Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
ఓం ‘నమ శివాయ‘ (పంచాక్షరి) మంత్రం ఎలా ఉద్భవించిందో తెలుసా...
శివుడి ఐదు ముఖాలపు పంచ బ్రహ్మలుగా పండితులు చెబుతున్నారు. వాటి పేర్లే ‘సద్యో జాత, వామ దేవ, అఘెరా, తత్పురష, ఈశాన‘. ఈ ఐదు ముఖాల్లోంచే ‘న, మ, శి, వా, య‘ అనే పంచాక్షరి మంత్రం ఉద్భవించింది.
ఈ సృష్టిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకడైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహా శివుడు. ఓం నమః శివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది.

శివుడి ఐదు ముఖాలపు పంచ బ్రహ్మలుగా పండితులు చెబుతున్నారు. వాటి పేర్లే 'సద్యో జాత, వామ దేవ, అఘెరా, తత్పురష, ఈశాన'. ఈ ఐదు ముఖాల్లోంచే 'న, మ, శి, వా, య' అనే పంచాక్షరి మంత్రం ఉద్భవించింది. మరి ఈ మంత్రం స్మరించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో మీరే చూడండి...

ప్రపంచ నాయకుడు పరమేశ్వరుడు..
‘న, మ, శి, వా, య‘ అనే ఐదు ముఖాలకు చైతన్యం ఇచ్చేది సాక్షాత్తు పరమేశ్వరుడు. అందుకే ఈ దేవుడిని ప్రపంచ నాయకుడిగా కొలుస్తారు అని పండితులు చెబుతున్నారు.

పంచ భూతాలు..
ఈ పంచాక్షరి మంత్రం ప్రకృతికి సంబంధించిన భూమి, నీరు అగ్ని, గాలి, ఆకాశాన్ని సూచిస్తుంది. ఈ మంత్ర స్మరణ యజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీ రుద్ర చమకం పూజలో ప్రస్తావించారు.

ఈ మంత్రాన్ని జపిస్తే..
ఓం నమ శివాయ అనే మంత్రాన్ని భక్తులందరూ ఎంతో శ్రద్ధతో స్మరించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మంత్రాన్ని జపించిన వారి మనస్సు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. దీని వల్ల అద్భుతమైన జీవితాన్ని అనుభవించవచ్చు. అంతేకాదు సానుకూల శక్తులు కూడా లభిస్తాయి.

ఒత్తిడి తగ్గుతుంది..
ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల దుష్టశక్తులు మన దరి చేరవు. ఈ మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల మెదడు, శరీరానికి మంచి ఉపశమనం లభిస్తుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు నిద్రలేమి, మానసిక, అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించి ప్రశాంతత లభిస్తుంది.

108 సార్లు జపిస్తే..
ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మనలో కోపం, ఆవేశం తగ్గిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

ఎప్పుడు స్మరించాలంటే?
ఓం నమ శివాయ మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు స్మరించకూడదు. ఈ మంత్రాన్ని జపించేందుకు కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. తెల్లవారు జామునే స్నానం చేసి, నిటారుగా కూర్చోవాలి. కళ్లు మూసుకుని, జప మాల తీసుకుని ‘ఓం నమ: శివాయ‘ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాలి.

జపమాల లేకపోతే..
ఒక వేళ మీ వద్ద జపమాల లేకపోతే... మీరుే మీ వేళ్లతో అయినా లెక్కపెట్టుకోవచ్చు. ఈ మంత్రాన్ని జపించడం 108 సార్లు పూర్తయిన తర్వాత, అలాగే కొన్ని నిమిషాల పాటు కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. దీని వల్ల మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తిని మీ శరీరం గ్రహిస్తుంది.



Click it and Unblock the Notifications











