For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rangam bhavishyavani 2020 : కరోనాపై అమ్మవారు ఏమి చెప్పారంటే...!

కరోనా వైరస్ మహమ్మారి గురించి స్వర్ణలత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

కరోనా వైరస్ మన దేశంలో రోజురోజుకు పెరుగుతూనే పోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలే మూడో స్థానానికి కూడా చేరిపోయింది.

Rangam bhavishyavani 2020 : Swarnalatha prediction about coronavirus

మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఈ కరోనా మహమ్మారికి విరుగుడు కోసం దేశవ్యాప్తంగా పలు కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

Rangam bhavishyavani 2020 : Swarnalatha prediction about coronavirus

ఇటీవలే హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ కూడా తమ వ్యాక్సిన్ ట్రయల్స్ సక్సెస్ అయితే వెంటనే మార్కెట్లోకి విడుదల చేస్తామని కూడా ప్రకటించింది. ఇది ఇలా ఉండగా.. కరోనా వైరస్ గురించి ఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా స్వర్ణలత పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీరు ఎలాంటి వివాహం చేసుకుంటారో మీకు తెలుసా?జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీరు ఎలాంటి వివాహం చేసుకుంటారో మీకు తెలుసా?

మీరు చేసుకున్నదే....

మీరు చేసుకున్నదే....

ఉజ్జయినీ మహంకాళి బోనాల కార్యక్రమంలో స్వర్ణలత పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. ‘‘ఎవరు చేసుకున్న పాపాలను వాళ్లు అనుభవించక తప్పదు.. మీరు చేసుకున్నదే కదా.. కట్టడి చేద్దామని అనుకున్నా.. కానీ మీరే చేతులారా చేసుకుంటున్నారు''అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంతోషం లేదు..

సంతోషం లేదు..

‘నాకు సంతోషం అనేదే లేదు రా బాలక.. నా ప్రజలు చేసిన దానికి నేను ఎంతో దు:ఖిస్తున్నాను. నా ప్రజలందరినీ నేను తప్పనిసరిగా కాపాడతాను. అయితే రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి.. ముందుగానే హెచ్చరిస్తున్నా' అని అన్నారు.

భక్తి భావంతో నన్ను కొలవాలి..

భక్తి భావంతో నన్ను కొలవాలి..

‘‘మీరందరూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. రాబోయే రోజుల్లో మీరు తప్పనిసరిగా చేసుకున్నదానికి అనుభవించాల్సి ఉంటుంది. మీరందరూ నన్ను భక్తి భావంతో కొలవాలి.

సిద్ధ న్యాచురోపతితో కరోనాకు చెక్ పెట్టొచ్చు... అదెలాగో తెలుసుకోండి...సిద్ధ న్యాచురోపతితో కరోనాకు చెక్ పెట్టొచ్చు... అదెలాగో తెలుసుకోండి...

ఐదు వారాల పాటు..

ఐదు వారాల పాటు..

ఐదు వారాల పాటు సాకబెట్టి.. నాకు యజ్ణ హోమాలు జరిపించండి. కామంతో, కోపతాపాలతో కాదు.. భక్తిభావంతో చేస్తే తప్పనిసరిగా కాపాడతాను. గడప గడప నుండి నాకు ఫలహారాలు ఐదువారాలు తప్పనిసరిగా రావాలి. మహమ్మారిని తప్పకుండా తొలగిస్తా'నని ఆమె భరోసా ఇచ్చారు.

కరోనా ప్రభావంతో పాటు..

కరోనా ప్రభావంతో పాటు..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండగా.. భక్తులందరూ అమ్మవారు భవిష్యవాణిలో ఏమి చెబుతారో అని చాలా ఆసక్తి చూపారు.

వాస్తు ప్రకారం ఇవి మీ ఇంటిలో తప్పనిసరిగా ఉంచండి...వాస్తు ప్రకారం ఇవి మీ ఇంటిలో తప్పనిసరిగా ఉంచండి...

వర్షాలు, పంటల గురించి..

వర్షాలు, పంటల గురించి..

ఈ భవిష్యవాణి కార్యక్రమంలో ఈ సంవత్సరం వర్షాలు ఎలా కురుస్తాయి? పంటలు ఎలా పండుతాయని, కరోనా వైరస్ ప్రభావం ఇంకెంత కాలం ఉంటుందనే ప్రశ్నలడిగారు. ఇందుకు సమాధానంగా.. ప్రజలంతా చేజేతులా సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని.. రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందేనని అమ్మవారు స్పష్టం చేశారు.

అమ్మవారికి బోనాలు..

అమ్మవారికి బోనాలు..

అంతకుముందు పరిమిత సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకున్నారు. ఇలా అమ్మవారికి బోనాలు సమర్పిస్తే, తమ కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. ప్రతిఏటా ఆషాఢ మాసంలో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.

రాష్ట్ర పండుగగా..

రాష్ట్ర పండుగగా..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఈ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నారు. చరిత్రను పరిశీలిస్తే.. గతంలో కూడా కలరా వ్యాధికి గురై అందరూ ప్రాణాలను కోల్పోతుంటే, అమ్మవారు కరుణించబట్టే, ఆ వ్యాధి తగ్గు ముఖం పట్టిందని పెద్దలు చెబుతుంటారు.

అమ్మవారు పుట్టింటికి..

అమ్మవారు పుట్టింటికి..

అయితే ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వెళ్తుందని, అందుకే భక్తులందరూ ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని, తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చినట్లు భావిస్తారని, అందుకే భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పిస్తారని మరికొందరు చెబుతున్నారు.

English summary

Rangam bhavishyavani 2020 : Swarnalatha prediction about coronavirus

Here we talking about rangam bhavishyavani 2020:Swarnalatha prediction about coronavirus. Read on.
Story first published:Tuesday, July 14, 2020, 18:09 [IST]
Desktop Bottom Promotion