Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్నెస్పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
ఇంద్రుడికి వజ్రాయుధం ఎలా వచ్చిందో తెలుసా? ఒక మహర్షి ఎముకలతో తయారైంది అది, ఆయన తల నరకినా సాయం చేశాడు
దేవతలంతా వెళ్లి దధీచికి విషయం చెబుతారు. తన వల్ల అందరికీ మంచి జరుగుతుందంటే తాను ఏదైనా చెయ్యడానికి సిద్ధమని చెబుతాడు దధీచి. ఇంద్రుడికి వజ్రాయుధం ఎలా వచ్చిందో తెలుసా? ఒక మహర్షి ఎముకలతో తయారైంది అది,
పూర్వం చాలా మంది మహర్షులు తమ జీవితాలను లోకకల్యాణం కోసం ఫణంగా పెట్టారు. వారి త్యాగాల ఫలితంగానే మనం ఈ రోజు సంతోషంగా ఉంటున్నాం. యాగాలు చేసి మేధస్సును సాధించి దాన్ని లోకం కోసమే ఉపయోగించారు. అలాంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయనే దధీచి.
ఈయన అధర్వణ రుషి, చితిలకు పుట్టిన వాడు. ఈయనకు చిన్నప్పటి నుంచి ఎక్కువగా భక్తి ఉండేది. ఒక ఆవ్రమంలో ఉంటూ భీకరమైన తపస్సు చేస్తూ ఉండేవాడు. విష్ణు మూర్తి ప్రత్యక్షమవుతాడు. మీకు ఏ వరం కావాలో కోరుకో అని చెబుతాడు.

చనిపోవాలనుకున్నప్పుడే చనిపోయేలా
నేను ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడే చనిపోయేటట్లు వరం ఇవ్వు అని కోరుతాడు. విష్ణుమూర్తి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. అన్ని శాస్త్రాల్లో దధీచికి మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఇక ఇంద్రుడి నుంచి బ్రహ్మ విద్యను కూడా నేర్చుకుంటాడు. అయితే ఈ విద్యను ఎవరికీ కూడా నువ్వు నేర్పించకూడదని ఇంద్రుడు దధీచికి చెబుతాడు. ఒక వేళ నా మాట కాదని బ్రహ్మ విద్యను ఇతరులకు నువ్వు బోధిస్తే నీ తల నరికేస్తా అంటాడు.

గుర్రం తలను ఆయనకు అమర్చి
అయితే అశ్వినిదేవతలు తమకు బ్రహ్మ విద్య నేర్పండి అని దధీచిని కోరుతారు. అయితే వారు ఆయన తలను తీసి దాచిపెట్టి గుర్రం తలను ఆయనకు అమర్చి విద్య నేర్చుకుంటారు. తర్వాత ఇంద్రుడికి విషయం తెలిసి దధీచి తల నరికేస్తాడు. అశ్వని దేవతలు దాచి పెట్టిన దధీచి తలను మళ్లీ అతికిస్తారు.

ప్రాణాలను కూడా లెక్కచెయ్యలేదు
తన దగ్గరున్న విద్యలను, తన వల్ల సాధ్యమయే పనులన్నీ దధీచి మొత్తం చేసి చూపించాడు. తన వల్ల ఎవరికీ ఏ అవసరం వచ్చినా సాయం చేసేవాడు. అందుకోసం తన ప్రాణాలను కూడా ఫణంగా పెట్టేవాడు దధీచి.
ఇక వృత్తాసురుడు అనే రాక్షసుడు దేవతల్ని అష్టకష్టాలుపెడుతుంటాడు.

దధీచి శరీరంలోని ఎముకలకు మాత్రమే ఉంది
దీంతో ఇంద్రుడితో సహా దేవతలంతా కలిసి విష్ణుమూర్తికి విషయాన్ని వివరిస్తారు. దీంతో ఆయన వృత్తాసురుడుని చంపగల శక్తి కేవలం ఒక్క దధీచి శరీరంలోని ఎముకలకు మాత్రమే ఉందని చెబుతాడు. ఆయన ఎముకలతో ఒక ఆయుధాన్ని తయారు చేసి దానితో చంపితే ఆ రాక్షసుడు చనిపోతాడని చెబుతాడు.

ఎముకలతో ఒక ఆయుధం
దేవతలంతా వెళ్లి దధీచికి విషయం చెబుతారు. తన వల్ల అందరికీ మంచి జరుగుతుందంటే తాను ఏదైనా చెయ్యడానికి సిద్ధమని చెబుతాడు దధీచి. ఆయనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చనిపోయే వరం ఉన్నందున దధీచి దేవతలు కోరిన వెంటనే మరణిస్తాడు.
తర్వాత ఆశ్రమంలోని ఒక ఆవు ఆయన శరీరాన్ని నాకేసరికి దధీచి శరీరంలోని ఎముకలు మొత్తం ఒక పక్కకు వస్తాయి. ఆ ఎముకలతో ఒక ఆయుధాన్ని తయారు చేసుకుంటాడు ఇంద్రుడు. అదే వజ్రాయుధం. దానికి మామూలు పవర్ ఉండదు. ఆ ఆయుధంతో ఎవరినైనా చంపేయొచ్చు.

ఎముకలకు అంత పవర్
ఇక వజ్రాయుధంతో ఇంద్రుడు వృత్తాసురుడుని చంపేస్తాడు. అయితే దధీచి ఎముకలకు అంత పవర్ ఉండడానికి కారణం.. ఆయన దేవతలకు సంబంధించించిన అస్త్రాలను మొత్తం కమండలంలో వేసుకుని నీరుగా మార్చి తాగి ఉంటాడు.

వజ్రాయుధంతో చంపేస్తాడు
వృత్తాసురుడు దేవతల అస్త్రాలను దొంగలించడానికి వచ్చినప్పుడు దేవతలంతా అస్త్రాలను దధీచికి ఇచ్చి ఉంటారు. అలా దధీచి వల్ల దేవతలు బతికి బట్టకట్టగలిగినారు. తన జీవితాన్ని లోక కల్యాణం కోసమే కేటాయించిన దధీచి నిజంగా స్ఫూర్తిదాయకం.



Click it and Unblock the Notifications