Latest Updates
-
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
Navaratri 2022: దుర్గామత విగ్రహాలకు ఆ మట్టిని వాడతారట... ఎందుకో తెలుసా?
దుర్గామాత విగ్రహాల తయారీ కోసం ఎలాంటి మట్టిని వాడతారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం వినాయక చవితి తర్వాత వచ్చే అతి పెద్ద పండుగ విజయదశమి (దసరా). మరికొద్ది గంటల్లో నవరాత్రుల ఉత్సవాలు కూడా ప్రారంభం కానున్నాయి.

దుర్గా దేవికి అంకితమివ్వబడిన ఈ పండుగను బెంగాల్ రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటారు. అలాగే కర్నాటకలోనూ మైసూరు ఉత్సవాలను దేశంలోనే అత్యంత ఘనంగా జరుపుకుంటారు.

ఇప్పటికే బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్ కత్తాతో పాటు దేశంలోని చాలా చోట్ల దుర్గా దేవి దేవాలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. నవరాత్రుల వేళలో తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ సుదీర్ఘమైన పండుగకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మవారి విగ్రహాలకు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలలో పూజించి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

దుర్గా దేవి విగ్రహాలను కూడా అచ్చం వినాయక విగ్రహాల మాదిరిగానే ఆయా మండపాలలో ప్రతిష్టిస్తారు. అయితే ఇలా ప్రతిష్టించే దుర్గా మాత విగ్రహాలను తయారు చేసేందుకు వేశ్య గృహాల్లోని మట్టిని వాడతారంట. వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇదే నిజమట. అయితే దీని వెనుక కొన్ని రహస్యాలున్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

వారి కోరిక మేరకు..
సెక్స్ వర్కర్లుగా పని చేసే వారు మరియు వేశ్య గృహాల్లో నివసించే మహిళలను ప్రపంచం తరచుగా చూస్తుండగా, ప్రజలు ఆ ఇంటి నుండి కొంత మట్టిని తీసుకురావాలని వేడుకున్నారట.

పవిత్రతను ఇంటి దగ్గరే..
చాలా మంది ప్రజలు సెక్స్ వర్కర్ల ఇళ్లలోకి వచ్చే సమయంలో తమ పవిత్రతను మరియు కాఠిన్యాన్ని వారి ఇంటి దగ్గరే వదలేసి వస్తారని వారు నమ్ముతారు. వారు వేశ్యగృహం యొక్క తలుపులు దాటిన తర్వాత, వారు పాపం మరియు దుర్మార్గపు ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. అందుకే ఈ ఇంట్లోని మట్టిని చాలా పవిత్రంగా భావిస్తారట.

మరో కారణం ఏమిటంటే..
దుర్గా దేవి విగ్రహాలను వేశ్యగృహంలోని మట్టిని ఉపయోగించి తయారు చేయడానికి మరో కారణం కూడా ఉందట. అదేంటంటే.. దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించే సమయంలో.. అతను ఆమెను తాకి, వేధించడానికి ప్రయత్నించాడట. దీంతో ఆ దేవతకు కోపం వచ్చి తన శక్తిని మరియు పరాక్రమాన్ని ఉపయోగించి ఆ రాక్షసుడిని సంహరించిందట.

వారికి గౌరవం కోసం..
సమాజంలో అగౌరవానికి గురైన మహిళలకు ప్రజలందరూ గౌరవం ఇవ్వడానికి కూడా ఈ వేశ్యగృహం నుండి మట్టిని తీసుకుంటారట. దుర్గాదేవి స్త్రీల యొక్క శక్తిని సూచిస్తున్నందున, వేశ్యగృహాల్లోని వారితో సమాజంలోని అట్టడుగు వర్గాల మహిళలను గౌరవంగా చూస్తారని వారు నమ్ముతారు. అంతేకాకుండా ఏ స్త్రీ కూడా అవమానానికి గురికాకూడదని.. స్త్రీల గురించి దుర్భాలాషకూడదని ఇవి సూచిస్తాయట.

మట్టి ఇచ్చే వరకు..
మరో విశేషం ఏంటంటే.. దుర్గాదేవిని వేశ్యగృహాల్లోని మట్టితో తయారు చేసేందుకు.. వారు నివసించే స్థలాలకు వెళ్లి.. మట్టి ఇవ్వమని వారిని వేడుకోవాలట. అప్పుడే వారు పూజారికి మట్టిని ఇస్తారట. ఆ సమయంలో పూజారులు ప్రత్యేక మంత్రాల జపిస్తారు.

మహిళలకు గౌరవం..
ఈ పండుగ నుంచైనా సమాజంలో మహిళలకు మరింత గౌరవం లభిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఈ నవరాత్రి, దుర్గాదేవి మీకు ఎల్లవేళలా శాంతి, బలం, మంచి ఆరోగ్యం, సిరి సంపదలు కురిపించాలని ఆశిస్తూ...
మీ అందరికీ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు...



Click it and Unblock the Notifications