Latest Updates
-
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా!
నిర్జల ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేస్తే కోరికలన్నీ నెరవేరుతాయట..!
నిర్జల ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేయండి...
హిందూ పంచాగం ప్రకారం, ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ప్రతి ఒక్క ఏకాదశికి ఏదో ఒక ప్రత్యేకత అనేది కచ్చితంగా ఉంటుంది. తిథుల ప్రకారం, ఏకాదశి రోజున శుభప్రదంగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ పవిత్రమైన రోజున నీటిని తాగడం మానేస్తారు. అందుకే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. పురాణాలను పరిశీలిస్తే.. ఈరోజును భీమసేన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో జూన్ 10వ తేదీన అంటే శుక్రవారం నాడు నిర్జల ఏకాదశి వచ్చింది. ఈసమయంలో ఉండే ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఈ ఏకాదశి వ్రతాన్ని సక్రమంగా పాటించకపోతే కోరికలు నెరవేరకుండా పోతాయని చాలా మంది నమ్ముతారు. అందుకే నిర్జల ఏకాదశి శుభ ముహుర్తం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

విష్ణుమూర్తి అనుగ్రహం కోసం..
నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయాలి. అలాగే ఏకాదశి రాత్రి వేళ పురాణ కాలక్షేపంతో జాగరణ చేయాలని చేస్తుంటారు. ఇక ఉపవాస విరమణ సమయంలో ద్వాదశి నాడు బ్రాహ్మణులకు ఆహార పదార్థాలను దానంగా ఇస్తారు. అలాగే అతిథులను భోజనానికి పిలిచి, ఉపవాస వ్రతాన్ని విరమించడం వంటివి చేస్తారు. ఈ రోజున ఎవరైనా తమ శక్తి, సామర్థ్యం మేరక దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు.

ఈ పవిత్రమైన జల(నీటిని) దానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయట. దీని వల్ల మీకు అద్భుతమైన ఫలితాలొస్తాయట.
అదే విధంగా నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయంలో మామిడి, పుచ్చకాయ వంటి పండ్లను విరాళంగా ఇవ్వాలి. వీటిని దానం చేయడం వల్ల కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయట.
అదే విధంగా నీటితో నిండిన కూజాను కూడా దానం చేయాలి.
నిర్జల ఏకాదశి రోజున చక్కెరను దానం చేయడం వల్ల మంచి ప్రయోనాలు దక్కుతాయట.
ఈ పవిత్రమైన రోజున మీ సామర్థ్యం మేరకు డబ్బును విరాళంగా ఇస్తే మీ జీవితంలోని దోషాలన్నీ తొలగిపోతాయట.
మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కావాలంటే ఈరోజున కచ్చితంగా పాలు, పాల పదార్థాలను దానం చేయాలి.



Click it and Unblock the Notifications











