Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
నిర్జల ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేస్తే కోరికలన్నీ నెరవేరుతాయట..!
నిర్జల ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేయండి...
హిందూ పంచాగం ప్రకారం, ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ప్రతి ఒక్క ఏకాదశికి ఏదో ఒక ప్రత్యేకత అనేది కచ్చితంగా ఉంటుంది. తిథుల ప్రకారం, ఏకాదశి రోజున శుభప్రదంగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ పవిత్రమైన రోజున నీటిని తాగడం మానేస్తారు. అందుకే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. పురాణాలను పరిశీలిస్తే.. ఈరోజును భీమసేన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో జూన్ 10వ తేదీన అంటే శుక్రవారం నాడు నిర్జల ఏకాదశి వచ్చింది. ఈసమయంలో ఉండే ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఈ ఏకాదశి వ్రతాన్ని సక్రమంగా పాటించకపోతే కోరికలు నెరవేరకుండా పోతాయని చాలా మంది నమ్ముతారు. అందుకే నిర్జల ఏకాదశి శుభ ముహుర్తం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

విష్ణుమూర్తి అనుగ్రహం కోసం..
నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయాలి. అలాగే ఏకాదశి రాత్రి వేళ పురాణ కాలక్షేపంతో జాగరణ చేయాలని చేస్తుంటారు. ఇక ఉపవాస విరమణ సమయంలో ద్వాదశి నాడు బ్రాహ్మణులకు ఆహార పదార్థాలను దానంగా ఇస్తారు. అలాగే అతిథులను భోజనానికి పిలిచి, ఉపవాస వ్రతాన్ని విరమించడం వంటివి చేస్తారు. ఈ రోజున ఎవరైనా తమ శక్తి, సామర్థ్యం మేరక దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు.

ఈ పవిత్రమైన జల(నీటిని) దానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయట. దీని వల్ల మీకు అద్భుతమైన ఫలితాలొస్తాయట.
అదే విధంగా నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయంలో మామిడి, పుచ్చకాయ వంటి పండ్లను విరాళంగా ఇవ్వాలి. వీటిని దానం చేయడం వల్ల కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయట.
అదే విధంగా నీటితో నిండిన కూజాను కూడా దానం చేయాలి.
నిర్జల ఏకాదశి రోజున చక్కెరను దానం చేయడం వల్ల మంచి ప్రయోనాలు దక్కుతాయట.
ఈ పవిత్రమైన రోజున మీ సామర్థ్యం మేరకు డబ్బును విరాళంగా ఇస్తే మీ జీవితంలోని దోషాలన్నీ తొలగిపోతాయట.
మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కావాలంటే ఈరోజున కచ్చితంగా పాలు, పాల పదార్థాలను దానం చేయాలి.



Click it and Unblock the Notifications