ్మిదో రోజు, ఏప్రిల్ 2వ తేదీ, గురువారం నాడు అమ్మవారిని సిద్ధిదాత్రి రూపంలో అలంకరించి పూజిస్తారు.



Click it and Unblock the Notifications











