Just In
- 32 min ago Car Vastu Tips: కారు ఉందా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి..ఈ డైరెక్షన్ లో పార్క్ చేస్తే
- 1 hr ago Today Raja Yoga: ఈరోజు రాజయోగం ఏర్పడింది: కన్యారాశితో సహా 5 రాశులకు ఆనందం, శ్రేయస్సు
- 5 hrs ago నేటి పంచాంగం: ఈ రోజు ఈ రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి..! ఎవరికీ అప్పు ఇవ్వకండి
- 11 hrs ago చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
Pashupatinath Temple: పశుపతినాథ్ ఆలయం: చరిత్ర, కథ, ఆచారాలు
అనేక మంది హిందువులు తమ జీవన యాత్ర చివరి దశలో ఈ పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. వారణాసిలోని కాశీ శైవ క్షేత్రానికి వెళ్లినట్లుగానే.. పశుపతినాథ్ ఆలయానికి కూడా భక్తులు వెళ్తుంటారు. అక్కడే ప్రాణాలు వదలాలని తాపత్రయ పడతార
Pashupatinath Temple: భారతదేశంలో కాకుండా వేరే దేశంలో ఉండి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే క్షేత్రం పశుపతినాథ్ ఆలయం. ఈ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మాండులో ఉంది ఈ శివాలయం. ఈ గుడి అత్యంత ప్రాచీనమైనది. భాగమతి నది ఒడ్డున కొలువై ఉంది ఈ శైవ క్షేత్రం. ఇక్కడ శివుడు పశుపతి నాథ్ గా పూజలు అందుకుంటున్నాడు. నేపాల్, భారతదేశం నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.
పశుపతినాథ్ ఆలయం ఎందుకంత ప్రత్యేకం?
స్కంద పురాణం ప్రకారం.. పార్వతీ దేవి అత్యంత ముఖ్యమైన శివాలయాల గురించి శివుడిని అడిగినప్పుడు కొన్ని ఆలయాల గురించి చెప్పాడు. భారతదేశంలోని నేపాల్ అంతటా విస్తరించి ఉన్న 68 శివాలయాల ఉనికి గురించి ఆమెకు తెలియజేసాడు. అదే సమయంలో పశుపతి నాథ్ ఆలయం గురించీ వివరించాడు పరమశివుడు. నేపాల్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ప్రకృతి వైపరీత్యాలు తరచూ జరుగుతుంటాయి. కానీ పశుపతినాథ్ ఆలయం అన్ని ప్రకృతి విపత్తుల నుండి బయట పడింది. ఇప్పటికీ ఆలయం ఏమాత్రం చెక్కు చెదరలేదు.
వృద్ధులు ఎందుకు ఎక్కువగా వెళ్తారు?
అనేక మంది హిందువులు తమ జీవన యాత్ర చివరి దశలో ఈ పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. వారణాసిలోని కాశీ శైవ క్షేత్రానికి వెళ్లినట్లుగానే.. పశుపతినాథ్ ఆలయానికి కూడా భక్తులు వెళ్తుంటారు. అక్కడే ప్రాణాలు వదలాలని తాపత్రయ పడతారు. అక్కడ ప్రాణాలు పోతే పరమాత్మ సన్నిధికి చేరుకుంటుందని భావిస్తారు. జీవితంలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు. తద్వార మరుజన్మ ఉండబోదని బలంగా నమ్ముతారు.
పశుపథినాథ్ ఆలయం విశిష్టత
ఒకప్పుడు, శివుడు, పార్వతీ దేవి జింకల వేషంలో లోయలో విహరిస్తున్నారు. దేవతలు అతనిని బంధించి, శివలింగ రూపంలోకి పగిలిన కొమ్ముతో పట్టుకున్నారు. శివుడు జంతు రూపంలో కనిపించాడు కాబట్టి, అతనికి పశుపతినాథ్ (జంతువుల ప్రభువు) అని పేరు పెట్టారు.
ఆలయ శిల్పకళ
* పశుపతినాథ్ ఆలయం 1.58 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.
* ప్రధాన ఆలయ సముదాయంలో 500 కంటే ఎక్కువ చిన్న దేవాలయాలు, మంటపాలు, ఆశ్రమాలు అలాగే నివాస గృహాలు ఉంటాయి.
* ప్రధాన ఆలయం బంక్ పైకప్పు, బంగారు శిఖరంతో కూడిన నిర్మాణం. ఈ పగోడా శైలి నిర్మాణం మెరుస్తున్న పూత పూసిన పైకప్పుతో ఉంటుంది. దాని నుండి గజుర్ అనే బంగారు శిఖరం ఆకాశం వైపు చూస్తుంటుంది.
* ఇది నాలుగు ప్రధాన తలుపులతో కూడిన క్యూబిక్ నిర్మాణంలా ఉంటుంది. వాటిలో మూడు వెండితో మరియు వాటిలో ఒకటి బంగారంతో తయారు చేశారు.
* రాగి పైకప్పు రెండు అంతస్తులతో బంగారంతో కప్పబడి ఉంటుంది.
* చెక్క శిల్పాలు, చూడ చక్కని అలంకరణలు ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణలు.
* ఈ ఆలయంలో భారీ బంగారు నంది విగ్రహం ఉంటుంది.
* శివుని ఎద్దు, దాని భారీ కొలతలు మరియు బంగారు కాంతితో మంత్రముగ్ధులను చేస్తుంది.
* ప్రధాన ఆలయంలోకి విదేశీయులను అనుమతించరు. * పశ్చిమ ఒడ్డును పంచ్ దేవల్ కాంప్లెక్స్ (ఐదు దేవాలయాలు) అని కూడా పిలుస్తారు. ఇది ఒకప్పుడు సాధారణ దేవాలయమే. కానీ ఇప్పుడు పేదలకు ఆశ్రయం కల్పిస్తోంది.
* శివుని కోసం అనేక రాతి దేవాలయాలు ఇక్కడ ఉంటాయి. అవి ఎక్కువగా ఒకే అంతస్థులతో ఉంటాయి.
సందర్శకులు
ప్రధానంగా ఈ ఆలయాన్ని వృద్ధులు ఎక్కువగా సందర్శిస్తారు. వారు తమ జీవితపు చివరి రోజులను గడపడానికి ఇక్కడికి వస్తారు. భాగమతి నది ఒడ్డున ప్రాణాలు వదలాలని కోరుకుంటారు. అందుకే ఇక్కడికి ఎక్కువగా వస్తారు. భాగమతి నదిలో కలిసే వారి బూడిద గంగానదిలో కలుస్తుందని.. దాని ద్వారా పవిత్రత వస్తుందని విశ్వసిస్తారు. భారతీయ మరియు నేపాలీ వృద్ధ హిందువులు ప్రతి సంవత్సరం ఇక్కడకు గుంపులుగా వస్తారు. జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు.
శవాలను దహనం చేసేందుకు వేదికలు
భాగమతి నది ఒడ్డున వృద్ధాప్యంతో, అనారోగ్యంతో మరణించిన సందర్శకులను దహనం చేయడానికి అనేక అంత్యక్రియల వేదికలు ఉంటాయి. ఇక్కడ అనాథ శవాలను కూడా దహనం చేస్తుంటారు. పర్యాటకులు బహిరంగ దహన సంస్కారాన్ని చూసేందుకు కూడా ఇక్కడికి వస్తుంటారు.
కర్ణాటక పూజారుల పూజలు
పశుపతినాథ్ ఆలయంలో కర్ణాటక నుండి వచ్చిన పూజారులే పూజలు చేస్తుంటారు. శృంగేరిలోని దక్షిణామ్నాయ మఠంలో శిక్షణ పొందిన వారు, ఉడిపికి చెందిన వారు ఆ శివయ్యకు పూజలు చేస్తారు.
పూజారులకు ప్రత్యేక శిక్షణ
రుగ్వేద సంప్రదాయాలు, పాశుపత యోగం, శైవాగమాలు, సామవేదాల్లో బాగా ప్రావీణ్యం ఉన్న వారినే ఇక్కడ ముఖ్య పూజారులుగా నియమిస్తారు. పశుపథినాథ్ ఆలయంలో పూజలు చేసేందుకు వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. వీరు శైవ నియమాలు, ఆచారాలు ఔపోసన పట్టి ఉంటారు. 300 సంవత్సరాల క్రితం నేపాల్ రాజు సెయింట్ శంకరాచార్య యక్ష మల్ల ఈ ఆలయంలో జరుగుతున్న తాంత్రిక పద్ధతులను తట్టుకోలేకపోయాడు. అందువల్ల, పశుపతినాథునికి పూజలు చేయడానికి కర్ణాటక నుండి ఐదుగురు అర్చకులను రప్పించాడని చెబుతుంటారు.
UNESCO హెరిటేజ్ సైట్
* పశుపతినాథ్ ఆలయం 1979లోనే UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరింది
* ఈ పశుపతినాథ్ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో కచ్చితమైన తేదీ ఎక్కడా లేదు. కానీ 5వ శతాబ్దం నాటిదని మాత్రం పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు.
* మరికొందరు ఈ ఆలయాన్ని మనదేవ రాజు (464-504 CE) పాలనకు 39 తరాల ముందు ఉందని చెబుతారు.
* ప్రస్తుత నిర్మాణం 1692 నాటిది.