Just In
- 1 hr ago
కీరదోసకాయ తింటే డయాబెటిస్ నివారించవచ్చు? ఎలాగో ఇక్కడ తెలుసుకోండి..
- 4 hrs ago
Monthly Horoscope : మార్చి మాసంలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... మీ జీవితానికి సరికొత్త బాటలు వేసుకోండి..
- 8 hrs ago
సోమవారం దినఫలాలు : ఓ రాశి వ్యాపారులకు భారీ లాభాలు రావొచ్చు...!
- 1 day ago
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
Don't Miss
- Finance
భారీ లాభాల నుండి కాస్త కిందకు, మార్కెట్ లాభాలకు కారణాలివే
- News
మంత్రి ఈటెల కూడా.. ప్రధాని తర్వాత కరోనా టీకా.. ఇవాళే
- Movies
గ్రాండ్గా కన్నడ బిగ్బాస్ 8 ప్రారంభం.. 17 మంది కంటెస్టెంట్లు ఎవరంటే!
- Sports
India vs England: మొతేరా పిచ్పై రోహిత్ ట్వీట్.. ట్రోల్ చేసిన రితిక!!
- Automobiles
భారతదేశం నుండి 20 లక్షల మారుతి సుజుకి కార్లు ఎగుమతి!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Guru Gobind Singh Jayanti 2021 : గురు గోవింద్ సింగ్ గురించి మనం నమ్మలేని నిజాలు...
గురు గోవింద్ సింగ్ అని పిలువబడే ఈ గురువు సిక్కు సమాజంలో పదో గురువు. గురు గోవింద్ సింగ్ జయంతి రోజున సిక్కు ప్రజలందరూ ఒక పండుగలా జరుపుకుంటారు.
సిక్కు ప్రజలు జరుపుకునే మరియు ఆచరించే పవిత్రమైన ముఖ్యమైన సందర్భాలలో ఇది ఒకటి. 2021 ఏడాదిలో గురు గోవింద్ సింగ్ జయంతి జనవరి 20వ తేదీన జరుపుకోనున్నారు.
ఆయన జీవితం మరియు బోధనలు సిక్కు ప్రజలకు ప్రేరణగా చెప్పొచ్చు. ఈ సందర్భంగా గురు గోవింద్ సింగ్ గురించి మీరు నమ్మలేని నిజాలను మేము మీకు తెలియజేస్తాం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

గురు గోవింద్ జననం..
చరిత్రను పరిశీలిస్తే.. గురు గోవింద్ సింగ్ 1666వ సంవత్సరంలో బీహార్ లోని పాట్నాలో గురు తేగ్ బహదూర్ (తండ్రి) మరియు మాతా గుజ్రీ(తల్లి)లకు గోవింద్ రాయ్ గా జన్మించారు.

తొమ్మిదేళ్ల వయసులోనే..
ఈయన తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడే సిక్కు ప్రజల పదో గురువుగా గుర్తించబడ్డారు. గురు గోవింద్ సింగ్ తన బాల్యంలో సంస్క్రుతం, గురుముఖి, హిందీ, బ్రజ్, ఉర్దూ మరియు పెర్షియన్ వంటి అనేక భాషలను నేర్చుకున్నాడు. వీటితో పాటు బలమైన యోధునిగా మారేందుకు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడు.

హిమాచల్ ప్రదేశ్ లో..
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక చిన్న పట్టణం అయిన పాంటాలోని గురువార అయిన పావోంటా సాహిబ్ గురు గోవింద్ సింగ్ చేత స్థాపించబడింది. గురు గోవింద్ సింగ్ తన ముఖ్యమైన బోధనలను పంచుకుని, వాటిని రాసిన ప్రదేశం అదే.

స్థానిక రాజులతో పోరాటం..
గురు గోవింద్ సింగ్ 19 ఏళ్ల వయసులోనే స్థానిక రాజులతో పోరాటం చేశారట. 1688 సంవత్సరం, సెప్టెంబరులో గురువింద్ సింగ్ భీమ్ చంద్, గార్వాల్ రాజు ఫతేఖాన్ మరియు సివాలిక్ హిల్స్ లోని అనేక ఇతర స్థానిక రాజులతో పోరాటం చేశారు. ఈ యుద్ధం ఒక రోజు మాత్రమే కొనసాగింది. దీనిలో గురు గోవింద్ సింగ్ విజయం సాధించారు.

గురువు నిద్రిస్తున్నప్పుడు..
1707లో గురువు నిద్రిస్తున్నప్పుడు తనను చంపేందుకు జంషెడ్ ఖాన్ మరియు వాసిల్ బేగ్ పంపబడ్డారు. గురువు గాఢమైన నిద్రలో వీరు తనను పొడిచి చంపే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో గురువు వారితో ధైర్యంగా పోరాడారు. అలాగే దాడి చేసిన వారిని కూడా మట్టుబెట్టారు.

అక్టోబర్ 7న మరణం..
గురు గోవింద్ సింగ్ 1708 అక్టోబర్ 7వ తేదీన మరణించారు. ఈయన కళలంటే చాలా ఇష్టం. అలా తను కూడా ఎన్నో కవితలు రాసేవాడు. గురు గోవింద్ సింగ్ ప్రకారం, సంఘర్షణను పరిష్కరించే అన్ని పద్ధతులు విఫలమైతే తప్ప ఏ ఒక్కరూ కత్తి ఎత్తకూడదు. అందువల్ల తను అన్యాయం మరియు అణచివేతకు వ్యతిరేకంగా మాత్రమే యుద్ధాలు చేశాడు. అలాగే సిక్కు సమాజాన్ని తన సొంత పిల్లలుగా భావించాడు. ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినందున ప్రజలు అతన్ని ‘సర్వంష్ డాని' అని పిలుస్తారు.