Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
కార్తీకమాసం రోజు ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు.. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది.. ఎలా వెలిగించాలంటే!
హిందువులకు కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసంలో హిందువులందరూ శివుడు, విష్ణువు ఆలయంలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శివకేశవులిద్దరికీ ఎంతో ఇష్టమైన ఈ నెలలో హిందువులు ఆధ్యాత్మిక సాధన, దీపారాధన, దీప దానం, జపం, స్నానం, దానం, ఉపవాసం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అంతటి పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ధనదీపం పేరుతో ఒక దీపం వెలిగిస్తే ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని, ఆర్ధిక సమస్యలన్నీ తొలిగిపోతాయనే నమ్మకం ఉంది.
అయితే ఇంతటి మహిమ కలిగిన ఈ ధనదీపాన్ని ఎప్పుడు వెలిగించాలి? ఎలా వెలిగించాలి? ఏ విధమైన పూజలు చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే..
ఈ పవిత్రమైన, శక్తివంతమైన ధనదీపాన్ని వెలిగించే ముందు ఇంట్లోని పూజ గదిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. అనంతరం శ్రీమహాలక్ష్మి దేవి చిత్రపటానికి గంధం, కుంకుమ, పసుపుతో కలిపిన బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. అనంతరం అమ్మవారి చిత్రపటం ముందు శుభ్రంగా కడిగిన ఒక పూజ పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అనంతరం ఆ పీఠానికి పసుపు, కుంకుమ, గంధంతో కలిపిన బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఆ పీఠంపై ఒక ఇత్తడి పళ్లెంను ఏర్పాటు చేసుకోవాలి.

ఆ పళ్లెంకు కూడా పీటకు మాదిరిగానే పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టుకోవాలి. అనంతరం అందులో గుప్పెడు బియ్యం వేసుకొని.. అందులో పసుపు, కుంకుమ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే ఒక గులాబీ పువ్వు వేసుకుంటే మంచిది. ఇప్పుడు రెండు మట్టి ప్రమిదలను తీసుకోవాలి. అందులో ఒక ప్రమిదలో మూడు యాలకులు, లవంగాలు, కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని బియ్యం ఉన్న పళ్లెంలో పెట్టుకోవాలి.
ఇప్పుడు ఇంకో ప్రమిదను తీసుకొని మొదటి ప్రమిదపై ఉంచాలి. అనంతరం ఆ పై ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసుకొని, అందులో రెండు లేదా మూడు ఒత్తులు చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఒత్తులను అగరబత్తి లేదా ఏక హారతితో వెలిగించుకోవాలి. దీన్నే ధనదీపం లేదా లక్ష్మీదీపం అని పిలుస్తారు. ఈ దీపాన్ని కార్తీకమాసంలో ఏ రోజు అయినా వెలిగించుకోవచ్చు. కాకపోతే గురు, శుక్రవారాల్లో వెలిగించుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలను పొందొచ్చని పండిత నిపుణులు చెబుతున్నారు.
రెండో ప్రమిదలో దీపం వెలుగుతున్న సమయంలో జవ్వాది అనే సుగంధ ద్రవ్యం అందులో కలుపుకోవాలట. దీపం కొండెక్కిన తరువాత మొదటి ప్రమిదలో ఏలకులు, లవంగాలు, రాళ్ళ ఉప్పు, పళ్ళెంలోని గులాబీ పువ్వును ఎవరూ తొక్కని చోటులో వేసుకుంటే మంచిది. పళ్ళెంలోని గులాబీ పువ్వును పడేశాక అందులోని బియ్యంతో పాయసం లేదా నైవేద్యం చేసి లక్ష్మీదేవికి సమర్పించే మంచి ఫలితాలను పొందొచ్చట.
అయితే ఈ దీపం వెలిగించే ముందు బియ్యం పళ్లెంలో ఒక రూపాయి బిళ్ళను వేయాలి. పైన చెప్పబడిన తతంగం అంతా పూర్తయిన తరువాత ఆ బిళ్ళను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఎర్రటి వస్త్రంలో మూట కట్టి.. మీరు డబ్బులు దాచుకునే బీరువాలో ఆ బిళ్ళను అక్కడ పెడితే లక్ష్మీదేవి అక్కడ నెలవై ఉంటుందని నమ్మకం.
గమనిక: ఈ కథనంలో పొందుపరిచిన అంశాలు జ్యోతిష్య నిపుణుల అధ్యయనాలు, ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని అనుసరించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. దీనికి బోల్డ్స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు.



Click it and Unblock the Notifications











