Latest Updates
-
క్రేజీ రెసిపీ..ఎప్పుడైనా క్రిస్పీ గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? అదిరిపోయే టేస్ట్ తో పాటు హెల్తీ కూడా.. -
మే 5: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా! -
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే! -
మేషం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? – మంగళవారం, 05 మే 2026 -
మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాలివే! -
డీప్ఫేక్ సెక్స్టార్షన్ ఉచ్చులో పడ్డారా? మీ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే! -
కిడ్నీ రాళ్లను ఇట్టే కరిగించే ఉలవలతో టేస్టీ వడలు..తయారీ విధానం ఇదే! -
తెలంగాణ-ఏపీలో ఎండల తీవ్రత: గర్భిణీలకు పొంచి ఉన్న ముప్పు ఇదే!
Chaitra Navratri 2020 : శుభ సమయం, శుభ ముహుర్తం, పూజా విధులివే...
ఈ సంవత్సరం ఛైత్ర నవరాత్రి సందర్భంగా పవిత్రమైన శుభ సమయం, శుభ ముహుర్తం, దుర్గాదేవి ఆరాధన పద్ధతుల గురించి తెలుసుకోండి...
మన దేశంలో నవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరం హిందువులందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో దుర్గా దేవిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తారు. అలాంటి నవరాత్రి ఉత్సవాలు ప్రస్తుతం మార్చి నెల 25వ తేదీ నుండి ప్రారంభమవుతోంది. ఈ నవరాత్రులు హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం రెండు లేదా నాలుగు సార్లు వస్తాయి.

ఛైత్ర నవరాత్రి అని కూడా పిలుచుకునే వసంత నవరాత్రి ఛైత్ర మాసంలో (మార్చి-ఏప్రిల్) జరుపుకుంటారు. ఈ నవరాత్రులకు ఎలాంటి తిథి అనేది ఉండదు. ఇది ఎక్కువగా ఛైత్ర, అశ్విణి, మాఘ మాసంలో వస్తుంది. అయితే తెలుగు నెలలో తొలి నెల అయిన ఛైత్ర, అశ్విని మాసాలలో వచ్చే నవరాత్రులే బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిని మహానవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం ఛైత్ర నవరాత్రి సందర్భంగా పవిత్రమైన శుభ సమయం, శుభ ముహుర్తం, దుర్గాదేవి ఆరాధన పద్ధతుల గురించి తెలుసుకోండి...

ఛైత్ర నవరాత్రి ప్రాముఖ్యత
నవరాత్రి ప్రారంభంలో దుర్గాదేవి విగ్రహాన్ని స్థాపిస్తారు. ఇలా చేయడం కుటుంబంలో సానుకూల ఫలితం ఉంటుందని, అందరి జీవితంలో ఆనందం లభిస్తుందని చాలా మంది హిందువులు నమ్ముతారు. ఇలా స్థాపించిన అమ్మవారి విగ్రహానికి తొమ్మిది రోజుల పాటు ఏకశిల దీపాలను వెలిగిస్తారు. ఈ కాలంలో అవి శాంతికాకుండా చూసుకుంటారు. ఈ సమయంలో చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు.

అమ్మవారి ఆరాధన..
ఛైత్ర నవరాత్రి ప్రారంభరోజు చాలా మంది హిందువులు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. ఆ తర్వాత ఇంటిని, దేవుని గదిని శుభ్రపరచుకోవాలి. అనంతరం మంచి బట్టలు ధరించాలి. ఒక కుండలో మట్టిని వేసి అందులో జొన్న విత్తనాలను వేయాలి. అందులో దుర్గాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.

పూలమాలతో...
అమ్మవారికి ఒక పూలమాల వేయాలి. స్వస్తిక గుర్తును తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి. దీని కోసం నీరు, అక్షింతలు, గింజలు, నాణెం వంటి వాటిని ఓ ఎరుపు రుంగు గుడ్డలో వేసి కట్టాలి. తర్వాత కొబ్బరికాయపై కుంకుమతో తిలకం దిద్దాలి.

తొలి రోజు..
2020 సంవత్సరంలో ఛైత్ర నవరాత్రి మార్చి 25వ తేదీ అయిన బుధవారం నాడు ఉదయం 6 గంటల నుండి రాత్రి 7:17 గంటల వరకు శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఆరోజున అమ్మవారిని ఆలయంలో శైలపుత్రిగా అలంకరించి ఆరాధిస్తారు.

రెండో రోజు
వసంత నవరాత్రుల్లో రెండో రోజైన మార్చి 26వ తేదీ, గురువారం నాడు అమ్మవారిని బ్రహ్మచారిణిగా ఆరాధిస్తారు.

మూడో రోజు
వసంత నవరాత్రుల్లో మూడో రోజైన మార్చి 27వ తేదీ, శుక్రవారం నాడు అమ్మవారి చంద్రఘంట రూపంలో అలంకరించి పూజిస్తారు.

నాలుగో రోజు
వసంత నవరాత్రుల్లో నాలుగో రోజైన మార్చి 28వ తేదీ అయిన శనివారం నాడు అమ్మవారిని కుష్మండ రూపంలో అలంకరించి అమ్మవారిని పూజిస్తారు.

ఐదో రోజు
వసంత నవరాత్రుల్లో ఐదో రోజైన మార్చి 29వ తేదీ అయిన ఆదివారం నాడు అమ్మవారిని స్కందమాత రూపంలో అలంకరించి పూజిస్తారు.

ఆరో రోజు
వసంత నవరాత్రుల్లో ఆరో రోజైన మార్చి 30వ తేదీ, సోమవారం నాడు అమ్మవారిని కాత్యాయని రూపంలో పూజిస్తారు.

ఏడో రోజు
వసంత నవరాత్రుల్లో ఏడో రోజైన మార్చి 31వ తేదీ, మంగళవారం నాడు అమ్మవారిని కలరాత్రి మాతగా పూజిస్తారు.

ఎనిమిదో రోజు
వసంత నవరాత్రుల్లో ఎనిమిదో రోజైన ఏప్రిల్ 1వ తేదీ, బుధవారం నాడు అమ్మవారిని మహాగౌరిగా అలంకరించి పూజిస్తారు.

తొమ్మిది రోజు..
వసంత నవరాత్రుల్లో చివరి రోజు అయిన తొమ్మిదో రోజు, ఏప్రిల్ 2వ తేదీ, గురువారం నాడు అమ్మవారిని సిద్ధిదాత్రి రూపంలో అలంకరించి పూజిస్తారు.



Click it and Unblock the Notifications